గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు
*[1]క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు.
క్షాత్రయుగమునాఁటి మనవారి స్థితిగతులను వారి యాచారవ్యవహారములను దెలుపు ముఖ్య గ్రంథములు భారత రామాయణములు. వేల సంవత్సరములక్రింద నుండిన మన పూర్వికులెట్టి యుడుపులను ధరించుచుండిరో తెలిసికొనవలయుననిన మన మా గ్రంథములతో నెక్కువ పనిఁగొనవలసియున్నాము. ఈ యంశమును గుఱించిన వివరములు వానిలోనైనను విస్తారముగా గానరావు. అయినను ఉన్న సంగతులను బట్టి మన మేమి గ్రహించవలయునో చూతము.
పురుషు లాకాలమున ధరించుచుండిన యుడుపులు మిక్కిలి సామాన్యమైనవి. అప్పటివారి యుడుపులనఁగా, ఎక్కువపొడవు తక్కువ వెడల్పుగల రెండు విడి వస్త్రములుమాత్రమే యైయుండవచ్చును. ఒకటి కట్టుకొనఁబడునది, రెండవది కప్పుకొనఁబడునది. మొదటిది నడుమునుండి క్రిందిభాగమును గప్పుచుండెను; రెండవది నడుముమీఁది భాగము నాచ్ఛాదించుచుండెను. ఈయూహ కేవలము కల్పితమైనదని తలఁపఁగూడదు. ఇది సప్రమాణమనుట నిస్సంశయము. ద్రౌపది కౌరవసభలోనికి లాగికొనిరాఁబడినపుడు, దుర్యోధనుఁడు ఆమె చూచుచుండఁగాఁ దన కుడితొడమీది వస్త్రమును దొలగించేనని మహాభారతమందున్నది. దాదాపుగా నిప్పటికాలమున వాడుకయందున్న విధమున ధోవతిఁ గట్టికొనిననేకాని అతఁడట్లు తన కుడితొడను ఆనాచ్ఛాదితముగాఁ జేయుట సంభవింపదు. రాజు మొదలు జనసామాన్యమువఱకు నందఱును ధోవతినే కట్టుకొను చుండినట్లుకూడ తోఁచుచున్నది. భేదమేమైన నుండినచో వస్త్రముయొక్క మృదులత్వమునందును నేతయొక్క సన్నదనమునందును ఉండవచ్చును. ధృతరాష్ట్రృఁడు పుత్రునిశరీరము కృశించి నందునకుఁ గారణమునడుగు సందర్భమున నిట్లనును “నీవు ప్రావారవస్త్రములను ధరించుచున్నావు. మాంసముతో నన్నమును భుజించుచున్నావు. దివ్యాశ్వముల నెక్కి సవారీచేయుచున్నావు. ఇట్టి నీవు కృశించుటకుఁ గారణ మేమి?” (ప్రావారవస్త్రము'లనఁగా నేమో వ్యాఖ్యాత వివరించలేదు. అయినను పైశబ్దమునకు మనము అందమైన వస్త్రములని యర్దము చెప్పిన చెప్పవచ్చునని తలఁచెదను, శరీరోర్ధ్వనాచ్ఛాదించుచుండిన రెండవ వస్త్రమును గుఱించి మనకంతగాఁ దెలియదు. మత గ్రంథములలో వచ్చిన (ఉత్తరీయ' శబ్దమునుబట్టి మన మీ రెండవ వస్త్రముండెనని నిశ్చయించుకొన వలసినవారు మైతిమి. ఈవస్త్రము వెనుకఁజెప్పిన ప్రకారము శరీరోర్ధ్వభాగమున గప్పికొనఁబడుచుండెడిది. కొన్ని వేళలయందు కుడి చేయి ఆనాచ్ఛాదితముగా వదలివేయఁ బడుచుండెను. అట్టి సమయమున నీ యుత్తరీయము కుడిచంక క్రిందినుండి యెడమ భుజముమీఁదికిఁ బోవుచుండెనని యూహింపవలయును. విద్యార్థులు తమ చేతిని బయటకు తీసియుంచవలయునని మనుస్మృతి విధించియున్నది. దీనికి వ్యాఖ్యాత ¶[2] (ఉత్తరీయము కప్పక బయటకుఁ దీసియుంచవలయునని యర్థము చెప్పియున్నాఁడు. పురాతనకాలపు హింద్వార్యులు యుద్ధ సమయములందు ఉత్తరీయమునిట్లే వైచికొని దాని చెఱఁగులను ఎడమభుజము పైనఁ గట్టిగా ముడి వేసికొనుచుండిరని తోఁచుచున్నది.
