Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/కేంద్రగ్రంథాలయము, బరోడా

వికీసోర్స్ నుండి

కేంద్ర గ్రంథాలయము, బరోడా

మహారాజు వారిని బరోడా రాజ్యమునం దీది ముఖ్యపుస్తకా వారము. దీని కార్యక్రమ నిర్వాహకమునకు శ్రీమహారాజా గయిక్వార్ అమెరికాదేశము నుండి గ్రంథభాండాగార వ్యాపనా కుశలుండ గు బోర్డనుదొరగారిని పిలిపించెను. బోర్డను దొరగారు ప్రప్రథమమున నొక సంవత్సర ముండుటకై కోరఁబడిరి. మరి రెండు సంవత్సరములవరకు వదలి పెట్టలే -దు. బోర్డను దొరయాజమాన్యముక్రింద బరో డారాష్ట్రమునం దెల్ల భాగములను 451 గ్రం ధాలయములు స్థాపింపబడినవి. క్రొత్తక్రొత్త పుస్తకనిలయములు స్థాపింపబడనిమాస మొ క్కటియునులేదు. తాను స్వయముగ పాటు పడి వ్యాపనముఁ జేయుటయేగాక తత్కార్య మునం దనేకయువకులకు బోర్డనుదొర నిరు పమానమగు నా వేశమునుగలిగిం చెను.

కేంద్రగ్రంధాలయమున 57296 గ్రంథము లును, 3000 పాఠకులును గలరు. పాఠకుడు ఒక్కనికి సాలునకు 19 గ్రంథముల చొప్పున జదివిరి. అమెరికా దేశమునందలి పురాతనగ్రం క థభాండాగారములుగల బ్రాన్ఫర్డు, క నెక్టికట్ పట్టణములయందలి పాఠకులుగూడ నింతటి కంటె విశేషముగాఁ జదివియుండ లేదు.

ఈ భాండాగార చర్యయం ద నేక శాఖలు కలవు.

1. బాలశాఖ:—ఇందన్ని వయసుల బాలు రకు నుపయుక్త ములగు పుస్తకములనేకము 9D 2 విరికు వయసుగల బాలురకు 88 బొమ్మల పుస్తకములు వి శేషముగా సమకూర్పఁ బడినవి. గ్రంధాలయముయొక్క గోడలయం దును వ స్తుపాఠ బోధకములగు పటము లనేక ము లలంకరింపఁబడినవి. పిల్లలకు వినోదముల మూలమున విద్యగరపఁబడు చున్నది. బాలుర లాలించుటయందు స్త్రీల కెక్కువ సామర్థ్య ముకలదు గనుక ఈశాఖ కధ్యక్షపదవికి నొక స్త్రీయే నియమింపఁబడినది.

2. క్రీడలు:—గ్రంధాలయమున క్రీడ లే మిటికని చదువరుల కందరికిని గొప్ప సందేహ ముకలుగవచ్చును. కాని మనమిప్పుడు య దార్థమును గూర్చి మాట్లాడుచుంటిమి కాని కల్పనాకధలనుగూర్చి కాదు. యదార్థమైనను మనకు వింతగా నేయున్నది. దీని రహస్యమును దెలిసికొనుట యొక కష్టసాధ్యమైన పనిగాదు. “గ్రంధాలయముయొక్క కార్యక్రమము ద్వివి ధము, వినోదపరచుట. విద్యఁగరపుట. గ్రం ధాలయమును ద్రొక్కిచూడనిమనుష్యు లనే కులు కలరు. అట్టివారి నాకర్షించుటకు క్రీడ లు మిక్కిలిసామర్థ్యముకలవి. ఒకేపనిని చా ల సేపు చేయుచుండుట చేత విసుగు జెందిన మన సుగలవారికి క్రీడలు బు బుద్ధిమాంద్యమును రించి సంతోషమలవర చుటకు సిధౌషధము లువంటివి.

