ఆముక్తమాల్యద/ఉపోద్ఘాతము
ఆముక్తమాల్యద
(విష్ణుచిత్తీయము)
ఉపోద్ఘాతము
కృతి : కృతికర్త
కృతి గుణవిశేషములకు కృతికర్త ప్రతిభాపాండిత్యాదులవలెనే తజ్జీవితవిధానమును అప్పటి దేశకాలపరిస్థితులును కొంత కారణ మని విమర్శకనిపుణులు చెప్పుదురు. 'Periclean age' 'Augustan age' 'Elizabethian age' 'Victorian age 'Gupta golden age' అని యిట్టిపేరులు వినంబడుచుండును. అవి దేశకాలపరిస్థితి జ్ఞాపకములె. అట్లే ఆష్టదిగ్గజములం బ్రఖ్యాతము అని కృష్ణదేవరాయలకాలమునకును గొప్పపేరుప్రసిద్ధులు గలపు. మఱియు దైవికముగను ఒక్కొక్కప్పుడు గొప్పకవులు పుట్టుదురు. నాఁటి చరిత్రచర్చ నేఁడు వలదు కాని, తేలినవిషయమును ఇట్లు ఉదాహరింపఁదగును.
వంశపరంపరగా విజయనగరమునకు నరసింహప్రభుని యనంతరము అతని పెద్దకొమారుఁడు వీరనరసింహుఁడు కొంతకాల మేలి చనిపోగా తదనంతరము చిన్నకొమారుఁడు కృష్ణదేవరాయఁడు ముప్పయైదేండ్లవాఁడు మంచియనుభవశాలి క్రీ. శ. 1509 లో రాజ్యపట్టాభిషిక్తుఁ డాయెను. టెంకణాదిత్యుఁడు నన్నెచోడుఁడును నెల్లూరిదొర మనుమసిద్ధియు తాము సూర్యవంశమువారు అను నభిమానము వహించినట్లు 'కలశపాథోరాశి గర్భవీచిమతల్లి కడుపార నెవ్వాని గన్నతల్లి' అని యాచంద్రునివంశమువాఁడు తాను అని కృష్ణదేవరాయఁడును అభిమానము వహించినవాఁడు. పటాభిషేకము కాఁగానే అతఁడు తొడంగి కడంగి దిగ్విజయము చేసి దక్షిణభారతమందు క్రీ శ.1620 నాఁటికి తనప్రభావమును సుప్రతిష్ఠితము గావించి, ఉత్తరభారతమున సైతము లోడీ సుల్తానులను తనకు అరిగాపులు గావించుకొని అభ్యుదయపరమోచ్ఛ్రితిం బొందెను. అట్టి యభ్యుదయకాలము దేశమున నిజముగా గొప్పకవులయు కావ్యములయు కాలముగా నుండును. కళలును శిల్పములును విశేషవికాసము పొందును. అన్నింటికిని విజయోత్సాహి యగు రాజు నాదరము పోషణ యుండును. అట్లే గదా, వీరుఁడును జేతయు నగు కృష్ణదేవరాయఁడు తాను గొప్పపండితుఁడును మహాప్రతిభాశాలియు మహాకవియు, వీణావాదనాదికళలందును ఆరితేఱినవాఁడు కవిపోషకుఁడు కాకుండునా? అన్నిభాషలకవులు కళాభిజ్ఞులను పోషించుటయు కాక, అష్టదిగ్గజములు అను ఎనమండుగురు ఆంధ్రమహాకవులను, వారికి తనయాస్థానమున పే ర్వేఱ స్థానాసనములు ఏర్పఱిచి నిత్యకవితాగోష్ఠులు సమకూర్చుచు ఆనందించుచుండెను. వీనిచేత రాయల లోకానుభవము లోకవిశాలమును సాగరగంభీరమును అగుననుటకు సందియ మేమి? ఎటు గన్నను ఆరాజ్యమున ఒక తృప్తి ఒకయుత్సాహము ఒకపొంగు మిన్నంది వెలుంగుచుండెను.
మఱియొక విషయము. కృష్ణదేవరాయుఁడు మతమున వీరవైష్ణవుఁ డాయెను. ఆయన ప్రియమిత్రులు ఆస్థానకవిచక్రవర్తియు నగు పెద్దనయు వీరవైష్ణవుఁ డాయెను. ఆమతావేశమును ఒకయసాధారణమహోత్సాహమును పెంపొందించును. అది యట్టిమతావేశకాల మని కృష్ణదేవరాయఁడు తన గ్రంథాంతమున ప్రస్తావము తెచ్చి ఒకశఠకోపయతిని వర్ణించుచు సూటిగాను విలక్షణముగాను సూచించినాఁడు (చూ VI-66). "అతంత యిటమీఁద యాదవగిరి టెంకణంబు పాషండసంకులంబు గావచ్చినఁ, దచ్చ్యుతికి శఠకోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున నంధ్రాదివిషయవిద్వజ్జనంబుల నధోక్షజవిషయవాదభిక్ష వేఁడి దిగ్విజయంబు సేసి గరుడకుధరగుహాకుంఠనృకంఠీరవంబు కుహనాత్రిదండియై బ్రుసీకుసుంభాంబరాంభఃకుండిక లొసంగ నంగీకృతాంతిమాశ్రముండై, ఫణిప కణభుగక్షపాద బాదరాయణ కపిల జైమిని శాసనంబులు మఠమహాసనమహీసురులు మున్నుగా నెంతే వాసి నంతేవాసులకుఁ దెలివిపఱుపం బరమహంసానుష్ఠానపరకాష్టయై, పదయుగప్రసన్నభువనప్రపంచపంచజనహృదయభవనంబులం బద్మాపద్మాక్షులు వల్లేర్లు దుడిచి పాడెక్క భక్తి బోధించి భూతలంబుఁ బావనంబు సేయగలవాఁడు" అని. క్రీస్తు శకము 1200 నాటికే శ్రీరామానుజాచార్యుల మతదిగ్విజయము ముగిసి, వైష్ణవమతమునకు సకలాభ్యుదయములు గూడి దక్షిణభారతక్షేత్రములకు దేవళములకు జనులకు వ్యాపించి బలము గొనుచుండెను. తరువాతను అప్పుడప్పుడు గొప్పగొప్ప యాచార్యులు ప్రభవించుచు దాని బలమును వ్యాప్తిని పెంపొందించుచుండిరి. ఆమార్గమున రాయలికాలమున ఒకక్రొత్తయతీశ్వరుఁడు శఠకోపముని అహోబలమున మఠము స్థాపించి విశేషముగా 'నీరంధ్రవాదమున ఆంధ్రాదివిషయవిద్వజ్జనములను' తనమతమున కలుపుకొని రాజుల నందఱిని కథా సంగ్రహము 9 సామంతులను సార్వభౌముని తత్ప్రవణులం జేసెను. మఱియు శిలాశాసనాధ్యాకరముల వలన తెలియవచ్చునట్లు ఆది మహామాధ్వమతాచార్య సార్వభౌమ వ్యాసరాయల విభవకాలమును. మాధ్వమతమును నాకర్షికమగు ఒక గొప్ప వైష్ణవమతము. వ్యాస రాయ మహిమయు ' వాచామగోచరము. ' కావున ఆకాలము, యూరపులో 'రినేషన్స్' 'రిఫర్మేషన్' అను మహాసంస్కృతులు వ్యాపించిన కాలమును ఒకింత పోలినది క్రొత్త మతాల పర్షణవలన పూర్వపు' శైవమునకును తన్ను చక్కఁబెట్టుకొను పోటీ యుత్సాహమును కొంత వర్ధిల్లును. ఇందును అందునుం గూడ కవివీరుల. రచనలు పుట్టకుండ.నా? శ్రీకృష్ణదేవరాయఁడు మనసు కరగిన మహాథ కుఁడు. తీర్థయాత్రలు గావించినవాఁడు. దక్షిణభారతమున వెక్కు దేవాలయములలో గోపురమండప ప్రాకారాదికములు కట్టించినవాఁడు. ఆభరణములు సమర్పించినవాఁడు, నిత్యోత్సవ విశేషోత్సవములకు ఏర్పాటులు గావించినవాఁడు. అన్నింటికిని చాలునట్లు, ఎప్పటికిని విలువక అన్నియు జరుగగలయట్లు భూ దానాదికము లొసంగినవాడు. నిష్ఠతో ఆహ్నకాన స్థానము లం బాటిఁచు ననాతన ధర్మశీలుఁడు. క్రొత్తవైష్ణవవుఁ గటకు గలవాఁడు, మహా: వి. కావున ఆయనకు "మున్నేఁ గళింగదేశ విజిగీషా మనీషం దండెత్తిపోయి, విజయవాటిం గొన్ని వాసరంబు లుండి శ్రీకాకుళ నికేతనుఁడగు నాంధ్రమధుమథను సేవింపం బోయి హరివాసరోపవాసం నప్పుణ్యరాత్ర చతుర్థయామంబునఁ గలలో ఆదేవుఁడు పశప పళన ప్రత్యక్షమై తనకు__అనఁగా తానే యైన నిజేష్ట దేవత యగు వేంక టేశునికి అంకితముగా దేశ భాష లందు లెస్సయైన తెనుంగిన ఆముక్తమాల్యద పెండ్లికథం జెప్పి తనకు మాలాకార సుదాన దత్త మాలాధారణ జుగుప్సం బాపు మన్న స్వప్నవృత్తాంతము విశ్వసనీయమ కాని పట్టికల్పనగాదని తలంపఁదగును. కావున కడు భ • 司 - ఇచ్చటఁ ప కిపుర స్సరముగాను దేవుని చెప్పుఁగోరు వినూతనోత్సా హముతోను అష్టదిగ్గజముల మించు పూనికతోను, వస్తువు క్రొత్త మార్గమున క్రొత్త మెఱంగుతో నుఁడవలయు నను తత్పరతతోను రాయఁడు ఇందులకు కడంగినాఁ. డనుటకు సండియము లేదు. అట్లే క్రొత్త మార్గమున ప్రకాశించునదిగానే తనకు మఱి సాటియే లేనిదిగానే తోడై యున్న భగవదనుగ్రహమున అది కుదిరినది. ఇదే ఆ కథ - సంగ్రహము పాండ్యదేశమున శ్రీవిలుబుత్తూ రను నగరంబు నెలంగు, అందలి మేడలు ఆపిన మంటును, వీథులు మగరా నెలకట్టులై పార్శ్వముల కొబ్బరిచెట్లతో సూత్ర ఆము క్రమాల్యద - ఉపోద్ఘాతము పట్టినట్లు వంపులు లేక అందముగా నుండును. అండు ద్రావిడాంగనలు డిగ్గియల స్నానము చేసి దివ్యప్రబంధ మనుసంధించుచు గృహదేవతపూజకు అంబుజములు కోసి చేతఁగొని మంచినీటి బిందెలతో ఇల్లు చేరుచుందురు. ఆ వీరి యరంగులమీఁద ఆటవెలఁదులు పాచికలతో జూద మాడుచుందురు. వారు ఎంతో నాగరకులు, విలాసపతులు. ఆచటి పూఁదోటలలో అన్ని పూవులు పూచుచుండును. చేలలో అన్ని వరులును పండ:చుండును. అందు సుగంధి యఁఁటి తోఁటలలో పెద్ద గెలలు నేల దాక వ్రేలుచుండును. చెఱకుతోఁటలును. పైకి తములవుదీగెలు ప్రాచీన పోక మాకులును ఎంతో అందముగా నుండును. మామిడితో (పులుల గలవు. ఆ యూరిలో మన్నారు కృష్ణుని దేవళము గలదు. దాని చెంత లక్ష్మికి ఒక రథమును మన్నారు స్వామికి ఒక రథమును, మేరుమందరములంలోనివి కలవు. ఆచఁ బాగవతులు ఆతిథ్యాగంతుక భాగవతులకు మిక్కిలి భక్తితో భోజనాది సత్కారముల గావింతురు- అందు ఉత్తమోత్తముఁడుగా విష్ణుచిత్తుఁడు ఎచదువు లేకయే పూర్వజన్మ కృత పుణ్యఫలముగా ఆచార్యకృపచే తన శేషత్వము నెఱింగి మిక్కిలి కుతూహలముతో అచటి దేవునికి తులసి పూలమాలలు కట్టి సమర్పించు కైంకర్యము నేయుచు నిరంతరము భాగవత సపర్యతో కాలక్షేపము నేయుచుండెను. ఆసమయంబున పాండ్యదేశమునకు రాజధాని మధురాపురి. దాని కోట ఆకాశ మంటును, అగ డ పాతాళము ద్యాను. మేడలు నక్షత్రమండల మతిక్రమించును. అందలి కాంతల పొలయలుకను మేడలందు స పరులు తీర్చి కాంతులం గూర్తురు. పుష్పలావికలు విటులతో మిక్కిలి సరసోక్తులాడుచు పూవు లమ్ముదురు. సాయంకా లము నగరవీధుల తిన్నెలపై గట్టివార్సితులు పరిమళ ద్రవ్యములను కప్పురము జవ్వాది లోనగువానిని ఆమ్ముచుందురు. ఏనుఁగులు మదించి మాటవిననివై మావటీలచే వెలఁకువతో వీథులం ద్రిప్పఁబడుచుండును. ఆజానేయములును అతి వేగవంతములు ఎంతో సుందరములై ఒప్పారుచుండును. ఆయూరి వెలయాండ్రు మిక్కిలి యందగ త్తెలై సురతవై యాత్యనిధులై చెలువొందుదురు. అంగళ్ళు నవరత్నరాసులతో మెఱయు చుండును. బ్రాహ్మణులు జవయజ్ఞశీలురు. క్షత్త్రియులు 'వజ్రదోశ పరిఘులు ' . 