వెనుకఁ జెప్పఁబడియున్న రెండు వస్త్రములు తప్ప, అధమపక్షము క్షాత్రయుగారంభమున, హింద్వార్యులు మఱేయుడుపులను ధరించియుండినవారు కారు. లాగు లు జాకెట్లు ఎట్టివో వారెఱుఁగరు, కోట్లు చొక్కాలు వారికిఁ దెలియవు. బట్టలను గత్తిరించి తీరుతీరు ఉడు పులుగా గుట్టుట ఆకాలమున లేదు. కుట్టుపని మొట్ట మొదట బహుశః *[3]'సెమిటిక్కు'లలోఁ బుట్టినదై యుం డవచ్చును. అది గ్రీకులు పంజాబు దేశమును జయించిన కాలముననో, అంతకుఁ బూర్వము హింద్వార్యులకు పా రసీకులతో సంబంధము కలిగినట్టి డెరయసు పరిపాలన కాలముననో మనదేశమునఁ బ్రవేశించి యుండవచ్చును. రామాయణమున †[4] కుట్టుపనివాఁడు వచ్చియున్నాఁడు. కాని మహాభారతమున వానిజాడ ఎచ్చటను కానరాదు. ఇంతమాత్రమున మహాభారతము రచింపఁబడిన కాలమున కుట్టుపనివాఁడు ఉండనేలేదను ×[5] అభావవాదమున కవకాశము లేదు. అది యటుండనిండు. మొత్తముమీఁద క్షాత్రయుగారంభమున హింద్వార్యులలో పురుషులు రెండు వస్త్రములలో నొకదానిఁ గట్టికొని రెండవదానిఁ గప్పుకొనుచుండిరని విశ్వసించుటయందభ్యంతర మేమి యును లేదు.
ఆకాలపు స్త్రీలు సైతము రెండు వస్త్రములనే ధరిం చుచుండిరని తోఁచుచున్నది. అయినను వీరివస్త్రము లు పురుషుల వస్త్రములకంటే నెక్కువ పొడవుగా నుం డెడివి. కట్టుకొనఁబడు వస్త్రము శరీరోర్ధ్వభాగమును గూడ_అనఁగా భుజములవఱకు గప్పియుంచుచుండె ను. చేతులను మాత్రము దానితో కప్పుకొనక విడిగా నుంచుచుండిరి. గుజరాతు, బంగాళము, మద్రాసు, ద క్కనులలోని స్త్రీలు నేఁటికిని అట్లే తమ చీరెలఁ గట్టు కొనుచున్నారు. ఉత్తరీయము తలపైనఁ గప్పుకొనుచు సమయమువచ్చినపుడు దానిని మునుకుగా వేసుకొనుచుం డిరి. ఉత్తరహిందూస్థానమం దిప్పటికిని స్త్రీలు ఉత్తరీ యమును విధిగా ధరించుచుందురు. దక్షిణహిందూ దేశ మండు ఇప్పుడు వాడుకలోనున్న చీరెలు పొడవుగానుం డుటవలన వేస్తే యుత్తరీయము అనవసరమయినది. ఉ త్తర హిందూస్థానమున ఇప్పటివలెనే పూర్వమునఁ గూడ స్త్రీలు బయటికిఁబోవునపుడు మాత్రమే యుత్తరీయము ను ధరించుచుండిరి.