3. ప్రదర్శనశాఖ:— మాజిక్ లాంటరన్ (వింతలలాంతరు) మొదలగు యంత్రముల సా హాయమున ననేక విషయములు జనులకుఁ బో ధింపఁబడుచున్నవి. ఈ కార్య మొక సంవత్స రముజరిపిచూచుటకుగాను, మహారాజా గయిక్వార్ 10,000 రూప్యము లొసంగెను. రెండుమాసములలో నీశాఖవారు 14 స్థలము లలో 36 ప్రదర్శనములనొసంగిరి. ప్రతి ప్రద ర్శనమునకును సగటున వేయిమంది జనులు వచ్చిచూచిరి. ఇందు ముఖ్యముగా విదేశపరి శ్రమలనుగూర్చినట్టియు, వ్యవసాయములఁగూ ర్చినట్టియు విషయములు ప్రదర్శింపఁబడుచు వ చెను. జనులు వీనియందాదరమును మెండు గౌఁజూపుచువచ్చిరి. '

ఈ కేంద్రగ్రంధాలయమునుగూర్చిన విశే షాంశ మింకొకటికలదు. ఇందు ప్రపంచకము నందంతటనుగల వివిధ పరిశ్రమలను గూర్చిన వివరణపట్టీలు సంపాదింపఁబడి జాగ్రత్త పెట్ట బడినవి. కృషి, పరిశ్రమ, గృహకృత్యవిషయ ములలో నేవిషయములు నేనిఁ దెలిసికొనగోరి వారును, ఏవస్తువుల నేనిఁ కొనఁగోరు వారును ఆజాబితాలను జూచి సర్వమును గ్రహించి వచ్చును.

ఇంతేగాక, యీ గ్రంధాల యాధ్యక్షులు వ్యవసాయపుఁ బనిముట్లను ప్రదర్శనార్థము ప్రతిపట్టణమునకునుఁ బ్రతిపల్లెకును దిప్పి, ప్ర జలకు నాటి యుపయోగమును బోధించుచు న్నారు.


సర్వకళాశాల గ్రంథాలయము, బొంబాయి.

ఢిల్లీ దర్బారుసమయమున శ్రీ జార్జిచక్రవ తి౯,జనసంఘముయొక్క విద్యాభివృద్ధికి యే బదిలక్షల రూప్యముల మెసంగెనుగదా. అం దుండి బొంబాయి రాజధానివారు మూడు లక్షల రూపాయల రొక్కమును, సంవత్సర మునకు 45 వేల రూప్యముల ఆదాయమును .* సర్వకళాశాల కొసంగిరి. ఈధనము మెసగు నప్పుడు సర్వకళాశాలాధ్యక్షుఁకు శ్రీబొంబా యి > వర్నరుగారు దానిని వ్యయపరచుటను గూర్చి కొన్ని సలహాలను జెప్పెను. అందులో ముఖ్యమైనదొకటి గ్రంధాలయమును గూర్చి-

“బొంబాయి రాజధానియందు మంచి స్థితి లోనున్న గ్రంధాలయము లేకపోవుటచే, 'ఉ న్నతవిద్య కెంతయు నవకాశము లేకున్నది. స ర్వకళాశాలకు పుస్త కాగారమున కనువగు మందిర మొకటి కలదుగాని, యవసరములగు పరికరములందు సమకూర్పఁబడలేదు. ప్రస్తు తమీ గ్రంధాలయము తగినస్థితిలో లేదు. శిక్ష నందిన యధిపతి లేనిలోపముచే సర్వకళాశాల కత్యగత్యమైన యీగ్రంధాలయము ప్రస్తుత మిందలి విద్యార్థుల కెంతమాత్రమును నుప యోగకరముగానుండుట లేదు. ఇట్టి లోపము ను నివారించుట కిది మంచి తరుణము. పట్ట పరీక్షాభద్రుఁడగు కుశాగ్రబుద్ధిగలవాని నొక ని కార్యక్రమము నెఱింగివచ్చుట కొక సంవత్సర ము ఐరోపాఖండమునకుఁబంపవలెను. గ్రంథ సామగ్రికూడ వి శేషముగావృద్ధిఁ జేయవ లెను” అని చెప్పబడినది. సర్వకళాశాల వార్తా సల హాను మన్నించి సంవత్సరమునకు 6500 రూ ప్యములచొప్పున గ్రంధసామగ్రిని వృద్ధిచేయు టకును, సంవత్సరమునకు 3500 రూప్యముల వెచ్చించి గ్రంధాలయాధ్యక్ష పదవికి నొకనికి ఐరోపాలోగాని, అమెరికాలోగాని విద్య నే ర్పించుటకును తీర్మానించిరి.