'వజ్రద్రోఃపరిఘులు'. వైశ్యులు కోట్లకు పడగలెత్తినవారు. శూద్రులు కొండలుగ ధాన్యరాసులను పండింతురు. తోఁటలలో అన్ని జాతుల పూలు పూఁచును, అన్నివిధాల పండ్లు పండును. అందు చంద్రవంశమువాఁడు మత్స్యధ్విజుఁడను రాజు పాలించుచుండేను. అతఁడు చతురుపాయనేది, షాడ్గుణ్య చక్రవర్తి, ఇంద్రు నైననూ ఓడించఁగల విలు షాడ్గుణ్యచక్రవర్తి, క థానంగ్రహము K కాఁడు. గొప్ప చాత తన రాజ్యమును ఈతిబాధ లేక రక్షించువాఁడు. అతని విభవకాలమున ఎప్పటివలెనే యెక గ్రీష్మర్తువు వచ్చినది. అంతట సెలయేళ్లలో నీళ్లు ఇగిరినవి, దున్నలు పందులు తాపమునకు బురఁ లో పొరలఁ జొచ్చినవి. వేఁడి సుడిగాడ్పులు ! దావా ్నలు! సూర్యుఁడు. ఎంతసేపటికిని క్రుంకఁడు. చెరువులో నీరు మోకాలిబంటి యయ్యెను. తోఁటలలో ఏతాలతో నీరు పాటించుచుండిరి. మల్లెలు పూచి నవి. చలిపందిళ్లలో బావసారులు ఎండవడకు అమ్మ అక్క అని చేతులొగ్గియు. మర సేటును తినుచు అచటి తరుణులు పోయు నీరు త్రాగుచుండిరి. శ్రీమంతులగు ధన్యులు పగిలు దగ్గియలో ఈదులాడి రాత్రి దఱపివెన్నెలణయ్య ప్రియల గూడి రతులఁ దేలుచుండిరి. ఆవేసవిలో రాజు ఒక రాత్రి యిల్లు వెడలి మఱియొక వీధిలోని తన భోగిని యింటికి సవిలాసముగఁ బోవుచుండి దారి యరఁగుపై వెన్నెలలో పరుండి ఉబుసుపుచ్చుచున్న బ్రాహ్మణులతో నొకఁడు చెప్పు సుభాషితమును “వినియె నెల ల్చతుర్ధ్వయిని వృష్టి దీనాళికి, రాత్రికై దివం బున, జరకై వయస్సునన, బూని పరంబున కిప్పు, డుద్యమం బనువుగఁ జేయఁగా వలయు నంచుఁ బురోహితధర్మ మాత్మ గి ల్కొన నల వివుఁ డాద్విజులలోన సుభాషితము సృఠింపఁగ జా, విని, తద్గ్రంథార్థము నె మ్మనమున నూహించి, తెలిసి, మ్రాన్పడి, కడకుం దన మోసమునకు భయపడి, జనపతి యటు చనక నిలిచి, సంతాపమునకా. ఎక్కడి రాజ్యవై భవము ? లెక్కడి భోగము ? లేటి సంభ్రమం ? బక్కట! బుద్బు: ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపు జక్కి గణింపకుంటి; యుగసంధులు నిల్చియుఁ గాలుచేతి బల్ త్రొక్కుల నమ్మనుప్రభృతులుఁ దుది రూపఱ కుండనేర్పిరే! ఉన్నట్ల యుండ నద్దరి కి న్నరులను నావ చేర్చు క్రియ వెనఁ దాఁ చో కున్నట్ల యుండి కాలం బు న్నరులకు వయసుఁ బుచ్చి మోసముఁ దెచ్చు కానఁ దటిచ్చలము రా జ్యానందము మరఁగి యింద్రియారాముఁడనై 8 ఆము క్తమాల్యద…ఉపోద్ఘాతము పో: నింతనుండి పరలో కానందంబునకె యత్న మాపాదింతుజ," L అని నిజపూర్వపుణ్య పాకమున తటాలున మంచి తలంపు కలిగి అట్లు నిశ్చయము చేసికొని, ఓంగమున నానా మతసిద్ధాంతముల పండితులం గూర్చి, వాదించి తత్వముం గెలుపుఁ డని కోరెను. అంతట వాదము ప్రవర్తిల్లుచుండఁగా, నాఁడు విల్లుపుత్తూరిలో మన్నారుస్వామి ఆవిష్ణుచిత్తుఁడు తప్ను సేవింప వచ్చినప్పుడు ఆయనతో నీవు మధురకు త్వరగా పోయి రాజనర్లలో ఓరు చున్న పంతత్వ వాదములో చేరి, అందు నా మహిమను ప్రకటించి స్థాపించి ఆరాజును వైష్ణవుంగావింపుము, వాదమున నీకు జయము నేను సేకూర్చెదను అని చెప్పి భయముతీర్చి ఒప్పించి పంపెను. విష్ణుచిత్తుఁడును అట్లు మధురకుం బోయి రాజసభ చొచ్చి, అన్ని మతాలవారిని ధీరముగా నెదిరించి, 'గురుముఖ మనధీత్య ప్రాహ వేదా నశేషాజ్ ' అన్నట్లు నేరువుతో వాదించి గెలిచి, రాజు ఏర్పఱిచిన శుల్క మును ఒడిచికొనెను. అంతట ఆయన ఆమత్స్యధ్వజునితో 'తెలిసినది గదా, ముముక్షువునకు ఉపాశ్రయణీయుఁడు శ్రీమన్నారాయణుండు. నీవు ఈ భక్తియోగము సాధింపుము' ఆనియు, మరల 'నంతకన్న సులువు సుపాయము భవద్గీతలో అర్జునునకు భగవంతుఁ డుపదేశించిన నర్వధర్మాణాు పరిత్యజ్య, మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆను శరణాగత ధర్మము కలదు.' అనియం బలికి అతని చిత్తవరిపాకము గ్రహించి' అతనికి మూలమంత్రమును ద్వయమును ఉపదేశించి అతనిని భాగవత ప్రధానం నా వించెను. అంతట అట్లు తనకు పేరుపైన ఆవాదజేతను విష్ణుచిత్తుని ఆరోజు మిక్కిలి సత్కరించి ఏనుఁగుమీఁద మహావిభవముతో ఊరేగించెను. అప్పుడు ఆయనకు గరుడ వాహనుఁడు ప్రత్యక్షమై ఆయన 'జయజ' యని పాడిన తిడప్పల్లాండును దశాన కార స్తోత్రమును చిత్తగించి అనుగ్రహించి, విశ్వకర్మతో విల్లుబుత్తూరులో ఆయన యింటిని మణిమయమును సర్వవస్తుసమృద్ధమును 'గావింపుమని ఆనలిచ్చి అంతర్హితుఁడయ్యెను. విష్ణువిత్తుఁడును విల్లుత్తూరికి మరలి అచటి దేవాలఁప ధర్మాధికారులు ఎదురొని తన్ను బ్రహ్మరథమున అతి పరిఢవముతో నూరేగించి దేవళము సేర్ప, ఆయన కథా సంగ్రహము స్వామిని సేవించి, సెలవు గొని, తన యిల్లు నేరవచ్చి, రత్నకాంచనమయమయి యున్న దానిని, ఆశ్చర్యముతో దేవుని మహిమను తలపోసికొని ప్రవేశించి, 'తొంటికంటే' శత గుణఁబుగా భాగవతపూజాప్రవణుండై మాలా సమర్పణ కైంకర్యరతుండై కాలము పుచ్చుచుండెను. అంతట నొక్కనాఁడు మధ్యాహ్ననమయ 'మాలికానమారోపణానంతరమున మందిరంబునకుఁ బోవు నాతనిం జూచి మన్నారుస్వామి తన ప్రేయసికొననెను. “మునుపు యామునార్యునివలె నేఁడు ఈమహాత్ముఁడు మన దర్శనం బుద్దరించినాఁడు గదా.' అని, అంత ఆమె తా నేఱుంగని యామున చరిత్రముం జెప్పుమనెను. అంతట స్వామి చెప్పం దొడంగెను. పరమభక్తుఁడైన నాథముని మనుమఁడు ఆ యామునాచార్యుఁడు బాల్యమందే గురు : కులమున వేదశాస్త్రముఖ్యవిద్య అభ్యసించుచుండ, మధురలో ఈ మత్స్యధ్వజుని పూర్వుఁడే ఒకఁడు రాజ్య మేలుచుండి, వెళ్లిశైవము ముదిరి విష్ణుస్తోత్రము చెవిం బెట్టక తద్విగ్రహమునకు మ్రొక్కక, హరుఁడె పరతత్త్వము ఆని, వైదిక బ్రాహ్మణులు బూజింపక, జంగము దేవరలను పూజించుచు, విష్ణ్వాలయములను పాడుపెట్టి జంగాల మఠములు కట్టించెను. రాజ్యమున దండన సత్కారములందును వైష్ణవద్వేషమున శైవ నక్షపాతమును బాహాటముగా అవలంబించెను. మఱి ఆతని భార్య రాణి తాను మిక్కిలి విష్ణుభక్తురాలై, తన విభుఁడు ఇట్లాయెనే యని అపారమనోవ్యథకు' పాలాయెను. ఆమె హరివాసర ద్వాదశీ వ్రతములను కడువిష్ణుతో జరిపియు పాతివ్రత్యమును వీడక ప్రతి చిత్తమును చూఱకొనుచుండును. ఆమె రహస్యముగా అంతఃపుర పశ్చిమ ద్వారమున యాచకులకు తన నౌకరులచే దానము లిప్పించి కోరికలు తీర్చుచుండును. శ్రియఃపతి ఆభక్తను అనుగ్రహింపఁగోరి, యామునపండితునికి ఆరాజునాస్థానమునకుం బోయి రాజు నెదు ఓ వాదముచేసి శైవమును ఖండించి విష్ణుపరత్వమును స్థాపింపవలయునను తలంపు పుట్టించెను. ఆయనయు ఆ పశ్చిమద్వారము సొచ్చి, రాణిం గాన్పించుకొని ఆమెతో విష్ణు తత్త్వంబె పరతత్త్వమని వాదించి గెలిచెద, నీవిభుండు నీయం దనురక్తుండు, నీకు విధేయండు, విన్నవించి నన్ను రప్పించి వారము సేయింప నోపుదేని వాదించి గెలిచి నీకర్తకు భగవద్భక్తిఁబుట్టించి కృతార్థుం గావించెదనని విన్నవించెను. ఆమెయు భర్తకుం జెప్పి అప్లై యేర్పాటు గావించెను, భర్త భార్యతో వాడమునకు ఇట్లు పందెము 1 నిబంధించెను. 10 అము క్తమాల్యద -ఉపోద్ఘాతము ని తనిసి తీసి మరల ఆ బుట్టలోనే పెట్టుచుండినది. దానిచే ఆమె క్రమముగా ఆ ప్రియు ని వియోగపు బాధను ఓర్వలేనిపై చెలులతో ఆయన పూర్వావతారములలో తన్ను వలచిన ముగుదలను వలవంతపాలు సేయుటను స్మరించి చెప్పి ఆయనను దెప్పం జొచ్చినది. “వామనుఁడై లక్ష్మీ దేవిని, పరశురాముఁడై భూదేవిని, శ్రీరాముఁడై రాజ్యలక్ష్మిని శూర్పణఖను అయోముఖిని, తన్ను వలచి స్త్రీత్వముగోరి మునిబృందము తరువాతి జన్మ మున వల్లవలు కాగా, ఆఁగృష్ణుఁడై వారిం గూడియు అంతలో పాసి మధురకుఁ బోయి అట్లు విరహిణ. లం జేసి వారిని, అలయింపలేదా? గోపికలు అందఱును తనకుఁ గూర్చినవారైననః తాను రాధ నొక్కతెం గూడి, తక్కినవారిని ఉడికింపలేధా." అని ఇట్లు వియోగ వేదనాభరమున ఆమె నానాటికి కృశించుచున్నది. రాత్రులు నిదుర లేక చింతలం బొగలుచున్నది. అప్పుడు ఉన్మ తయై తనలో "ముకుంద, నాఁడు వేణు వు ఊది ఆ మందసతుల నట్లు మరుగొలిపి ఇంటినుండి లేచి వచ్చునట్లు చేసితిని గదా ! రాధా, నీకుఁ దగవా గోపికా వళిని పొక్కించి అట్లు నందనందన భోగము గుత్తగ నీవ కైకొనుట? అమ్మా, యమునా, నీవు నిజముగా యమునవేనే. నీ యిసుకదిన్నెలపై విరహాగ్నిలో గోపికలను అట్లు పొరలించి ప్రేల్చితివి ?" అని పలికిన ప్రలాపములు విని, చెలులు 'నీవు పోయిన జన్మాన సత్యభామనే !' అనఁగా, అంతట ఆ పూర్వాను భవంబెల్ల, ఒక్కుమ్మడి స్మృతికి రాగా, తాళలేక పోలినది. తెలిసి కనుదేఱచి, తన్ను నాయన మణెవ్వరికేని ఇచ్చునో యని తలరి, తతణంబ తాను యోగఁబున ప్రాణ త్యాగము నేయఁబూనినది. చెనులు వలదని వారించి, 'ఎందుల కంత? ఆ కృష్ణుఁడు ఇపుడు శ్రీరంగము దుండలేదా? ఆయనకోసము ఇక్కడి దేవుని భజింపుము; నీకోరిక తీయును.' అని వారు అని వారు ఉపాయము సెప్పఁగా ఆట్ల నేయ నారంభించెను. మఱియు విరహవినోదమునకై వీరుల పాన్పున పరుండియు, ప్రియు చిత్తరువు వ్రాసియు, నఖుల వన్నీటి చిలుకరింపులఁ దడిసియు, మృణాలవలయంబులు దాల్చియు, ఆయనమీఁద వీణెపాట వాయించియు, తంబుర మీటుచు నోటఁ బాడియు, ఎట్లును ఊఱఓఁ గనదాయెను. నాయన విష్ణుచిత్తుడు కూఁతునవస్థలను, ఆమె మిక్కిలి కృశించుటను చూచి' అది మదనవికార మని ఊహింపలేక, ఏదియో తపోవిశేషం అని యనుకొనుచు ఆమెను తేర్పలేక ఒకనాఁడు దేవళములో దేవునితో మొఱ పెట్టుకొనేను. అప్పుడు ఆయన ఆ భ క్తునికి అమ్మాయి కలరూపు ఇట్లు చెప్పెను. మునుపు వరాహావతారమున ఆ దేవుఁడు సముద్రము నుండి భూదేవిని కాపాడు టకు ఆమెను కోఱతో నెత్తి దానిపై నిలిపినప్పటి విలాసపు ముచ్చటలలో ఆమె కథాసంగ్రహము. 