ద్రౌపదిని అంతఃపురమునుండి బలాత్కారముగా కౌ రవసభకు ఈడ్చుకొనివచ్చిన సందర్భమును వర్ణించుచు మహాభారతమున వ్రాయఁబడిన సంగతులు పైయభిప్రా యమును బలపఱచుచున్నవి. సభాంగణమున నామె పలుమాఱు 'నేను ఏకవస్త్రను' 'ఏకవస్త్రను' అని జా లిపుట్టునట్లు మొఱ పెట్టుకొనెను. దుర్యోధను నాజ్ఞాను సారము ఆయేకవస్త్రమును గూడ వదల్ప యత్నించిరి. ఈ సంగతులను విచారించి చూచితిమేని ఆకాలమున స్త్రీలు కట్టుకొను వస్త్రము నులభముగా నూడివచ్చునట్లు ధ రింపఁబడుచుండెననియు, మొలనూలువంటి దేదియు నుం డలేదనియు, ఇప్పుడు ఉత్తరహిందూస్థానమునందు వా డుకలోనున్న లంగావంటిదానిని వారు తొడుగుకొను చుండలేదనియు తేలుచున్నది. లంగావంటి వస్త్రమే యెనయెడల నంత యవలీలగా నూడియుండునా ? ఆకా లమున రవిక యనఁబడునదికూడ నుండలేదని తోఁచు చున్నది.
ఈ సందర్భమున నొక చిత్రము చూడఁదగియున్నది. పురాతన కాలపు గ్రీకు స్త్రీ పురుషులు ధరించుచుండిన యుడుపులను హోరు వణి౯ంచి యున్నాఁడు. అవి మన హింద్వార్యుల వస్త్రములను బోలి యున్నవి. హోమరు కాలపు స్త్రీ ముసుగుగాక "ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగలట్టిది యాదేశములోనే తయారయినట్టిదియు కత్తిరింపు గాని కుట్టుపని గాని లేనట్టిదియు నగు నొక వస్త్రమును గట్టుకొనుచుండెను; ఆ వస్త్రము భుజముపైన నొక సూదితోను నడుముచుట్టు మొలనూలుతోను బిగింపఁబడుచుండెను; చేతులు బయట నే యుండుచు వచ్చెను".¶[6]పురుషులకు మొలనూలు ఉండలేదు. పైన సుల్లేఖింపఁబడిన ముసుకు హింద్వార్య స్త్రీల యుత్తరీయమువంటిదే యని వేఱుగాఁ జెప్పఁబని లేదు. “హోమరుకాలపు స్త్రీ దుః ఖసమయములందును, స్వతంత్రముగా నేదయిన పని చే యవలసివచ్చినప్పుడును, ముసుకును తీసివేయుచుండెడిది” సీత తన్ను పరుఁడొకఁడు బలాత్కారముగా చెఱఁగొని పోవునపుడు ఆసమాచారము భత౯ కెఱుకపఱచు నుద్దేశ ముతోఁ దన యుత్తరీయమును వానరసేనాపరీవృతుఁడ గు సుగ్రీవుఁడుండిన ఋష్యమూకము పైనఁ బడవైచెను, కనుక హింద్వార్య స్త్రీయును హోమరు నాఁటి స్త్రీయును ఉత్తరీయము నొక్కొకమారు వదలివేయుచుఁగూడ నుం డిరి. హిందూ స్త్రీవలెనే హోమరుని స్త్రీకిఁగూడ కం చుక ముండలేదను సంగతి హోమరు వణ౯నములవలన నేమి పురాతన గ్రీకుల విగ్రహములవలన నేమి మనకుఁ దెలి యుచున్నది.
