Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రుల జనహితపరత్వము

వికీసోర్స్ నుండి

ఇకముందు చేయవలసిన పని.

ఆంధ్రగ్రంధవిభజన విషయమునందు నాకుగల అభిమానమువలన నేనీ పనినిర్వహింప మొట్టమొదమొదట నొడంబడితినిగాని పని ప్రారంభించిన వెంటనే అది దరి లేని మహాసాగరమువలె గనవట్టెను. ఆపనిని తృప్తికరముగ నెరవేర్చుట గుతగిన సాధన సామగ్రి కాలవ్యవధి నాకు చాలని తెలిసెను. ఇక ముందు చేయవలసిన పనులు రె౦డువిధములు. (1) నేను చేసిన పనియందు నిప్పుడుజూపినవి లోపములుగానున్న యెడల వాటినిసవరించవలెను.(2) నాకు దొరకని, ఇంకను, కనీసము రెండు వేలవరకు ఉండవచ్చను. ఆంధ్ర గ్రంథనామములను తత్కర్తల నామములతో సేకరించి ఆయాతరగతుల క్రింద విభజించి అకారాదిగా పట్టికలను తయారు చేయవలెను. ఈ రెండుపనులను జేయుట, అందుకుతగిన సాధన సామాగ్రిగల చెన్న పట్టణమునగాని, వేరుచోట సాధ్యముగాదని తోచుచున్నది. ఇరువది, ముప్పది సంవత్సరములుగా నచ్చుబడుచున్న గ్రంధనామముల నన్నిటిని విషయములతో సహా బ్రచురించు ఫోర్టు సెంట గెజెట్లు అక్కడనే దొరుకును. ఈ సామగ్రికి తోడు, ఆధునిక ప్రసిద్ధ గ్రంధకర్తల పేర్లు, వారొనర్చిన గ్రంధ నామములు, మరియు పెద్ద పెద్ద ఆంధ్ర గ్రంధ భాండాగారములు గ్రంథపట్టికలు. గూడనవసరము. వీలయిన యెడల వావిళ్ళ రామస్వామిశాస్త్రులవారి పుస్తకాలయముల వంటి విక్రయ శాలల యందుండు గ్రంధములను స్వయముగా జూచి విషయములను గ్రహించి సరిగా తరగతులక్రింద విభజించుటకు అవకాశముకూడ కలిగించవలెను.

కావున ఈ ఆంధ్ర గ్రంధ భాండాగార ప్రతినిధులసభవారు పైవిషయములను ఆలోచించి సరియైన ఆంధ్రగ్రంధ విభజనమును గావించి, దానిని పుస్తక రూపమున అచ్చొత్తించుటకు తగిన ప్రయత్నములు చేయుదురుగాక యని ప్రార్ధించుచున్నాను.

ఆ౦ధ్రుల జనహిత పరత్వము

.మద్రాసునందు బ్రచురింపబడు హిందూపత్రికయందు ఒక యుపవిలేఖరి యిట్లు వ్రాయుచున్నాడు.

ఆంధ్రులెంతమాత్రమును లోకహిత కార్యములందు వెనుదీయు వారుకారు. అందులకీ క్రిందియంశములే నిదర్శనములు. కార్య మొనర్చినచో నిండ్లలో పొరుపులు పుట్టి గృహసౌఖ్యమునకును భంగము కలుగునో అట్టి సంఘ సంస్కరణ విషయమునగూడ గాఢతత్పరులగువారీ యాంధ్రసంఘమునందున్నారు. లెక్కలేని రాజకీయ సమావేశములును సభలను వారికి నీవిషయమునగల పట్టుదలకు నిదర్శనములు ; ఇటీవల జరుగుచున్న కమ్మవారు వైశ్యులుమున్నగు కులసభలవలన నాగరకోద్యమములందు వెనుకబడిన సంఘము లేతీరున మేల్కొనుచున్నవను సంగతి స్పష్టమగుచున్నది. ఈ రాజధాని యందలి తక్కిన సంఘముల వారికంటే నాంధ్రులే తమ భాషాభివృద్ధివిషయమున నెక్కుడు శ్లాఘ్యమగు శ్రద్ధనుగొనుచున్నారనుట యాంధ్రుల పక్షమున నొక్కి చెప్పవలసిన విషయమే. దొరతనమువారివలన నెట్టి సహాయమును బొందకయే, ముఖ్య గ్రామములన్నిటియం దేశ భాషా గ్రంధభాండాగారములను స్థాపింప బ్రయత్నించుచున్నారు. ఈ ప్రయత్నములందు వీరికి జాలవరకు జయముగ ఉన్నది. పల్లెయందుగాని పట్టణమందు గాని నివసించుచు నేమాత్రమైన జ్ఞానముగల ప్రతివానికిని స్వదేశాభివృద్ధి విషయను అందులో ముఖ్యముగ నాంధ్రమండలాభివృద్ధిని గురించియు నపరిమితమగునుత్సాహము జనింపజేసిన యీ యాంధ్రోద్యమెంతయు బ్రశంసనీయము, ఏదేశమునకైన నెట్టేసఁఘమున కైన కీర్తిన్ దెచ్చునంతటి ప్రజానాయకులును కార్యతత్పరులు ఇచ్చటగలరు. ముఖ్యములగు పట్టణములన్నిటి యందును డంబమునకు గాక యధార్థముగ కార్యములను బూనుకొని తోశ్పర్యముతో నిర్వహించు యౌవనులు కలరు.