11 యడుగఁగా ప్రాణులకు మోక్షమునకైన లఘూపాయములు చెప్పుచు, అన్నింటికన్నాను శ్లాఘ్యమైన పని. జాగ రే తు విశాలాక్షీ, జానతో వా వ్యజానతః యో మే ప్రగాయతే గీతం మమ భక్త్యా వ్యవస్థితః ప్రయుక్తః సర్వసంసారాత్ మమ లోకం చ గచ్ఛతి." అని చెప్పెను. దానికి ఉదాహరణముగా ఈ మాలదాసరి. బ్రహ్మరాక్షసుల కథనం గూడ చెప్పెను. ఆ యుపాయమును తాను అనుష్ఠించి లోకమునకు ఉపదేశించు కుతూ హలమున లీలల గోరియే, ఆ భూదేవి ఇట్లు కూఁతురై అయోగ మిషచేత గంభీరార్థంపుఁ బాటలను పాడుచు ఇట్లు వియోగతపస్సు నటించుచున్నది. అంతకన్న వేఱుగాదు. ఆమెను శ్రీరంగమునకు రంగేశు సేవింపం దోడుకొనిపోయిరమ్ము అని ఆనతిచ్చెను. అట్లే విష్ణుచిత్తుఁడు తగిన సన్నాహముతో పరిడవముతో కుమారీరత్నమును పసిండి పల్లకిలో ఉంచుకొని పోయి శ్రీరంగముం జేరి తాను మాధ్యాహ్నికాదిని తీర్చుకొని గోదాదేవికిని స్నానాలంకారములు చేయించి అనుచర భాగవతాళితో పోయి శ్రీరంగనాథుని సేవించి స్తోత్రముచేసెను. అప్పుడు రంగనాథుఁడు భూదేవి యవతారము ఆకల్యాణిని, తాను చిరము బాసిన తన ప్రేయసినే, ఆ క్రొత్తవేసాన అతిమనోహారిణిగా నున్న దానిం గాంచి ఆ యందమునకు కై వెక్కినట్లు మరులు ఆఁపుకొన లేక ఆమెను తన శుద్ధాంతము నకు తార్చుకొని, అమెరూపాన ఒక మాయపిల్లను ఆచోట నుంచెను. అక్కడ తీర్థ ప్రసాదవినియోగమై స్వామిని వీడ్కొని అందఱును విడిదికి రాగా వల్లకిలో ఆశుభాంగి అగపడక పోయెను. అంతట విష్ణుచిత్తుఁడు దుఃఖసముద్రమున మునింగి. చేతులెత్తి అయ్యో ! మా పిల్లను ఇట్లు హరించినాఁడే అని మొఱబెట్టఁగా శ్రీరంగనాథుఁడు ఆయనకుం దోఁచి యెలనవ్వి నీకూఁతును ఇంటఁ బెట్టుకొనియే నామీఁద వట్టి నింద పలుకుచున్నావు అనెను. అంతట ఆయన పరువున ఇల్లు నేరఁగా కూఁతురు త న్నెదు ర్కొని మ్రొక్కినది. ఆయనకు ఎంత యూఱట! ఆ దెంత సంతోషము ! తరువాత రంగపతి బ్రస్మారుద్రులను సరస్వతీ పార్వతులను పంపి బిల్లు బుత్తూరున విష్ణుచిత్తుని పిల్ల నిమ్మని అడిగించిన. వారును అప్లై పోయి యడుగ, విష్ణుచిత్తుఁడు భ క్తివినయములతో అంగీకరించి, తన పరువు నిల్పుటకు 'పెండ్లికొడుకు తన యింటికి వచ్చి పెండ్లి చేసికొని కూఁతురు స్వీకరింపవలయును అనేను, 12 అము క్త మాల్యద - ఉపోద్ఘాతము శ్రీరంగనాథుఁడును గరుడు నెక్కి, బ్రహ్మాదిసురలును తమ తమ తత్తడుల నెక్కి బలసి కొలిచి రాఁగ, తన సకల పరివారముతో విల్లుబుత్తూరు చేరి, విశ్వకర్మ కట్టిన మణిమయవు విడిదిపట్టున విడినెను, అక్కడ ఆయన యథావిధిగా మంచి శ స్నానము గావించుకొని సర్వాభరణముల నలంకృతుఁడై సిద్ధపడెను. విష్ణుచిత్తునింబ అమ్మాయికిని మంగళాభ్యంగాలంకరణములు ఐనవి. అంతట పన్నిద్దరు సూర్యులును దివటీలుగా నక్షత్రాలజాలరుతో చంద్రుఁడు గొడుగుగా అగ్నిదేవుఁడు పెట్టు ధూపముతో మేఘాల మేలుకట్టుక్రింద ఏనుఁగైన గరుడుని ఎక్కి, వేదములు వేదములు పఠించు చుండఁగా, నారదాదులు సంగీతము పాడుచుండఁగా, ఆధ్వనులతో పెండ్లికొడుకు విష్ణుచిత్తు నింటికి వేంచేసెను. విష్ణుచిత్తుండును తగిన విధమున నెదుర్కొని ఆయనకు పాదప్రక్షాలనంబు చేసి లోపలికి గొనిపోయి బంగారు వీటపై కూర్చుండఁబెట్టి షోడశోపచారంబులం బూజించి మధుపర్కంబు సమర్పించి, తాను, భార్య ధారవోయఁగా, కన్యకారత్నమును దానము చేసెను. రంగనాథుఁడును పరిగ్రహించెను. తరువాత యథావిధిగా ఒండొరులు ముత్తె(పుఁబ్రాలు పోసికొనుటయు కంకణములు కట్టుటయునై మంగళసూత్రధారణమును నెఱవేఱినది. అనంతరము లాజహోమమును, అంతట సర్వమంగళాశాసనముతో పెండిలి పూ రియాయెను. ఇట్లు తెలుఁగురాయని యానతిని కన్నడరాయఁడు కృష్ణదేవుఁడు 'ఏమునుఁ చాల్చిన మాల్య మిచ్చు నప్పిన్నది రంగమందయిన వెండిలి సెప్పుము' అన్న తెలుఁగు రాయని స్వప్నాదేశమును జరిపి 'మున్నుఁ గొంటి నేవ* ననవండ యొక్క మగవాఁ డిడ' అన్న ఎవను ఆయనకు తుడిచి ప్రియాపరిభుక్త భాక్కథ ఆ కొదువ గప్పినాఁడు. కృష్ణరాయని కవిత కవిగా రాయఁడు భగవంతునిచేత ఎట్టి ప్రశంన గన్నాఁడు, 'పలికి తుష్ప్ర గోవములు జాతి వెంవెక్క, రసికు తానన' (1-18) ఇత్యాది సత్యావధువు రనమంజరినుండియు ఉద్ధారములుగ ప్రపంచ దర్పణమును నొక గ్రంథ మున దొరికినవఁట. ఆ గ్రంథములును తక్కినవియు ఎట్లు మాయమైనవో అవరిణత నుండియు
- ఆ మాలాకార సుదాసప్రస్తావమున విష్ణుపురాణమునఁ గాస్ శ్రీ భాగవతమునఁ
గాని హరివంశమునఁ గాని ఈ 'ఎవ' ప్రస్తావము గానరాదు. "మాలాకారాయకృష్ణో ఒన్ ప్రనన్నః ప్రదదొ వరా౯." విష్ణువు. మఱి దానిని కృష్ణుఁడు మనసులోనే దాచ కొన్నాఁడు గావలయు, సమయాన ఆప్తునితో ఈ భ క్తునితోఁ జెప్పుటకు. కృష్ణరాయని కవిత 19 దశలో రాయుడు ఈయాంధ్రకావ్యమును అసదృశముగా చెప్పినాడు వ్యుత్పత్త్వభ్యాస సంస్కృత యగు ప్రతిభ కావ్యమునకు కారణ మని ఆచార్యులు చెప్పినారు. నవనవోల్లేఖ (న్మేష) కాలిని యగు వ్రజ్ఞ ఆ ప్రతిభ అన్నారు. లోకవృత్త జ్ఞానము, శాస్త్ర పాండితి, శబ్దశాస్త్రము, ఛందస్సు, నిఘంటు, స్మృతి పురాణేతిహాసాగము తర్క నా ట్యార్థ కామ యోగాది గ్రంథములయు కాళిదాసా? మథాకవుల కావ్యములయు తత్వమున ఎత్తును అడుగును తాఁకిన పరిచయము వ్యుత్పత్తి అభ్యాసముచేతను వ్యుత్పత్తిచేతను నిండు సంస్కారము పొందినట్టిది రాయని ప్రతిభ. ఇందులకు ఆముక్తలో ప్రతి వాక్యమును ప్రతిపదమును తార్కాణయే. ఇందు గ్రంథారంభమున వాడుకగా ఏర్పడియున్న ఇష్ట దేవతాభజన స్థానమున వాడుక'గా చెప్పు దేవతలం దలంపక, కృష్ణదేవరాయఁడు తన క్రొత్త వీర వైష్ణ వమునకుం దగిన యొక్క క్రొత్త మార్గమును త్రొక్కెను. ఆస్థానాగ్రతివి. పెద్దన "మనుచరిత్ర వ్రాయునప్పటికి వైష్ణవుఁ డయ్యెను, కాని అది క్రొత్త. ఆకృత్యాది నానాదేవతాథజనక త పూర్వసంప్రదాయమును మానఁజాలక, నారాయణునితోఁ గూడ శివుని పార్వతిని వినాయకుని సరస్వతిని బ్రహ్మను స్తోత్ర పాత్రము చేసెను. మఱియు తన యాచార్యుని శఠకోపయతిం గూడ కొలిచేను.. ఆటం గొలుచుట మాత్రముగాక ఆశ్వానముల యంతమున అన్ని గద్యలయందును 'శఠ కోపతాపన ప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లిక' అని తన్ను నిర్దేశించుకొనెను. 'అట్లు నిర్దేశించుకొనుచును 'పంకజాక్ష పాదాంబులాధీన మాన సేంగిందిర' అనియుం జెప్పుకొనెను. కృష్ణరాయఁడును ఆ శఠకోపతాపనునికే శిష్యుఁడని దీపింపఁదగును. అయినను పూర్వోక్తక్రమమున గ్రంథాంతమున ప్రస్తావవశమున అంత గొప్ప గురువుగా ఆంధ్రమునను తక్కిన దేశమునను అతి ప్రసిద్ధునిగా అతి ప్రసిద్ధునిగా దర్శన ప్రవర్తక లక్ష్మణయోగికిం దీటుగా, ఆయనయొక్కయే అవతారాంతర మో వ్యాజమునం బలికినాఁడు. మఱి ఆముక్తమాల్యదలో అట్టి నా నా స్థానమున ఆ దేవతలను మాని సర్వ విలక్షణముగా శుద్ధ వైష్ణవి దేపతలకు మళ్ళీ శ్రీ వేంకటపతిని అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరులను పాంచజన్య నందక కౌమోదకీ రాజ సుదర్శనములను వంచాయుధములను ఇల పన్నిద్దరు నూరులను పన్నిద్దరాళ్వారులను స్తోత్రము చేసి కావ్యావతారము స చెప్పందొడంగెను. ఆశ్వాసాంత గద్యస్థానమున వటువగు నొక పద్యమును ప్రత్యాశ్వాన భిన్నముగా నిజపరాక్రమ విజయవర్ణనతో చెప్పరు. పెద్దన యైనను వైష్ణవము ముదిరి పెద్దన్నయ్యంగారు అను అతిగౌరపముతోడి శ్రీ వైష్ణవనామ వ్యవహారము గాంచిను శ్రీ యన స్తోత్రమును దేవతా భజన 41 ఆముక్తమాల్యద - ఉపోద్ఘాతము దినాలలో కావ్యము మతాచార్య ప్రస్తావమునకు తాపుగారు, ఆయాచార్య స్మరణకు తావు సమయము వేఱఱు అని తలంచి యుండునేమో. వటీ ఆము క్తమాల్యదకు సంజీవని యను వ్యాఖ్య వ్రాసిన శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులవారు కవి యీ గ్రంథమున నెచ్చటను తన గురువు పేరు చెప్పలేదు, అని వా స్తవము నైనను సొడ్డుంబోలె తోఁచునట్లు పలికినారు. రాయఁడు ఆముక్తమాల్యడ వ్రాయునప్పటికి తన వైష్ణవము ముదిరి పండినందుననే గణవతి శివాదులను చెప్పఁ గూడ దవి మాని ఆ సంప్రదాయమునఁ గల ఆల నిత్యనూరులను ఇలా నిత్య సూరులను పంచాయుధములను స్తుతించుట. మఱి వైష్ణవము ముదిరియే వ్రాసిన వివేకశాలి పాండురంగ విజయకవి కృష్ణుని ఆదిలక్ష్మిని బ్రహ్మను శారదను శివుని పార్వతిని నేన మొదలియారిని గరుడుని శేషుని పూర్వ కవులను స్తోత్రము చేయుచునే ఆట్లు గ్రంథారంభమున సకల దేవతల భజించు సంప్రదాయమును పాటించుచునే.. వైష్ణవమునకు వెలితి రానీక, అనిత్యసూరులతోడ కీరమునకు విష్ణు సహస్రనామము నేర్పు పార్వతి యను మొదలగు విధంబుల తక్కిన యందఱిని వైష్ణవులం గావించెను. మఱి తన గురువునుం గూడ - "వాక్కంతాశ్రయు భట్టరు చిక్కాచార్యుల ' మహాత్ము శ్రీ గురుమూర్తి నిక్కవుభ క్తి భజించెద నిక్కావ్య కళా కలాప మీడేరుటకు." అని భజించెను. మఱి ఆశ్వాసాంతగద్యముల నాయనఁడడవక 'శ్రీ మత్సఁవపద నాథ నిరవధిక కృపా పరిపాక పరిణత' అని చెప్పుకొనెను. కవికరసాయన కారుఁడును భట్టరు నాశ్రయించిన శ్రీ వైష్ణవుఁడయ్యు. ఆయనచోట ఆయనను భజించి, తన కాన్యారంభమున శ్రీ రంగేశునితోడ బ్రహ్మను శివుని పార్వతిని వినాయకుని నఁస్వతిని ' యథాగారముగా స్తోత్రముచేసి, "అభీష్ట ఫలప్రద పరమ పురుష ప్రార్థనంబును, కావ్య సాధారణ లక్షణోపస్థాప నాభిప్రాయంబున నితరోచిత దేవతా 'నిరూవణంబుకం గావించి." అని చెప్పి.. తాను రంగేళు నొక్కనే భక్తి తాత్పర్యముతో మ్రొక్కి తక్కినవారిని ఊరక "కావ్య సాధారణ లక్షణోవస్థాప నాభిప్రాయంబున నిరూపించితి" అన్నాడు. అట్లనుట ఆ పద్యంబులు భక్తి యను రనప్రాణమును తన నోటితో కొటికివేయుటయే కదా. 