దక్షిణహిందూస్థానమున నిప్పుడు వాడుక యందున్న గోచీ పెట్టుకొను పద్దతి ఆకాలమున లేదని తోఁచుచున్న ది. గోచీ పెట్టుకొను నాచారము స్త్రీలలో నా కాలము న నుండినయెడల ద్రౌపది కట్టు పుట్టము దుశ్శాసనుఁ డ ట్లు ఊడఁ గుంజుటకు వీలులేకయుండును. మహాభారత మునం దెచ్చటను నీ గోచీమాట రానేలేదు. బాలురకు ఉపనయన సమయమున కౌపీనము పెట్టించు పద్ధతి ననుస రించియే స్త్రీలలో నిట్టి యాచారమారంభమై యుండవ చ్చును. పురుషులకు ఉపనయనమెట్టిదో స్త్రీలకు వివా హమట్టిదగుట చేతనే కాఁబోలు వివాహితలయిన స్త్రీ లవిషయమున మాత్రమే గోచీపద్ధతి విధింపఁబడియున్న ది. దక్షిణ హిందూస్థానమందు సయితము కన్యలు గోచీ లేకుండ నే బట్టగట్టుకొనుచున్నారు. క్షాత్రయుగమున ను త్తరీయమును గౌరవనీయురాండ్రు మాత్రమే ధరించు చుండిరి. కావుననే ద్రౌపది సైరంధ్రి వేషముతో విరా టునిపురమున నుండినపుడు ఏకవస్త్రగానే సుధేష్ణ యొద్ద కు వచ్చినది. X[7] బహిష్టులుగా నున్నప్పుడుకూడ స్త్రీ లకు ఉత్తరీయముతోఁ బని లేకయుండెను. ఇంట గృహకృత్యములను నెరవేర్చువేళ సయితము వారుత్తరీయము ను వేసికొనకుండిరి. వితంతువులాకాలమునఁ దెల్లని యు త్తరీయముల ధరించుచుండిరి. అరణ్యముననుండిన ధృత రాష్ట్రుని దర్శించుటకై అతని కుటుంబములో నివారగు వితంతువులు పాండవుల రాణివాసముతోఁబోయినప్పుడు వారు తెల్లని యుత్తరీయములను ధరించి యుండిరని చె ప్పఁబడియున్నది. *[8] దీనిఁబట్టి యాలోచింపఁగా, తెల్ల నియుత్తరీయము వితంతువులకొఱకు మాత్రము విధింపఁ బడి యుండెననియు తదితర స్త్రీజనము ఎఱుపు నలుపు మొదలగు రంగుల యుత్తరీయములను వేసికొనుచుండిర నియు తేలుచున్నది. ఇప్పటి కాలమున వితంతువుల వస్త్రములు ఎఱ్ఱఁగానుండిన మంచిదని తలఁచుచున్నారు. ఇది ప్రాయశః బౌద్ధభిక్షునుల పద్ధతి ననుసరించి వచ్చిన యాచారమై యుండవచ్చును. వివాహితలగు స్త్రీలు క ట్టుకొను బట్టలుకూడ వేఱు వేఱు రంగులు కలవిగా, నుం డవచ్చును. కట్టికొనువస్త్రములును ఉత్తరీయములును ఇప్పటి కాలము వానివలెనే అంచులుకలపై యుండెనని తోఁచెడివి.
ఇంక శిరోవేష్టములను గురించి విచారింతము. ఆకాలమునను స్త్రీలకు శిరోవేస్టము లుండినట్లు కానరాదు.వారి తలలకు టోపీకాని మఱేదయిన నాచ్ఛాదనముగాని యుండలేదు. ¶[9] వితంతువులు తెల్లని వస్త్రములను గుఱించి వెనుక నుల్లేఖింపబడిన శ్లోకపు మొదటి చరణము 'ఏతాస్తుసీమంతశిరోరుహాయ్యాః' అనునది. ఇది చతుర్ధరుని గ్రంథమునందలి పాఠము. అతఁడు దీనికి బదులుగా (ఏతా స్త్వసీమంతశిరోరుహాయాః' అని యుండిన నింతకంటె బాగుండునని వ్రాసియున్నాఁడు. పాపటను చూణ౯ముతో నలంకరించుటకై వెంట్రుకలను రెండు పాయలుగాఁ దీని తలముడుచుటకు 'సీమంత' మని పేరు. ముత్తయిదువులగు స్త్రీలు మాత్రమే ఈవిధముగా తలలముడిచికొనుచుండిరి. కనుక వితంతువులను ఇట్టి యలంకరణము లేనివారినిగా వణి౯ంచుట సహజము. ఇంతేకా దు. “సర్వజనసంహారము జరిగి పృథ్వియంతయు శోకమయమై ఉత్తమ స్త్రీల సీమంతము తీసి వేయబడినప్పుడు..." అను సర్ధముగల శ్లోకము కము *[10] కూడ సీమంతము పోవుట వైధవ్యము యొక్క ముఖ్యలక్షణమని స్పష్టముగా జాటుచున్నది.