'ఈ వుతకా (1)' అనియు 'సంధించుతజు' అనియు, 'ఇచ్చుకో' అనియు 'ఊనగాత' అనియు, పలికిన . ప్రయోజనమేమి ? తత్పరత లేక ఆ మాటలు పలికిన ఆ దేవతలు తన మొగముఁ కృష్ణరాయనీ కావ్యపుఁ బదకము 16 జూతురా ? దీనిం గాంచి శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులవారు తమ కవికర్ణ రసాయన. ప్రతియందు "Foot note" గా “ఇది యేమి సమాధానము, తెలివి లేదా ?" అవి బ్రాని ముంచినారు. ఆళ్వాసాంత గద్యములందును “పరాశరదేశికేంద్ర చరణ సరసీరుహ తే: కోపసేవక " అని చెప్పుకొన్నాఁడు. శ్రీ రామాయణ మహాభారత రఘు వంశాదులఁదుఁ గాని, జైష్ణవాచార్యులె సంస్కృతమున రచించినవానఁ గాని ఇట్టి బహు దేవతాస్తుతి గాని గురుస్తుతిగాని నియముగా లేదు. కావున ఆముక్తమాల్యద యందలి యీ ఫక్కిక క్రొ త్తది, దానియందు మాత్రము గలది. రాయోపజ్ఞము, దాని గుట్టెతెంగక, యితరులు సరిగా అనుకరింపనైనను చాలక పోయినది, గురువుం బేర్కనలే దని తప్పు చెప్పఁదగినది కాదు. అది వట్టి వస్తుక థనమైన, సరే. ఇది దాని తత్వము. ఈ క్రొత్త వైష్ణవ వైవతంబులం గూర్చుటయు ఆ మహాకవి కావించిన ఒక నూతన కల్పనయే యగును. కృష్ణరాయని కావ్యపుఁ బదకము దేవుని యానతిని గోదాదేవి రంగమన్నారు.డు పెండ్లియైన కథం జెప్పవలనెను. అందులకు పిల్లుబుత్తూరిలో విష్ణుచిత్తుఁడు ఆమెకు నాయన కాఁదగిన యసాధారణ భక్తుడుగా నన్న తెఱంగును ఆయన యొక్క ఘనతనుం జెప్పుట ప్రాప్తించినది. కావున గ్రంథమునకు ఆతేడాశ్వానములదానికి విష్ణుచిత్తీయమనియు పేరు రాఁదగినట్లు • మూఁడునుంబరక యాశ్వానములు 270 పద్యములు 1 - 1 గ్రంథమున మూఁడవ భాగము ఆ కథ యైనది. గోద జనన వర్ధిన పరిణయములకు ఆముక్తమాల్యద యను పేరునకు తగినట్లు 200 పద్యములు | గంధమున మఱి యొక మూడవభాగము నకు చెందినది. ఆనుషంగికములకు యామునక థా వర్షా శరద్రాజనీతులకు 280 పద్యములు, గ్రంథమున మఱియొక మూఁడవభాగము ఐనది. తక్కిన లేశము ప్రకీర్ణకముగా కవి కావ్య ప్రస్తావనాదికమునకు ఐనది. కావున ఇందు కొంత కావ్యరసదోషములలో చెప్పిన “అట్లీనో ననుసన్దాన మనఙ్గస్య చ కీ ర్తనమ్ అతివిస్తృతి రఙ్గస్య..... “అజ్ఞాతివి న రాజ్యననుసనా నానఙ్గభిధాన.” A-B సాద. హైమ కావ్యానుశాసన. 18 L ఆముక్తమాల్యద - ఉపోద్ఘాతము యథా - హర్ష చరి .. శిశుపాల వ్యాప్తిమ ద్వీర అనునవి కలిగినవి, అందు "అఙ్గ స్యాప్రధానస్య అతివిస్తరేణ వర్ణనమ్ అని హేముఁడు వృత్తి వ్రాయుచు హమగ్రీయవధ హరవిజయ కాదంబరీ కాదులనుండి ఉదాహరణములం జెప్పి, శిశుపాలవధను కైకొని " వధాదౌ చాదితః ప్రకృత ప్రతిజని విజయ బీజోపక్షే పావగాఢ రసానుబనే ఒపి, త దనఙ్ఞత శృఙ్ఞాతాజీభూత తత్తదృ తూపవనవిహార పుష్పావచాయ మజ్జనాది వర్ణనాను ఆత్యాస క్తిః త దితమ్ అప్రస్తుత వస్తు విస్తృతిః ప్రస్తుత రసప్రతీతి వ్యవధానకారి ణ్యపి మహాకవిల శ్యేమ భూయసా దృశ్యతే ఇతి తత్త్వం త ఏవ విద ని.” అని ఆ విషయమును త ప్పనఁబోయి మామకార వ్యాదులకు జగన్ని రూఢమైన మహాకవి కీర్తిం దలఁచి ఆనఁజాలక విడిచిపెట్టినాడు. "వీర తన ప్రధాన మైన శిశుపాలవధ కావ్యమున వీరరసానుబంధమున్నను, దానితో ఆసంగతమై ఆట నప్రధాన మగు శృంగారమునకు అంగమగు ఋతువులయు ఉపవన విహారము యొక్కయు పుష్పావచాయము యొక్కయు జలక్రీడ మొదలగు వానియు వర్ణన మెండుకొన్నది. ఇట్లు ఆప్రస్తుతవస్తువిస్తరము ప్రస్తుత రనప్రతీతికి అడ్డము కలిగించున దైనను అది మహాకవుల లక్ష్యములందు మెండుగా నగపడుచున్నది. మఱి యందుం తత్త్వ మేమో, అది వారికే ఎఱుక", అని ఆ తప్పు తేలిపోవునట్లు పలికినాఁడు. ఆ ఆప్రస్తుతములు వెక్కువ గల నఘభారవులం గూర్చి వ్యాఖ్యాతృ చక్రవర్తి యనియే కాక అలంకారిక చక్రవర్తియు ననఁదగిన మల్లినాథ సూరి సర్వ ప్రశంనగా ఇట్లు చెప్పి నాఁడు. 'పూర్ణావర్ణ నా' అనియు 'శైలాద్యాని బహుళో వర్ణితాని' అనియు ఉత్కర్ష చెప్పినాఁడ మాఘమున మఱియు 11 "నే తాస్మిక్ యదునన్దనః స భగవాజు వీరః ప్రధానో రసః కృష్ణారాదిభి రఙ్గవా న్విజయతే పూర్ణా పున ర్వర్జనా ఇన్ద్రప్రస్థగమా ద్యుపాయవిషయ కైద్యావసాదః ఫలం ధన్యో మాఘకవి ర్వయం తు కృతిన సత్సూక్తిసంసేవనాత్” "క్షుభ్యద్భావతరద్గీతే రససుధాపూరే మిమఙ్ఞనీ యే తేషా మేవ కృతే కరోమి వివృతిం మాఘస్య నర్వఙషామ్.” భారవి యందును “నారికేళవల సమ్మితం వచో భారవేః నవది త డ్విభజ్యతే స్వాదయన్తు రసగర్భనిర్భరం సార మస్య రసికా యథేప్సితమ్. కృష్ణరాయని కావ్యపుఁ బద్ధకము నేతా మధ్యమపాణవో భగవతో నారాయణ స్యాంశజ న స్యోత్కర్షకృతే త్వవర్ణ్యతతరాం దివ్యః కిరాతః పునః కృష్ణారాదిర సోజ్జ మత్ర విజయీ వీరః ప్రధానో రసః శైలాచ్యాని చ వర్ణితాని బహుళో దివ్యాస్త్రలాభః ఫలమ్." 17 కావుననే ఈ విషయములం గూర్చిన సమాధానప్రయత్నముగా ఆముక్తమాల్యద వ్యాఖ్యయగు సంజీవనియందు తత్కర్త ఓ విసహృదయ చక్రవర్తి శ్రీ వేదము వేంకట రాయశాస్త్రులవారు తదుపోద్ఘాతమున ఆనలిచ్చినారు. “ఇందు ప్రసక్తము డిందై అప్రసక్తము మెండైన ధన్నమాట ఒప్పుకొనవలసినదే. ఈ తీరు మనువు నందునుంగలదు. సంస్కృతములో కావ్యతల్లజమైన శిశుపాలవధ మందును మిక్కుటము, అయినను 'నా నృషిః కురుతే కావ్యమ్.' అని యున్నది. మఱి ఋషులు ఉపదేశహీనముగా కావ్యము చేయరు. కావ్యం యళ సేఒర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః పరనిర్వృతయే కాన్తాసమ్మితత యోపదేశ యుజే. అని ఆలంకారిక సమయమందును ఉపదేశమె అంతమున సర్వోత్కృష్టముగాఁ జెప్పఁ బడినది. కావున కవి ఉపదేష్టవ్యతమంబులు కతంబున భ క్తిపారవశ్యమున విష్ణుచిత్త యాహున కైశిక గానలంపటుల కతలం గూర్చిచాఁడు. వ్యవహారబోధకై రాజనీతిని సద్యఃపరనిర్వృతికై ఋతువులను, ఆశివక్షతికై అమ్మ వారి చరితమును, ఉపదేశమున్న కై ఆపూర్వోక్తములతోడి హరిస్వరూపమును వర్ణించినాఁడు, మఱియు నిటంబ్రతిపాద్యమాన మైన విశిష్టాద్వైతము ఉ కావసరంబున విష్ణుచిత్తు వారు మాత్రమే కల్పించుకొన్నట్టిడిగాడు. ఇదీ ఆనాదిసూరిపకంపూ సంప్రదాయాగతము అని హెచ్చరిక నేఁతచేత దాని పరమ సిద్ధాతమును నిరూఢిగావించువాఁడై మహాకవి వృకృతులైన విష్ణుచిత్తులవారి పావన చరిత్రమే గాక, శ్రీ కైశికగాతృ యామునమునులతాదృశచరిత్రముసుగూడ విస్తరించి నాఁడు. సంప్రదాయమునకు క్రమము కుదురుటకై విష్ణువిత్తయోగిన్న ఇవలివారైన యామునా చార్యులను ఈయరకండెం బూర్వులఁగా ప్రతిపాదించుట. మఱి దాసరి ఎవరికి ఉపదేశించినాఁడుఅని యా క్షేప మేని, బ్రహ్మరాక్షస్సునకు అని ఉత్తరము, భూత 18 ఆము క్త మాల్యద -ఉపోద్ఘాతము పూర్వునిగా లక్ష్మణాఖ్యయోగీంద్రుని ఆతనికన్న చిరకాల పూర్వుఁడైన బ్రహ్మ రాక్షసుఁడు ప్రస్తావించుచు అట్టి యేష్యంబులు తన దివ్యజ్ఞానంబుచే నెఱింగినవని చెప్పినాఁడు. యామునాచార్య కాలవ్యత్యాసమునకును ఈ దివ్యజ్ఞాన సమాధానమునే చెప్పఁదగును. ఋతురాజనీతి విస్తరము లసంబు లన్నందులకు సమాధానము- అణేఁడు వై రాగ్యోత్పత్తికై విప్రపఠిత శ్లోకమును వినవలయును; అందులకై ఆవిప్రుఁడు దానిని వీథితిన్నెపై గోష్ఠిలోఁ బాడవలయును; వీథితిన్నెగోష్ఠికి వేసవి యనుకూలతరము ; ఆట్లు వేసవివర్ణన ప్రసక్తమైనవి. విద్వాంసుఁడును ధార్మికుఁడును అగు (క్రొత్త దొర యేలుబడిలో సుభిక్షముతప్పదు. అందులకు సువృష్టి వలయును. అట్లు వర్షాశరత్తులు ప్రస క్తించినవి. శరత్తులో జైత్రయాత్ర సార్వభౌమ ధర్మము. అందుకై రాజనీతి ప్రస క ము. కథ వివాహాంతరము. వివాహమునకై ఆయోగ విప్రలంభము వలయును. అందుకై వసంతమును మించిన ఋతువు లేదు. ఇవి యెల్ల నిట్లు ప్రసక్తములైనవి." అని (ఈ ప్రన క్తితా నిర్ణయము వ్యాఖ్యాత కవిహృదయములో దూఱి కనుగొన్నట్టు లున్నవి!) క్రొత్త మతాభినివేశాతిశయముతో నున్న తన్ను రసజ్ఞుని గోదాకల్యాణముం జెప్పుమని దేవుఁడు ప్రత్యక్షముగా ఆనతిచ్చినందున, రాయఁడు ఆయవకాశమున ఆంధ్ర మున కావ్యమార్గముననే తన్మతఃధాన రహన్యములం బ్రకటించు తలంపుఁగొనుటయు న్యాయ్యము. దానిని అత్యద్భుతముగా నెఱవేర్చినాఁడు, గొప్ప విద్వాంసుఁడు సభలో చేయు వాడక్రమమును, తన సభలో అట్టి యెన్ని వాదములో ప్రవర్తిల్లఁగాఁ జూచి యెఱిఁగిన ప్రగల్బుఁడు 'అందులో నొక మేడి కభిముఖుండై III-6, 'నీ వేమంటివి' రమ్మంచు....” III. ?. అని జయశాలి ధర్షించు ధీరతను, ఓడినవారు 'సెలవులు నాకుచు' 1y-17 అని నిర్గమించి ఇండ్లకు చేరిన దేబెతనమును నిపుణముగా వర్ణించి కన్నులకుఁ బ్రత్యక్షమ చినట్లు నిరూపించినాఁడు. వాదపు వివరమును జయమును చెప్పి నారాయణుండ పరతత్త్వమని మఱి చెనకరాకుండ నిర్ణయించి ఆ పరమేశ్వరుం గనుటకుఁ దగిన యోగంబుఁ జెప్పెదనని — "త త్వేన యర్చిదచిధీశ్వర తత్స్వభావ- భో గాపవర్గ తదుపాయ గతీ రుదార సన్దర్శయ స్నాకమహిత పురాణరత్నం తన్మై నమో మునివరాయ పరాశరాయ.” కృష్ణరాయని కావ్యపుఁ బదకము 19 అని యామునాచార్యుల మెప్పుగన్న పురాణరత్నమునుండి ఖాండిక్య కేశిధ్వజు సంవాదమును విపులముగా నందాహరించుట తన్మర్మజ్ఞత యగును. ఆ సంవాదము III '4 మొదలు 39 వఱకును 75 పద్యములు విష్ణుపురాణ షష్టాంశ షష్టస ప్రమాధ్యాయములకు నూటయేఁబడి శ్లోకములకు అనువాదము. వస్తు వునకుం దగిన యుదాత్త శైలిలో నున్న యా యార్షవాక్కును తెనుఁగున నెంత ప్రౌఢము గాను నుబోధముగాను అనుసౌదమని తోఁపక తన సొంత యుపన్యాసమని తోఁచునట్లును ఇది అనువాదక వనమునకు, శృంగారనైషధానుకారి మార్గదర్శకము. రచించినాఁడు! నాలుగు శ్లోకాల యుదాహరణము (11) ఆనాత్మ వ్యాత్మబుద్ధి ర్యా చాన్వే స్వ మితి యా మతిః అవిద్యా తరు సంభూతి. బీజ మేత ద్విధా స్థితమ్. (68) ఆత్మకాని మేన నాత్మబుద్ధియును, న.. స్వంబునందు మిగుల స్వత్వమతియు, నవనివర, యవిద్య యను మహాతరుపు ను- త్పత్తి కీద్వయంబు పిత్తుమొదలు. (19,20) అనేక జన్మ సాహస్రీం సంసారపదవీం ప్రజ మోహశ్రమం ప్రయా తో సౌ వాసనా రేణు కుణ్ణితః ప్రశ్యతే యదా సోఒన్య రేణు జ్ఞానోష్ణవారిణా తదా సంసారపానస్య యాతి మోహశ్రమః శమమ్. (70) జని సాహ స్ర బహు ప్రయాణ మగు సంసారంపుఁ ద్రోప సదా చనుచుండు న్దనమోహభేద మలమ్మ సంసారిపాంథుండు, వా- సన లక్షా ధూళి ముసుంగు గాఁగ, నెవుడేక జ్ఞానంపు టుష్టోదకం- బునఁడతాళన నేయు, వాని కపు డమ్మోహశ్రమంబు జను౯. (28) మన పేవ మనుష్యాణాం కారణం బద్ధమోక్షయోః బన్ధయ విజయానఙ్గ, ముక్త్యా నిర్విషయం మనః 20 ఆము క్తమాల్యద ఉపోద్ఘాతము (73) ప్రాణికోటి కెల్ల బంధంబు మోక్షంబు చేరుటకును మనమ కారణంబు; విషయనంగి యైన, విను, బండకారి; నిర్విషయ మైన, ముక్తివిభవకారి. (79) యచ్చ మూర్తం హరే రూపం, యాదృ క్చింత్యం నరాధిప, త చ్ఛూయతా, మనాధారా థారణా నోపపద్యతే. (80) ప్రసన్న వదనం చారు, పద్మపత్రోవమేక్షణం సుకపోలం' సువిస్తీర్ణ లలాటఫల కోజ్జ్వలమ్. (81) సమకర్ణాన విన్యస్త చారు కుజ్జల భూషణమ్ కమ్బుగ్రీవం సువిస్తీర్ణం శ్రీవత్సాబ్కేత వక్షసమ్. (82) వళిత్రిభఙ్గనా మగ్న నాభినా హ్యువరేణ చ ప్రలమాృష్టభుజం విష్ణు మథ వాని చతుర్భుజమ్. (88) సమర్థి తోరు జజ్ఞం చ సుస్థితార్ద్రవ రామ్బుజమ్ చిన్తయే దృహ్మభూతం తం పీతనిర్మలవాననమ్. (84) కిక్ హార కేయూర కటకాది విభూషితమ్. (35) శాఙ్గ శఙ్ఞ గదా ఖడ్గ చ క్రాక్షవల యాన్వితమ్. వరదాభయహస్తం చ ముద్రికా రత్నభూషితమ్. (88) చిన్తయే తన్మయో యోగీ నమాధా యాత్మమానసమ్. తావ ద్యాన దృఢీభూతాత త్రైవ నృవ, ధారణా. (87) నకళ నీవతో ఒవ్య ద్వా, స్వేచ్ఛయా కర్మ కుర్వతః నావయాతి యదా చిత్తాత్ సిద్ధాం మన్యేత తాం తడా. (84) మణి నిరవలంబ ధ్యానంబు పొందుపడదు గావున, ధారణా ధ్యాన విషయంబై శుద్ధంబగు స్థూలరూపాంతకం అయ్యనంతు నకుఁ గలదు, దాని నవిస్తరంబుగాఁ జెప్పెద, నాకర్ణింపుము కృష్ణరాయని కావ్యపుఁ బదకము (85) శరదిందు చకచక స్మయవ త్ప్రసన్నాస్యు, దొడ్డ కెన్దమ్మి కన్డోయివాని, సతికమ్ర గల్లభా గాభోగ ఫాలాఢ్యు, మకరాంక రత్న కర్ణికలవానిఁ గాంబ వోద్య చ్ఛీవిడంబి వృత్త శిరోధి, సిరి పొల్చు మచ్చ పేడరమువానిఁ. నతనాభి యుత వళిత్రితయ శాతోదరు, జానులంబి చతుర్భుజములవానిఁ గరివరకఠోరు, రుచిరజంఘామనోజ్ఞు. సమత బొందిన పదవల్లవములవాని, హైమవసను, గిరీటహారాంగదాది కలితు, శంఖరథాంగాదు లలరువాని, (88) శ్రీవిష్ణు నీగతి చింతింపవలయుఁ ద- న్మయుఁడయి యోగి క్రమంబుతోడ; నొక్క యుంగము మున్ను చిక్క లో భావించి, యది దృఢం బగుటయు, నవలి యంగ- కము మఱి చింతింపగాఁ దగు, నట్టి య- భ్యాసంబువలన నయ్యవయవి మఱి నడచిన నున్న మానక యెద్దియేనియుఁ జేయుచున్నను మదిఁ బాయఁ డేని యతని సామ్యంబు గని ముక్తుఁ డగు; సురాది భేద సంజన కాజ్ఞాన మేదఁ బిదప నలము కల్యాణగుణముల హరికిఁ దనకు లేని భేద మెవ్వాడు కల్పింపఁగలఁడు? 21' ఇంత వివరముగా భక్తియోగముఁ జెప్పి, అట్టు తటాలున ఒక్క రాత్రిలో మముతువైన ఆ పాండ్యరాజులకు "మఱి దీనియం దొక్క కొఱత గలడు. అంత 22 ఆముక్తమాల్యద ఉపోద్ఘాతము రాయంబు నొందినఁ బునర్భవంబుఁ బొందించి మఱి ముక్తిఁ జేర్చు. అట్టగుట నింత కంటే సులభోపాయం బాయోధనంబున నయ్యధోషిజుండు గాండీవి కుపదేశించిన శరణాగత ధర్మంబు నిరపాయ ధర్మంబ"ని వైష్ణవమత రహస్యోపదేశమును సమ గ్రము చేసి విరమించెను, . విష్ణుచిత్త యోగి “ఇతపు కాపఠిక శాస్త్రగ్రంథ జాత్యంధుఁ" డైనను పురాకృత పుణ్యవశమున పుట్టు ప్రసన్నుడై భగవద్భాగవత కైంకర్యైకపరుఁడుగా నున్నవాఁడు అట్లు ఆకస్మాజ్ఞానియై దివ్యసూరలలో మతెవ్వరికి లేని 'పెరియాళ్వార్ ' అని 'పెద్ద' అను నుపపదమును పొండి నాయన. తనకు సాక్షాత్కరించిన దేవుని ప్రేమమీఱ, నాయన కొమారునిం బోలె, దృష్టిదోషపరిహారముగా ఆశీర్వదింపవలయు నను తలంపు తనంతట చిత్తమున మొలకె ఫైనాయన. ఆదేపుఁడు పెండ్లికాఁగోరిన 'ఆవెన్న దానికి' నాయన. తనకు మామగారును కాఁబోవువాఁడు, తాను పాడిన 'వల్లాండు' - జయజయ - వేదమునకు ఓంకారమువలె ద్రావి వేగమునకు ప్రథమమం" నీతడు కాగిన్నవాఁడు. అట్టి ఆయన చరితముం జెప్పుటకు రాయఁ డిట నవకాశము సంపాదించుకొని అదెంత చక్కగా చెప్పినాఁడు ! H అదే గోదాదేవి భక్తిపూరిత శృంగారము మజెందును కావ్యములఁ గన్నది చిన్నది కాదు. కాళిదాసు కుమారసంభవములోని పార్వతి పెండ్లికథ తనకు సాటిలేనిడే ఐనసు వేఱు తెఱంగుది, “క్లిష్టచన మదయైః కచగహై రుత్సభార్పితనఖం సమత్సరమ్ తస్య తచ్చి దుర మేఖలా గుణం పార్వతీరత మభూ దపృష్తియే.” అని ముగిసినట్టిది, ఈ మడి రచనకుం బ్రక్కనఁ బేర్కొనఁదగినది కాదు. 66 ఎమక్కాగ వర్ల్డ్ వి జ్ఞాజ్ఞా శవదరితాళ్; కుస్జీద వాహన పై గున్దవాశా పోగ న్దన్నై యిగన్దు. ఆంవార్ తిరుమగళారాయ్. ' 99 'మనకోసము గదా ఇక్కడ ఆండాళమ్మ అవతరించినది, ఇంచుకయు కొదువలేక (పరి పూర్ణ మగు) సుఖము గలిగియుండు శ్రీవైకుంఠమందలి నాథుని తోడియట్టి భోగములను విడిచి విష్ణుచిత్తుని కూఁతురై !" అని తనయవతారమునకు ప్రశంనగన్నట్లై పుట్టి, "పిజ్జాయ్ పజ్రత్తాజ్," "పిందెనే (జ్ఞానభక్ష్యాదుల) పండై నట్టిది ఆమె. మఱియు ఆమేంగూర్చిన కృష్ణరాయని కావ్యపుఁ బడకము 28 వాసిని ఆచార్యులు ఆనతిత్తురు... "వట్టి దేహాత్మా భిమానులకును, ఆత్మస్వరూపజ్ఞానము గల ఋషులకును వరమాణు పర్వతముల వాసి. ఋషులకును ఆళ్యారులకునుం గూడ పరమాణు పర్వతముల వాసియే ఆళ్వారులకును పెరియాళ్వారులకును అంతయే. ఆ పెరియాళ్వారునకును ఆయనకూతురు గోద- అముక్తమాల్యద కునం గూడ ఆ వరమాణు పర్వతముల వాసియే కలదు" అని. ఈ పిందె పండైన మాట మనస్సున నాటినందునం గాఁబోలు..ఆ శిశువు దొరకినది, అమ్మ గో మొప్ప పెంచినది యని యాదరా బాదర చెప్పి రాయుఁడు తద్వయఃసంధిని వర్ణింప దోడంగుట. 'పతి సంయోగసులభ' మగు నా వయః సంధి అంకురించినది మొదలు ఆమె నిరంతరమును ఉన్మాద పర్యంతమైన ఉత్క టాయోగ విప్రలంభమును అనుభవించుచుండినట్లే యున్నది ఆమె చరితము. భ క్తి .ప్రపత్తులు దేవుని శేషమును దేవుని సొత్తును ఐన జీవుని ప్రేమచే తత్కైంకర్యమునకు వంచును. ఆ ప్రేమ వలు తెఱంగుంది, స్వామినౌకరులు, మిత్రులది, పితపిత్ప్రులది ఇత్యాది. అందు కాంతకు కాంతుని యందుగలది, ఈ యన్ని విధములయు మొత్త మనందగినది మాధుర్యరూప పరిణతింజెందినది క్లాఘ్యతమ మగను. మగవారి చిత్తమున ఆ భావము కలుగుటకన్నను స్త్రీ చిత్తమునం గలుగట స్వాభావికతరమును రమణీయ తరమును అగును. "Women are more fortunate than men having quicker hearts than they. Psychic science puts them as more mediumistic and quicker vehicles of spiritual influence than men. Psychology dis- covers greater sympathetic and responsive character in them than in men. Biology recognises more impulsive sacrifice and anabolic tendencies in them than in men, thus explaining to us why Nature wisely ordained them rather than men to the office of child-bear- ing by long long selection and evolution........ World - for- getting and world-forgot, self forgetting and self forgot, the Gopis moved irresistably where the Music of Krishna's flute drew them." కావున గోవచిత్తమండలి ప్రగాఢతమమైనట్టి యది ప్రకృష్టతమమైనది. ఆమె పేమ పరవశయై తా బ్రాహ్మణియే నిండు గొల్లతయైపోయెను. ఎప్పుడును ఆమె ఆ పాటలలోనే మునిఁగి ఒళ్ళు తెలియక యుండెను. అట్టి యామె వెండ్లిం జెప్పుమని దేవుఁ డనుఓ రాయని భాగ్యము. రాయఁడు సంప్రదాయముగా నెఱింగినదానికి భంగ్యంతరము గల్పించి ఆమెచే ఆ హరి యెప్పుడును తన్నుఁ గామించినవారిని అసద్ధి చేసి వేధించుటీకాని వేఱుఁగఁ గన్న మార్గమున భగవద్విష యోద్ధృత 24 ఆముక్తమాల్యద – ఉపోద్ఘాతము - రహన్యమును ఇరువది పద్యముల తదుపాలంభమును రనము చిప్పిలు జెప్పించి, రాధపై ఈసుఁ జెంది "గోపికాళికి బొక్కఁగఁ జేసి తద్రుచిరభోగము చిత్తగ నీవ కైకొన౯." అని చెప్పించి, గోపికల విరహబాధలకు చోటును సాక్షియునైన యమునను 'వేడి వెలుగు కూఁతురవు నీవు యమున చెల్లెలవేనే' అని లిట్టించి, ఆమెతీఱు నెల్లచూచుచును పలుకు లెల్ల వినుచును ఉన్న చెలులు నీవు పోయిన జన్మాన సత్యభామవు గోవా యన్న జ్ఞాపికకు తజ్జన్మాంతరపుఁ గ్రీడా ప్రపంచము చిత్తమునఁ దోఁపఁగా తాను ఏడిచి ప్రాణత్యాగము నేయ సంకల్పించి చెలులు మాటలకు ఊఱడి ఆయూరి దేవునిఁ గొలిచి తత్ఫలముగా ఆయనచే ప్రతి బోధితుఁడై యిచ్చకు తగినట్లు నాయన సమకూర్పఁగా పెండ్లియైనది. దీనిని రాయఁడు మిక్కిలి భక్తి తాత్పర్యముతోనే చెప్పినాఁడు. L 'రంగమందు పెండిలియైన యప్పిన్నది ద్రావిడి. ఆమెకు 'కోద' యని పెట్టిన పేరైనను తచ్చరితముంబట్టి 'చూడి కొడుత్త దేవి' యను ద్రావికనామము కలిగినది . దానికి సంస్కృతపర్యాయము ఆముక్త (చూడిన' తాల్చిన) మాల్యద (మాల్య — మును [కొడుత్త = ] ఒసంగినట్టినది దేవి). నాయన యా యూరి యుదఙ్మహాలయ నాథునికోసము కట్టి బుట్టలో నుంచిన మాలను, ఆయనను కనుమెఱంగి, తాను ధరించి ఆ తనయందమును బావినీటి నీడలో చూచుకొని తాను తన మనసులోని నాథునికి తగుదునని తనిని తివిచి మరల బుట్టలో యథాపూర్వముగా పెట్టుచుండినది. అడి యెఱుఁగక ఆశువారునాయన ఆ మాలను అట్లే కొనిపోయి స్వామికి సమర్పించుచుండెను. అట్లు నిజకాంతాముక్త పూర్వము ప్రవృద్ధ పరిమళాది గుణము అని పెరిగెన యాసతో ఆ దేవుఁడు దానిం దాల్చి వేతుడుగులుగా సంతసించుచుండెను. ఆమె తాను మాలను మును దాల్చుట ఆట్లు చేయగూడదను అజ్ఞానము చేతనా ! చేసిన నేమి యను అవిన యము చేతనా ? విష్ణుచిత్త స్వామియించి పెరుఁగుచున్న యామెకు ఆపాటి యుక్తా యుక్తవివేక వినీతులు లేకయుండునా ? తాను భూదేవి యవతార మగుటచే ఆ వాసనాబల మున తనకు దానిని ఎత్తి తాల్చు ధీంత తనంతట కలిగినది. కూడదను నిషేధము తోఁపలేదు. నాయనను కను మొఱఁగుట నద్యస్తద ప్రతి వారణ మాత్రిమునకు. తాఁ దాల్చు టయు నీతలో తన సొబగుం జూచుకొని తనియునియు బాలికా సులభ సౌభాగ్యాభినివేళ మత్సరమున. ఆమాలను సమర్పింపఁగా, స్వామికి సంతోష మతిశయించుట ఆయనక్కను “తదజ్ఞ స్పృష్టానా ముపనతవతాం స్పర్శన మరి ప్రతీకా రోఒనఙ్గవ్యథీత మనసాం కోపి గదితః" కృష్ణరాయని కావ్యవుఁ బదకము "ఆలిఙ్గ్య స్తే గుణవతి మయా తే తుషారాద్రివాతాః పూర్వం స్పృష్టం యధి కిల భవే దఙ్గ మేభి స్తవేతి” "దయితయా గ్రథితా స్ర గియం మయా హృదయధామని నిత్యనియోజితా గలతి శుష్కత యాపి సుధారనం విరహదాహరజాం పరిహారకమ్." F 25 113 ఇత్యాదిన్యాయమున దానివలన తద్విహరవినోదము కలుగుటచేత 'ఒక్కొక సంకేతము గా కతఁడ రస న్నేఁ గానే' అని తెలుఁగువల్లభదేవుఁ డన్నాఁడు గదా. ఆ దినమువఱకు ఆమె 'ఆముక్తమాల్యద' కాదు. ఏలన దానిని స్వామికి తానీయ లేదు. తాను ముందు తాల్చి మరల బుట్టలో పెట్టుట ఎఱుంగక వానిని నాయన స్వామికి సమర్పించుచుండెను. ఒకనాఁడు ఆమె మాటను తలఁ దాల్చుట తటాలున వచ్చిన నాయన చూచి ఆపచార శంకఁ జెంది, నాఁడు దానిని స్వామికి కొని పోకపోగా, స్వామి భేదపడి ఆయనను స్వప్న మనుగ్రహించి, తనకు నిత్యము అట్లు అమ్మాయి తాల్చి తీసిన మాలనే, తచ్చిరః స్పర్శచే పరిమళాద్యతి యము గల దానిని సమర్పించి తన్ను సంతోషపెట్టు మని ఆనతీయఁగా ఆ మఱునటిదినము నుండి ఆయన నెట్లు చేయజొచ్చి. "అమ్మ; దీనిని నీతలలో ఉంచుకొని ఈవే, స్వామికి ఆది భోగ్యతరమగునట" అని చెప్పి, స్వామికి అట్లును సేవచేయటే తనకు ప్రియము అని అవినయశాలిని గోపికా న్యాయమున కాదనక అట్లే తలనుంచుకొని తీసి యీఁజొచ్చి, దాన తాను స్వామికి 'అముక్త మాల్యద' అయినది. ఆువారు నాయనయు నాఁటి నుండి ఆమెయందు తన్ను కాపాడ తనకు కూఁతుడై వచ్చిన లోక జనని తన దొరసాని ( - ఆండాళ్) ఎ.ను భావముతో నే ఆమెకు తాను నాయన యైతివిగదా అని భక్తిప్రపత్తుల నమ్మకము దృఢత రమాయెను. అనుంగుకూఁతురు సామరత్వమును 'ఈబుడు లెంత!' 'ఈ వెట్టిక శీల' అని వాగారంభము పొందుచు యశోద జనకులకుంటోలె వీతకయించెను. ఈ యాముక్తమాల్యద శృంగారచరితము సాహిత్యప్రపంచమున అనన్యా దృశము, తనకు తన సాటియైనది. ఆమె ఆయోగధరమున సంయోగసాధనకై ప్రీత్యాగదశలో 'మడల్ ఏరాద' ('తాటిమట్ట యెక్కక' దానికి వైదైన యున్మాద 26 ఆము క్తమాల్యద - ఉపోద్ఘాతము దశలో జాతిలో తా బ్రాహ్మణియగుట మఱచి, భావమున గొల్లతయ యై అపూర్ణాభిని వేళ మున గోపాలకృష్ణ సంశ్లేషముం జెందుటకు వారినోము నోచినదని దివ్య ప్రబంధమునం జెప్పఁబడినది. మఱి యిందన్ననో 'సత్య నీ వహహ, కావా భామినీ ! ' యని యన్నట్లు సత్యభామయను పూర్ణాభినివేశమున పూర్వావతారములయు కృష్ణునియు రాధాయమునాదు లయు ఉపాలంభము మొదలైనవి చెప్పఁబడినవి. ఇవియు దివ్యప్రబంధ సంప్రదాయ మునకు ఎడయనివే. 'తాటిమట్ట యెక్కుట' యనఁగా లజ్జపోనాఁడి తల విరబోసికొని తాటిమట్టపై కూరుచుండి వీథులు లాగించుకొనుచు 'చూడరమ్మా. నాకాంతుఁడు నన్ను ఏదశకు తెచ్చినాడో ! మీరైన తగఁజెప్పి కూర్పరమ్మ' అని ఆగాత్యముచేయుట ' అట్టిది యఱవసాహిత్యమున తఱచును ప్రసిద్ధమును, మఱి యీ యున్మాదమును ఇట్టి యుపాలంభమును రసవత్తరములని గ్రహింపఁబడినవి. అట్లే యామునచరితమందును, పండ్రెండేండ్ల బాలుఁడు ఆయామునుఁడు. “న వయం కవయ సు కేవలమ్ న వయం కేపల తంత్ర పారగాః అవి తు ప్రతిపాది వారణ అనియు, ప్రకటాటోప విపాటన క్షమాః” "ఆకైలా దద్రీకన్యా చరణకిసలయ న్యాస ధన్యోపక ణా దారక్షో నీత సీతా ముఖకమల నముచ్చా నహేతో కసేతోః ఆచ ప్రాచ్య ప్రతీచ్య క్షితిధరయుగళాదర్క సోమావతంసాత్ మీమాంసా శాస్త్రయుగ్మ శ్రమ మృదితమనా మృగ్యతాం మాదృశో ఒన్యః" అనియు ఆత్యౌద్ధత్యముతో ఆతఁడు రాజసభకు పోయి వాదించి గెలిచి తన మతమును స్థాపించినవాఁడు. విశిష్టాన్వైతమును శ్రీభాష్యము వీడి ఆచంద్ర నిశ్చలముగా స్థాపించిన రామానుజాచార్యుం ప్రాచార్యుడు తత్ప్ర్పేరకుఁడు మహాస్థానాగ్రాసనాధిపతి యగు రాయని చిత్రమను చూఱకొని యుండెను, > కృష్ణరాయనీ కావ్యపుఁ బదకము 27 “సంగతియె యోయి, యిసుమంత ఠింగణాపు, తత్త్వ నిర్ణయ వాదంబు దరమె నీకు ?" అని చమత్కారముగా లాఘవము తోఁపఁ ఆ రాజుచే పలికించి, ఆకథను రనము మీఱ నావృత్తిచేయు కుతూసాలమును ఆఁపుకొనలేక పోయెను. కావున దానిని అతిచమ త్కారముగా రచించి తీర్చుకొనెను. మఱి గోదయవతారమునకు కారణము దేవుని యారాధనకు తత్కధల గానము అత్యంతసులభోపాయ మని ఆయన సొంతముగా తన వరాహదంష్ట్ర మీఁద నవిలాన ముగ నిలిపిన భూదేవికిం జెప్పుటయు, ఆమె "అట్లుగా !" అని ఆశ్చర్యపడి లోకోవదేశ మునక కాక, తాను సొంతముగా అది చేసి చూతమను కుతూహలముం గొనుటయు ప్రకరణవశమున ఆయు జ్మహాలయప్రభువును ఆశువారుతో 'అహరహంబును విప్ర అంభదం భేరి తాగాధ గాథార్థ సమేత గీత రనంబునం బ్రొద్దుపుచ్చుటకంటెను పరమ తపం బున్నదే.' అని అట్టి పాలు క్షిప్రపదమగు 'గొప్ప తపస్సు అని రాయఁడు దానిని గ్రహించి తాను చిత్తమున నాటుకొను నవకాశముగొనుటకు కైశికవురాణమును ఏటేట కార్తిక శుక్ల ద్వాదశీయందు వినుచుండువాఁడు ఏకాదశివ్రతనిష్ఠుఁడు తాను దేవుఁడు ఆపెండిలిం జెప్పుకున్నందున ఇట్లు గ్రంథమున విస్తరింప దమకపడినాఁడు. కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెఱంగు పాండు మృ ద్బిందువుఁ దీర్చి, చెందిరము వేచకశీర్షమువైబలె నటిం జందుర కావిజీ బమరఁ జల్లని రేయిటి తట్టు పు న్గళి న్విందులఁ దేల్పి, నూనె ముడి వెంట్రుకలుకు తడి తావు లీనఁగళా బోటి గట్టిన చెంగల్వపూవు చెత్తుఁ దరు పరిణ తోరు కదళమంజరిఁయు గొనుచుఁ బోయి గుడినంబి విజనంబుఁ జేయఁ జొచ్చి మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టు.” చున్నదేవిని చిత్తమున భావింప రాయుడు విజముగా మ్రొక్కబడినాఁడని తోఁచు చున్నది. 28 ఆముక్తమాల్యద -- ఉపోద్ఘాతము ఋతువర్ణనము, మనోహర ప్రకృతి వర్ణనము సద్యః పరనివృతి పదము, మహాకపుణకు అత్యంత ప్రియము, వాల్మీకిరామాయణమునందలి ఆతుర సవర్ణన ఆఋతురసవర్ణన లకు మైమఱవి కాళిదాసు తన తొలి ప్రయత్నముగా ఋతుసంహారమునే తన వైదర్భ విపంచిలో పాడినాఁడుగదా. రఘువంశ కుమారసంభవములందును కథాధోరణిని మాని అంతగా ఇటు నటు పోవనివాఁడు వనంత గ్రీష్మాదుల కడ నాఁగు విలంబమును మాన్య జాలడాయెను. మాళవికావిక్రమోర్వసులలో అదుకు తెలియనీక ఆతఁ డదికిన వసంత వర్షలు రామణీయకమున మఱి యిలలో సాటిలేనివి. కేవల మాఋతు ప్రకృతి ప్రీతికే మేఘదూతమును రచించెను. మహాకవులు కది మానఠాని చాపలము. కృష్ణదేవరాయ డును అందులకై గొప్ప యవకాశములం గల్పించుకొనక ఉండఁజాలఁడాయెను. మఱియు అవి తన లోకానుభవమును ఆయా సాకులచే రాశిగా పోయి నిర్మించున్న కొటారులు. అం దినేక కృష్ణరాయఁడు యామునాచార్యులచే తత్పుత్తుని కుపదేశింపించిన రాజనీతి ఇట్టి పుస్తక పాఠము గాదు. తాను అనుభవమున ఎఱింగిన రహస్యములు గలది. ములు నీతిశాస్త్ర భారతశాం త్యనుశాసన వర్వాదులయం దున్నవై నను వానిం జెప్పిన తెఱంగు అని వట్టి యనువాదములుగా తోఁపక స్వానుభవమును మనకు వట్టియిచ్చునట్లే ఉన్నవి. మఱియు వరాహమూర్తి సొంతముగా చెప్పిన దృష్టాంతమును ఆచండాల బ్రహ్మ రక్షః కధను విస్తరించు చావలమును మానఁజాలఁడాయెను. కన్నడతాయఁ డగు కృష్ణరాయని దెలుఁగు వల్లభుఁడు తెలుఁగున తనకుఁ గృతి సెప్పుమన్నాఁడు. తాను తెలుఁగు వల్లభుఁడ నని తాన చెప్పుచున్నాఁడు. “తెలుగో కండ, ఎల్లనృపులు గొలువ నెఱుఁగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స.” అని, రాయనికిని తక్కిన యన్నింటి మీఁదికన్నను తెలుఁగుపై పక్షపాతము- దాని చవి యెఱుం గును, 'కండ' - పులకండము మాధుర్యభరితము అని. 