మర్యాదగల పురుషులు వెంట్రుకలను ముడి వేసికొనుచు బయటికి వచ్చినపుడు తలగుడ్డ పెట్టుకొనుచు నుండిరి. ఈ తలగుడ్డ పద్ధతి హిందువులు స్వయముగా నేర్పఱచుకొనినదేకాని ఇతరులను జూచి నేర్చుకొనినదికాదని తోఁచుచున్నది. ఇప్పటివలెనే ఆకాలమునందును వారు ధరించు తలగుడ్డ యొక పొడుగుపాటి వస్త్రము. దీనిని వారు తలచుట్టును వివిధములుగాఁ జుట్టుకొను చుండిరి. యుద్ధరంగమునకుఁ బోవు సమయమున భీష్ముఁడు 'తెల్ల తలరుమాలు'ను ధరించినట్లు చెప్పఁబడి యున్నది. ద్రోణుని విషయమునఁగూడ నట్టి వణనయే కలదు. కనుక వయసుమీరినవారి శిరోవేష్టము సాధారణముగా తెల్లరంగుది గాను యౌవనుల తలగుడ్డ యెర్రఁగానో లేక ఏదయిన మరియొక రంగుదిగానో యుండవలెను. హిందువుల తలగుడ్డలు గ్రీకులకు విచిత్రముగఁ గాన్పించినట్లు తోఁచుచున్నది. కనుకనే 'ఏరియను' గ్రంధకారుఁడు 'ఇండికా' యను గ్రంధమున నిట్లు వచించియున్నాఁడు. "హిందువులు దూదితోఁ జేయబడిన యొక వస్త్రమును గట్టుకొనెదరు. అది మోకాళ్ళకును చీలమండలకును మధ్యభాగము వఱకుండును. ఇదిగాక వేఱొక వస్త్రమును పయిన వేసికొందురు. దీనిలో కొంతభాగమును వారు భుజములపయినఁ గప్పికొని తక్కిన భాగమును తమ తలకుఁ జుట్టుకొ నెదరు”.†[11] “ఏరియను చెప్పినట్లు ఒకటే వస్త్రమును తలకుఁ జుట్టుకొనుటకును శరీరమును గప్పికొనుటకు గూడ వాడుకొనువారు బహుళః బీదవారయి యుండవలెను. గొప్పవారి తలగుడ్డ ప్రత్యేక వస్త్రమై యుండవచ్చును. 'కటికాయను రూఫను' అను గ్రంథకారుఁడు హిందూ దేశమును హిందువులను వణి౯ంచుచు “వీరు తమ శరీరమును పాదములవఱకు మృదువయిన సన్నని వస్త్రములతో నాచ్ఛాదించుకొనెదరు. పాదుకలు తోడి గెదరు; దూదితోఁ జేయఁబడినబట్టను తలకుఁజుట్టి కొందురు."¶[12] అని చెప్పియున్నాఁడు. అయినను అప్పటి తలగుడ్డ ఇప్పటికాలమున మనదేశమందలి కొన్ని ప్రాంతములలోనున్నంత చిక్కులు కలదిగాను పొడుగుగాను ఉండలేదని తోచుచున్నది. దానిని జుట్టుకొను పద్ధతి బహుశః ఇప్పుడు ఉత్తర హిందూస్థానములోని పేదవాండ్ర పద్ధతివంటి దై యుండవచ్చును. ప్రతివాఁడును తన తలగుడ్డను తానే చుట్టుకొనుచుండెను. రాజులు మాత్రము కిరీటముల ధరించుచుండిరి. దుర్యోధనుఁడు భీమునితోఁజేసిన తుది ద్వంద్వయుద్ధసమయమున కిరీటము అతని తలపైనుండెను. భగ్నోరుఁడై నేలఁబడిన పిమ్మట నాతని తల పయిన నది యట్లే నిలచియుండెను. కావుననే భీముఁడు దాని కాలితోఁ దన్నఁగలిగెను. ఆ కాలమున కిరీటము శిరమునకు గట్టిగా బిగింపఁబడుచుండెననియు బంధముల వదలించిననేకాని వీడిరాకుండ నుండెననియు మనమూహింపవచ్చును.