'దేశ భాషలందుఁ దెలుఁగు లెన్స' యను సూక్తి రాయం కల్పితము గాదు. అంతకు చాలఁ బూర్వమే వల్లభ రాయఁడు తన క్రీడాభిరామ వీథియందు, - జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందుఁ దెలుఁగు లెస్స జగతిఁ దల్లికంటె సౌభాగ్య సంపద మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె, కృష్ణరాయని కావ్యపుఁ జదకము 29 అని చెప్పిందె. అతనికిని అవి సొంతము గాక పూర్వమునుండియే కలిగిన నూ క్తిగాఁ దోఁచున.. ఇన్నయభట్ట. ఆయాంధ్రకవి సకల భాషావాగ నుశాసనుఁడు స్వస్థాన వేష భా పాభిమత్వా సన్తో రన ప్రలుబ్ధ ధియః లోకే బహుమన్య నే వైకృత కావ్యాని చాన్య దపహాయ, అని రసప్రలుబ్ధ ధీశాలులు అన్యమును ( సంస్కృతమును) మాని వైకృత (= ( = తెలుఁ/L) కావ్యముల జక్మమానించు రనియు, ఉభయకవి మిత్రుఁడు తిక్కన ఆంధ్రమున భారతము రచించు.. య కాక, ఉత్తర రామాయణమున "ఒప్పైనను జాత్యము గామిచే ఎయ్యెగను సంస్కృతమును జొన్న" ననుటయుం ఇత్యాది బట్టి చూడ 'దేశభాషలందుఁ దెలుఁ.' 'చినది సంప్రదాయముగా 'నానుడి వలె దేశమున నెంతయు నానినఁ గాఁ జూపట్టుచున్నది. కన్నడరాయఁడు తెలుఁగుపై మమత గొనుట కీ. శే. వేగము వేంకటరాయ శాస్త్రులవారు తాము వుదూరి ద్రావిడులు అఱవలు.—అయ్యు తెలుఁగువై పుట్టుతెలుఁగులకన్నను వేయింతల పక్షపాతము గొని తమ యెల్ల నరస్వతినేవయు తెలుఁగునకె కావించుటను జ్ఞప్తినేయును. 'అమితం పాటఅ కబ్బం వడిఓం సోంఆ' ఆరియు 'పరుసా నక్జిఆ బన్దా పాట ఆ బన్ధ వి హో ఇ ను ఉమారో పురుస మహిళాణం జేత్తి అభిహస్తకం తే త్తిఅమిమాణం.' అను ప్రాకృత ప్రశంసయు దీనికి దిక్కు చూపునదే అగును. ఆ 'లెన్స' యగు 'కండ' కు ఉదాహర ణముగాను సమర్థనముగాను రచింపఁబడినది, ఆముక్తమాల్యద . ఆంధ్రమున ఇంత కంటెను ప్రౌఢమగు కావ్యము లేదు. సంస్కృతమున మురారి యనర్ఘ రాఘవమ్యు ఎట్టి ప్రౌఢిని సాధివఁగోరెనో తెలుఁగున అట్టి ప్రౌడి సాధింపఁబడినది. ఆ ప్రయత్న మున సంస్కృతమురారికంటెను తెనుఁగుకృష్ణ రాయఁడు శామ్యతరవిజయమును సంపా దించినాఁ డని కవి సహృదయ వక్రవర్తి శ్రీ వేదము వేంకటరాయశాస్త్రుల యభిప్రాయము, వార్డ్రోథియ కాక కల్పన ప్రౌఢియు ఆసవృశము. ఇది షష్ఠ్యంతాశ్వాసాం తర్తు వర్ణనల యుదు నిరనమై యున్నది. పాండిత్య వైదగ్ధ్య సంస్కృత ప్రతిరా సముత్పన్న వాక్కు ప్రౌఢాహేర మగునని ధనకూ 3 ఛృహర్ష ముకారులు వావిచ్చి చెప్పేవారు. మాఘే గతం వచః' అనియు నారికేళ మం సమ్మితం వచో భారమే సపది త ద్విభ 80 ఆము క్తమాల్యద - ఉపోద్ఘాతము H జ్యతే' ఆనియు మాఘ భారవులు నిర్దేశించి మల్లినాథుఁడు వాని ప్రౌడినే సూచించి వారి వాక్కు రన నిర్భరము రసికాస్వాద్యము అన్నాడు. తన య్వాసాంత పద్యవ అనుకృతుఁ దగు సర్గాంతశ్లోకాల 'విద్వఔషధ' మగు నైషధము చెప్పిన కవి శ్రీహర్షుఁడు తన కబ్బము 'మధువర్షి' యనియు 'సుధ' యనియుం జెప్పినాఁడు. ఇట్టి మెప్పుతోడనే రాయని పూర్వగీర్వాణరచనలం గూర్చిన భగవద్వాక్యముస ఆయాకావ్యమును విశేషించిన ఇష్టములో తెలియును. తెఱంవలన రాయనికి కవనమున ఏ గుణములు పలికి తు త్రేక్షోపములు జాతి వెంవెక్క రసికు లౌనన మదాలస చరిత్ర, భావ ధ్వని వ్యంగ్య సేవధి గాఁగ జె ప్పితిని సత్యావధూ ప్రీణనంబు, శ్రుతిపురాణోపసంహిత లేచికా కూచితి సకలకథాసారసంగ్రహంబు, శ్రోత్రఘచ్చటలు విచ్చుగ రచించితి సూక్తి, నైపుణీ జ్ఞానచింతామణికృతి గ్లాఱియు రసమంజరీముఖ్య మధురకావ్య రచన మెప్పించుకొంటి గీర్వాణభాష నంధ్రభాష యసాధ్యంబె? యందు నొక్క కృతి వినిర్మించు మిఁక మాకుఁ బ్రియముగాఁగ. ఉత్ప్రేక్షలు ఉపమలు జాతి బావధ్వని వ్యంగ్య సేవధిత కథాకథన నైపుణియు అని. దశావతారస్తోత్రము, ఆంగాష్టకయోగము, యామున శ్రీ రంగము, గోదావిష్ణుచిత్తుల శ్రీరంగము, అమ్మవారి పెండ్లి సదస్సు - ఇవన్నియు, విన్నమాత్రన, అఘచ్ఛటల విప్పునవే. అమ్మ వారి వయఃసంధి, రూపసౌభాగ్యము, అయోగవేదన, ప్రియో అమ్మవారి పాలంభము, ఆనంగదశలు, ఆనంగదశలు, కృష్ణగోపికల స్మరణ, గుడికి పోయిముచ్చటలు. ఇవన్నియు ఎంతయు మాధుర్యమునకు నెలవులు. శ్లేష అత్యంత విరళము. ఆది ఆజోలియే పెట్టుకొనని కాళిదాసునందు సయితము నూటి కొకటి కోటి కొకటిగా నుండును. ఉన్నంతమాత్రన ఆసవనముగను అత్యంతహృదయంగమముగను ఉండును. కృష్ణరాయని కావ్యపుఁ ఐదకము B1 ఇందును అట్టిది పుష్పలావికా విట మిథః సరనపరిహాసో కులంలోని యెడల రవంత కలదు. అది అత్యంతలలితము, భవభూతి మాలతీమాధవ శృంగారమున కథావస్తు వశముననే శ్మశానళీభత్సమును చెప్పి అందులకు ఎంతయో పెరుగన్నాఁడు. అలంకారికా" చార్యు లండ్లఱి బీభత్సోదాహరణములకును అదే 'ఆస్తి.' రాయఁడు బొమ్మ రాకాసి మట్టి చెట్టుల బీభత్సమున అతనితో లవలేశమైనకు న్యూనత లేక తులతూఁగినాఁడు. ఇందలి నగర వర్ణనలలోను. ఋతువర్ణనలలోను నిర్దేశించిన ఉత్తమాచారములు:- అఖ్యానములును తా నెఱింగిన వగుటయ కాక తన యనుష్ఠానమున కలిగినవియు క్యాదగును. రెండు నగరములు విల్లు బుత్తూరును మధుకయు వణికాంచిన, ఒక్కదాన పుణ్య క్షేత్రసదృశతను ఒక్కదాన రాజధాని సదృశతను నిరూపించినాఁడు. విష్ణుచి తీయ యామునీయ చరితములకు కైశిక ద్వాదశీవ్రతానుష్ఠాన మహిమను గోదను ఆకల్యాణమును తాను చెప్పఁ గడఁగి ఆట్లు తాత్పర్యముతో నిర్వహించుటచేత తాయని వైష్ణవంపు నైశిత్వము శీలసంపత్తి భక్తి ప్రపత్తులును ఊహింపఁదగును. అట్లే ఇందలి రాజనీతి యుపన్యాసము కొన్ని ఊహించఁదగును. తాను రాజై నుండి రాయని గుణాతిశయములు అనుష్ఠింపకుండునా ? అేగదా :- కృష్ణరాయఁడు మిక్కిలి నాగరకుఁడు. విల్లిపుత్తూరి వేశ్యల నాగరకతను ఎంతయో సుకుమారముగా చెప్పినాఁడు. రాయఁడు మహాదాత. "పాత్రకూరు లెస్స బడికించి, యతఁ క్షుడు గకయు నొకఁడు సెప్పకయు... ఒసఁగి వెఱఁగుపఱుచు టొప్పు." " అని దానవైఖరిం చెప్పినాఁడు, దీనిని వాఖ్యానించుచు నంజీవనియందు 'ఈ యువదేశము · కృతయుగ ధర్మాతీతముగా నున్నది 'అభిగమ్య కృతే దానం' 'కృతే ప్రదీయతే గత్వా' అని ప్రతిగ్రహీత దాత తాఁ జేరఁబోయి యిచ్చట అని మాత్రము చెప్పఁబడినది. ఆ యభిమనమున దాఁగిన రహస్యముం గాణేలు 'అతఁ గడుగకయు ఒకరు నెప్పకయు' అనియు ఆకస్మికముగాను అతిపుష్కలముగాను అనియు రాయఁడు నిజాదార్యముతో ఇంకు వాఖ్యానించినాడు. ముఖ కలియుగాన 'నేవయా దీయతే కల్" అని యేడేని పని చేయించుకొని దానికి ప్రతిఫలముగా కూలిగా ఇచ్చుట దాన క్రమము A-C 82 ఆష క్త నుల్యద ఉపోద్ఘాతము ఆస్తి స్మరించినాఁగు. ఈ పత్రభూతా ఓలో చెప్పిన ప్రకారము ఎంత ఉత్కృష్టముగా హృదయంగమముగా నున్నది! రాయడ. అట్లు ఆశ్చర్యము గొల్పునట్లు దానములు చేసిన వాఁడుగా నున్నాఁడు. తాను మెచ్చినదానినే కాదా గ్రంథస్థము చేయును. రాయఁడు మహావీరుఁడు, జేత. విజయనగరరాజ్యము ఏ యుద్దేశముతో నెలకొల్పఁబడినదో, తురకల ప్రాభవమును ఆడంచి హిందువులకు ఆపదలేని యోగ క్షేమ ప్రతిష్ఠ గూర్చుట యము నాయుద్దేశమును కృష్ణరాయలవలె సాధించినవారు మణిలేరు. అంగాష్టక యోగమును అనకుఁడు ఉపదేశించినదానిని గ్రంథమైన తాను జొనవుల ఆసాక్ష్యాత్కారానందమును తా ననుభవించినవాఁ తనిపచేతనే అని భావింపదగును. ఒక్క యలంతివాక్యమిన "ఇంతకంటే సులభోపాయం నాయోఢనయిన నయ్యధోక్షజుఁడు గాండీవి .వదేశించిన శరణాగత ధర్మంబ నిరపాయ ధర్మఁబు' అని చెప్పినను, ఆయోగోపదేశంపు విరివిచే తనకు అంద తాత్పర్యమని సూచించి తన యనఃస్థానమును ఊహింపఁజేసినాఁ ఉని తలంపఁదగును. ఆయాశ్వాసము మొగియఁగానే ఆశ్వాసాంత పద్యమున వేంకటేశునికి తొలి విశేషణంబుగా 'వకుళాలంకృత యోగిహృన్నిలయు' డన్నాఁడు. ఆయోగి జన్మాది ప్రయాణపర్యంతము ఒక దీర్ఘయోగముననే ఉన్నవాఁడు. తా గున్న చోటినుండి కదలకయే ఆవేం/ దీన హని ముననే నేపించినవాడు, తన్న తపస్సు చేసి నాజాత్య రించుకొన్న మహా విరగదశయందే సర్వ వావిడ వేదమును ఉపదేశించినవాఁడు. ఎడెల్ల ఆయావారు ఉపాయములును ఉపపత్తము. నాయ్యడు పరమ భాగవతుఁడును శిష్ఠుఁడును ఏకాదశీ వ్రతానుష్ఠాతయు. ఆదినము ఆమంచికం గన్నవాఁడు, తన యనుష్టానమునే పాండ్యమహిషి యందు "దశమినాఁ దేకభుక్తము సేసి, యవలినాఁ డోర్చి జాగరముతో నులడు నిబ్రు, బారన్ పోలీడు, పైవిద్రఁ బాఱుద్ క్కలు' పాడు · మత్పుణ్యకధల -- ద్రోయు. " అని అంత వివరమునఁ జెప్పినాడు. సత్యావరూ స్త్రీణవునుడు రసమంజరిని తన రచనలుగా సేఃన్నవాఁడు తానెంత రసికుఁడో1 అంతఃపురవ్యవహారమైన తాను ఎద్దదో వికృతిగని, పారిణాతాపహరణమున "వాునుపాదంబును దొలఁగం ద్రోచెం కాంగ్రె* యని విని ప్రకృతం గన్నాం తని తన్నుం గూర్చిన యొక్క "పుక్కిటి పురాణ' వ్యాప్తి గలవాఁడు కాబోలు. ఇదీ అది 88 ఆ సత్యావధూప్రీణనకును ఎబ్బంగి వ్రానెనో! వికృతిమాట మృష "నవలెల్ల దీర్ఘ కాంబువు చల్లు పోరాట నలసి, మృణాళికా జడములైన బాహువులు.... ఇత్యాది... ప్రియల వేఁకువఁ దొడ నెచ్చరించి కలసి రెలమి ధన్యులు దఱపివెన్నెల బయళ్ళ - (11-Br) అనుటయందును హృదయములు తాఁకని వెన కౌగిలింతలతోడియు మేలుకార్యములకు బౌఱచి సల్లావ చమత్కారములతోడియు దంపతుల పొందు (III-82) అనుటయందును రాయఁడు తన సొంత వృత్తమునే అడవినాఁడా అని సంజీవనిలో సందేహము సూచితము. విల్లుబుత్తూరిలో విష్ణుచిత్తుని భాగవత సేవను అతిథిసపర్యను. 