హిందువుల వస్త్రములు తఱచుగా దూదితో "నేయబడుచుండెడివి. ఆకాలమున హిందూదేశమున తప్ప మఱెచ్చటను ప్రత్తి పండుచుండుటలేదు. ఈజిప్టులోగాని టర్కీలోగాని యదిపండుచుండునట్లు కానరాదు. ఆట్లు కాదేని “హిందువులు చెట్లపైనఁ బండు ఉన్నితోఁ జేయఁబడిన వస్త్రములను ధరింతురు” అని గ్రీకులు వ్రాసియుండరు. ధనవంతులు అందు ముఖ్యము గా పట్టుబట్టలు ధరించుచుండిరి. X [13]రాజాంత: పురములలోని స్త్రీలు “తకాళేయ వాసినులు" గా వర్ణింపఁబడియున్నారు. పురుషులుకూడ పసుపుపచ్చని బట్టలు ధరించుచుండినట్లు కానవచ్చుచున్నది. మనదేశములోని కాశ్మీరము, పంజాబు, గాంధారములలో బహుళః ఉన్ని బట్టలు కూడ వాడఁబడుచుండెడివి. భరతుని తాతయగు కేకయరాజు మనుమనికి కంబళాజినముల నేకములు బహుమాన పూర్వకముగా నిచ్చినట్లు రామాయణమునందున్నది. ఇప్పటి కాలమున నెట్లోయట్లే క్షాత్రయుగమునందును* [14]సొగసైన నేతయును, మిగుల వెచ్చఁదనమును గలఉన్ని శాలువలకు పంజాబు కాశ్మీర దేశములు ప్రసిద్ధివహించి యుండవచ్చును, నూలుబట్టలు వీనికంటె నెక్కువ సన్నని నేతఁ గలిగియుండి రాణివాసము వారును గొప్పవారును ధరించుటకుఁ దగినవిగానుండెనని భారత రామాయణములు చెప్పుచున్నవి.
నూలు, పట్టు, ఉన్నితో మాత్రమేకాక గడ్డితోఁగూడ వస్త్రములు నేయఁబడుచుండెనని వీర కావ్యముల వలనఁ దెలియుచున్నది. వీనిని తాపసులు ధరించుచుండిరి. సీతారాములు తాపస వేషములతో నరణ్యమునకుఁ బోవునపుడు వారు కుశనిర్మితములగు వస్త్రములు ధరించి యుండిరి. అట్లే పాండవులు అరణ్యావాసమునకుఁ జనినప్పుడు అజినములను ఉత్తరీయములు గావాడుకొనిరి. X[15]ధృతరాష్ట్రుఁడు వానప్రస్థుఁడు గాన నరణ్యమునకుఁబోవు వేళ వల్కలాజినములను ధరించెను.[16]ఋషులును ఇతర తాపసులును వల్కలాజిన ధారులుగా వర్ణింపఁబడియున్నారు. ఒక వీర కావ్యములలోనే కాక, వాని తరువాత రచింపఁబడిన వందలకొలఁది గ్రంధములలో తాపసులు ధరించు వల్కలాజినములు వచ్చినవి. కాని ఇట్టి వస్త్రములు ఏగడ్డితోఁజేయఁ బడుచుండెనో ఎట్లు చేయ్యబడుచుండెనో కానరాదు. ఇప్పటికాలమున మాత్రము మనదేశమున కేవలము గడ్డితోఁ జేయఁబడు వస్త్రములు ఎచ్చటను కానఁబడవు. అయినను ఒకప్పుడు మనదేశమందు గడ్డితోఁ జేయఁబడు వస్త్రములుండెనను సంగతి మాత్రము నిజము. "ఈ హిందువులు గడ్డితోఁ జేయఁబడు బట్టలను గట్టుకొనెదరు. వారు నదులలో రెల్లునుగోసి తెచ్చి చీల్చి చాపవలెనల్లి వస్త్రముగా ధరింతురు,” అను 'హీరోడోటసు' వ్రాత వైయంశమును బలపఱచుచున్నది.
మాడపాటి హనుమంత రావు.
| సీ. | వంకరపాగతో ♦ వలెవాటుతోఁ దంబు-రాతోడ నారంగ ♦ రాయ చరిత | |
| గీ. | చేతనముదాల్చి సరసమై ♦ చిత్తరంజ | |
- ↑ క్షాత్రయుగమనఁగా మన దేశ చరిత్రములోని యొక నిర్ణీతకాలము, ఈశాలమున మనదేశమునందలి వీరకావ్యములుగు రామాయణ భారతములు రచింపఁబడి నందున దీనికి క్షాత్రయుగమని పేరు పెట్టఁబడినది. పాశ్చాత్యవిద్వాంసులును వారి ననుసరించిన మనవిద్వాంసులును ఈయుగముయొక్క పరిమితివేయిసంవత్సరముల (క్రీ. పూ, ౧౨౩౦ నుండి క్రీ. పూ. ౨౦౦(300) సంవత్సరములవఱకు) దాని సిద్ధాంతీకరించియున్నారు. సి.వి.వైద్యా ఎం.ఏ., ఎల్.ఎల్,బి. గారు క్షాత్రయుగ వైశాల్యమును ఇంచుమించుగా క్రీ. పూ. 3000 నుండి క్రీ. పూ ౨౫ం వఱకు నిర్ధారణ చేసియున్నారు. వీరి యభిప్రాయముతో నంద జెకీబవించకపోయినను, వీరు చెప్పిన యంశములను వివరములను మనము పాశ్చాత్యవిద్వాంసులచే నిశ్చయింపఁబడిన క్షాత్రయుగమునకే వర్తించునవి యని యూహించుకొనవచ్చును. వైద్యాగారి మతిమున భారతయుద్ధము క్రీ- పూ. 3000 వ సంవత్సరమున జరిగినది- గ్రంథము తరువాత కొలఁదికాలమునకే వ్రాయఁబడినని వారభిప్రాయపడుచున్నారు.
- ↑ నిత్యముద్ధృతపాణిస్యాత్
- ↑ ఇది ఏష్యూండముయొక్క పశ్చిమభాగమున నుండిన యొక జాతి,
- ↑ తున్నవాయి
- ↑ అభావవాదమనఁగా, ఒక గ్రంధమున ఒకానొక వస్తువు ప్రసక్తి లేదు కనుక ఆగ్రంధము రచించఁబడిన కాలమున అట్టివస్తువే యుండలేదని వాదించుట.
- ↑ Women of Homer by Walter Capt. Perry.
- ↑ వాసశ్చ పరిధాయైకం కృష్ణా సుమలినంమహత్|విరాట | F ౨
- ↑ శుక్లోత్తరీయాం నరరాజపత్న్యః ఆశ్రమః ౨౫ ౧_
- ↑ బయటకు వెడలినప్పుడు మాత్రము వారు తలలపై నుత్తరీయమును నిశ్చయము
- ↑ శ్లో॥ సంహారేనర్వతోజాతే వృధివ్యాం శోకసంభవే ॥ బహూ నాముత్తమ స్త్రీణాం సీమంతో ద్ధర వేతధాః కల్య" ఆ౧l _౨౦
- ↑ Ancient India. Megasthanes and Arrian by Mac Crindle P.210
- ↑ ¶ Invasion of India by Abxander. Mac Crindle P. 188.
- ↑ శ్లో॥ సుద్రాంత్వరమాణాన్చి రక్తకౌశీయవాన్ పార్టీ ప్రస్తావయామాన కృత్పి గోపాలశావపు ఆది। ఆ౧౧డ
- ↑ సానూనబృహతీగౌరీ సూక్ష్మ కంబల వాసినీ౹౹ కర్ణ౹౹ ౧౩
- ↑ శ్లో తతఃపరాజితాఃపాధా వనవాసాయదీ తాః | అజినాన్యు త్తరీయాణి జగృహశ్చయధాక్రమం సభా॥
- ↑ తతఃపరాజితాఃపాధా వనవాసాయదీ తాః | అజినాన్యు త్తరీయాణి జగృహశ్చయధాక్రమం సభా॥ 1