'తదీయారా ధనను "ఆనిష్ఠానిధిగేహసీమ నడు యాలించిన త్రోయు నెం తే నాగేంద్రశయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం ధానధ్వానము 'నా నిశాక బహుతా, నాస్త్యుష్టతా, నాన్యపూ పో, నాస్త్యోదనసౌష్ఠవమ్ చ, కృపయాభోక్తవ్య' మన్మాటలు.” అని యివి భావించినవాఁడు, అట్టి భాగవతగృహాలు సొంతాన కలిగియు, చూచియు, తాను ఇట్టి జరుగుపాట్లు కలుగునట్లు పుణ్య క్షేత్రముల నందందు తగిన యవేక్షణతోడి పత్రములు ఏర్పఱిచియునండునా? ఇది ఆ కనికి ఎంత భావనాబలము గలవానికైనను, ఎంత ప్రతిభాశాలికైనను. తన పైని తన దేశకాలముల మహిమను అతిక్రమింప వలవిగాదు. కృష్ణదేవరాయఁడు ఆముక్తమాల్యదను చెప్పుచున్నాఁడు. ఆమెకాలపు దేశకాల స్థితులను ఆ కథలో విశ్లేశింవ వలయము కాని తన కాలమువానిం జెప్పంగూడదు. వాల్మీకి వ్యాస కాశిదాపాదులు యుగాంతర పురుషుల కథలం జెప్పిచారు. వారికి భావనావ్యాపారము ఎక్కువవలయుడు. రాయడు చెప్పిన కథ ఎంత ప్రాతడైనను ఈ యుగముదే; కాగా వారికన్నను అందులకై తనకు సంయు భావనపని తక్కువయే. అంతీయ కాక, వనంత గ్రీష్మాదుల $4 ఆము క్త మాల్యద -ఉపోద్ఘాతము వర్ణనమున ప్రకృతి నాఁడును నేఁడును, ఎన్నఁడును ఒక్క తెఱంగే యగును, వరదేశమును, మెడిటరేనియం పట్టు, కాంగో మిసిసిపి ఆమేజాళా తీరదేశములు-ఆను నటువంటిదానిని తన కావ్యమున వస్తువళమున ఆకర్షించు నక్క లేక యున్న, మఱియు మనదేశమున జనులకు ఎంతలైన బాహ్యవుఁ బేను సంస్కృతి కరడములు తగిలినను, అవి ఎంత మార్ప జాలినను, జనసంస్కృతి "నివేళః శైలానాం త దిద మితి బుద్ధిం ద్రఢయతి" అను నాయమున హిందూసనాతన ధర్మప్రభావమున, రామాయణ మహా భారతములం దోఁచునదే, వైపొరలలో ఎట్లైనను, కండలోను మూలకందానను మార్పు లేనిధే అని తలంపఁదగును. కావున ఆముక్త మాల్యద దేశ కాలములను గూర్చి ఇంచుక - ఈ కథ పాండ్యమండలమునకు, విశేషముగా విశేషముగా విల్లిపుత్తూరు, మధుర, శ్రీరంగము, కురుంగుడి మొదలగు శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములకును, విష్ణుచిత్త యామున చండాలగాతృ ప్రభృతి దాక్షిణాత్యులకుకు చెందినది గావున ఇందు ప్రాయికముగా అందలి క్షేత్రారామాదులును ఆ దేశముల జనులును తత్సంస్కృతి ధర్మము ఆచార్ ములును వరామృష్టము లగుచుండును. ఇండ్లవాకిళ్ళ ద్వారబంధముల మీద, గృహలక్ష్మిని సింగారించు భావనతో, గజలక్ష్మియు ఆమెకు ఇటు నటు శంఖచక్రములును వ్రాయించి యలంకరించు వైష్ణవ గృహాలంకరణ ప్రక్రియ రాయని మెప్పువడసినదే. నగరి వీథులు వట్టి మట్టి డొంకలుఁ గాక తెల్ల ఠాతి కంకరతో మట్టితములు అగుట కలిగినదే. వానికి ప్రక్కల అలంకర కార్థమును నీడకోసమును చెట్లు నాటుటయు, అందు పథికులు దప్పి తీర్చుకొనుటకును, గృహోపయోగమునకును కావలసినవారు చేదుకొనుటకును, వీధులలో కావలసినప్పుడు నీరు చల్లుటకును ఉపయోగపడుటకును ఆటనట "బావులుండుటయు పౌరుల యారోగ్యాది రక్షణ (Sanitation)కు సౌకర్యమునకును, సంబంధించిన ఏర్పాటు, దేవళములలో ఆట పాటలు నేర్చిన దేవదాసీజనము ఉండెననుట అబ్బురముగాదు, అది యిటీవలి వఱకునునున్న దేవళముల యాచార మెగిదా బ్రాహ్మణులు శ్రీవైష్ణవులు అరుణోదయమునకే నదులున్న నదులలో, చెఱువులున్న వానియందు, జలనంమృద్ధిగల వంటకాలు వలయందు నఖుతమును స్నానము చేసి తమదోవతి యంగవస్త్రములను తాము ఉదికికొని అందముగా పిండి పిడు చల వేసికొని కొంపోవుదురు. ఆటగట పోలీసులు ఆరేకులు - విశేషముగా రాత్రుల, పురరక్షణకై! కావలి 'beat'- తిరుగుచుందురు. పట్టణవరినరములందును వరిచే లుండును. పండ్లయు పూవులయు తమలపాకులయు తోట లుండును. శ్రీ వైష్ణ • ఇది ఆది 35 వులు భాగవతులు ఎక్కువ చదువులు చదువుకొననివారును తమ యింటను బయటను నిజమత సంప్రదాయమున ప్రబలి నాటుకొన్న భగవచ్చేషతయు భాగవత శేషతయు. ఆన్యోన్య నై బ్యానుసంధానమును స్ఫురించు పరిభాషను, సంస్కృతమునకును ద్రావిడ మునకును చెందినదానిని అప్రయత్న సులభముగా వాడుచుందురు. దాననే విష్ణుచిత్తుంవారి యింట నిశీథమందును జరుగు తదీయారాధనలందు "నాస్తి శాక బహుతా, వాస్త్యుష్టతా । నా స్యపూపో, నాస్తోద్యన సౌష్ఠవంచ, కృపయా భోక్తవ్యమ్." అన్మాటలు వినఁబడుట. [ఇది 'అతిథి దేవోభవ' అను వేదానుశాసన నిర్వాహము, 'పండ నలయదు వేపురువచ్చి రేని నన్నపూర్ణకు ముద్దియా నతని గృహిణి, నతిథు లే తేర నడికిరేయైనఁ బెట్టు వలయు భోజ్యంబు లింట నవ్వారిగాగ ఆనుదానికి భంగ్యంతం శ్రీ వైష్ణవ సంస్కారము. ] దాననే ఆ విష్ణుచిత్తు గెల్పుటుత్సవమునను 'అర్ధ' 'అహో' 'ఆహా' 'ఆఃకృతతాం గతః కలిః' 'శ్రీ సూక్తి' 'ఇద్ధార్థత్యమగా లయం హి కురియాం' ఆను కేకలు వినంబడు ఓయు, మాలదాసరియు - 'ఏను ఫలంబెఱుంగ. ఫలంబు వరమేళ ముథోల్లాసంబ. ఆజ్ఞా కైంకర్యంబులకు ననుమతి కైంకర్యంబులకు ఫలపరిమాణగణన ప్రవన్నుల కెక్కడి యది ? (ఆ. B-22) ఇత్యాది వెలుకుటయు. భాగవతాలిథ్యమునకు మంచి సత్రము లేర్పఱుపఁబడి యుండునా? రాజధానులకు ఆరుల కిభేద్యములగు మిన్నంటు కోటలు పాతాళము దాఁకు ఆగ డ్డలు ఉండెను. వ్యాపారమునకు సముద్రయానమును పరిచితము, అందు సముద్రమథ్యమునకు, నేలం దాఁకియే ఒక దీవి యోగవారు వెఱదీవి యోగవారి నరకులను కఱ్ఱల కొనలకు మూటలుగాఁ గట్టి అందిచ్చి మార్చుకొందురు. ఇది రూకలు ఎందకే వస్తువినిమయరూప వ్యాపారము (barter). పాటమాధురికి మ్రోడుల జిగురింపను జలఁ గరగింపను శక్తి కలదు. ఇది పట్టి అతిశయో కియైన దానికి ప్రచారమేల? దోహదములు చెట్ల నకాల వుష్పములు పూయించునట్లు, అందు కొన్ని రాగములు అకాలవర్షములు కురియించుట మొదలగు అకాలకార్యములు సాధిం చును; అమార్గాన మేఘరంజికాగమునకు వాన కురియును. ఇది దబ్బరయేని దీనికి ప్రతీతి ఎట్లు కలుగును. పొగతో కాటుక చేసికొనుట, పునఁగును పూసికొనునపుడు దానిని రవంత కాచి కరఁగించుకొనుట. సతి పసిదియు పతిపాదము లొత్తును- [మఱి యేతర్విపర్యయము కదా శృంగారమునఁ బ్రశస్తము.] విటులు విలాసినులతో తద్దర్శన మున రేగిన పచ్చి సరసోక్తు లాడుచుందురు. మాదిగవాడలో కాపురము చేయరాదు. కటుఁడు మఱువు దాల్పకయే యుద్ధజయము గొనుట ప్రౌఢ్యతిశయము. ధనికులు సమాధములలో కోట్లకు పడగ లెత్తుదురు. 36 అము క్త మాల్యద - ఉపోద్ఘాతము 'విలో పాటలులు వూచును. శాల్మలులు పండి పగలును. బొమ్మలు నేయు లకు బంగరు వెండి రాగి మొదలగునవి కరఁగించి అచ్చులఁ బోయుదురు. వేసవిలో ఏళ్లు ఎండఁగా చెలమలు త్రవ్వికాని ఆ చల్లని నీటిం గొందురు. మొనళ్లు గల యేడరేవుల చెంత నీళ్ళు ఇగరగా, ఆ మొసళ్ళు రాత్రులు ఊరిలో తిరుగును, కుక్కలు తఱుమగా బావులలో వడును. పూఁఓలకు నీరు ఏతములం బాఱింతురు. వానిం ద్రొక్కు వారు శ్రమవినోదముగా బిగ్గ, పాటలు పాడుచుందురు. చలిపందిరులలో వెలఁద్రులు నరసా లాడుచు" బాటసారులకు దాహము తీ రురు. ఎండకు కాగిన వీథులు మావటను ఆవిరులు ఎగయుచుండును. వెన్నెలయు వానిని తగ్గింపలేకుండ ను, పగళ్ల వడకు ఎప్పుడును డిగ్గియలలో ఈదులాడుచునే యుందురు. -నదావగాహ క్షత వారిసఇ్చయః', రాత్రుల వెన్నెల బయళ్ళ నిద్రింతురు. వట్టివేళ వీవనల పీచుకొందురు. మణి నేఱు చల్లగాలి యుండదు. చెఱకు తోఁటల కది నఱుకుడు కాలము. బావుల నీరు లోతునకు క్రుంగి పోయి. పగళ్ళు మిక్కిలి చల్లగా నుండును. పొడుగు త్రాళ్లతో చేఁదుకొనవలయును. వాననకేన కొప్పులోని మల్లెలు వెంట్రుకల కొనల చిట్లించును; అప్పుడు పాటలములు దానిని మాస్పి వెంట్రుకలఁ బోషించును. దోర మామిడిముక్కలతోడి చేప వేపుడు చాల రుచిగా నుండును, కాని తరువాత కనరు త్రేన్పులు వచ్చును. దానిని చల్లని యిసుకలో నుంచిన యెలసీటికాయల నీటితో తీర్చుకొందురు. వేసవిలో తెప్ప తిరునాళ్ళ చేయ దురు అందు ఉంచనము తానహర ఫలాదులు వడపప్పు పానకములు వినియోగము చేలో గురు యాత్రికులు వీథి యరంగుల పరుండుదురు. చాలసేపు ఉబుసువుచ్చి విధింతురు. కేవలము లౌకిక సుఖచిcతావరుఁడఁగా సన్నవారికి తటాలున జైవికముగా మనస్సు మాటి మోక్షపరత కలుగుట మానసిక శాస్త్ర సమ్మతమే అగును. దానిని 'Conversion' (మార్పు) అందురు. వానిని 'Convert' అందురు. నాఁటి పాండ్య రోజులు ఆటి 'Convert' లు, రోజు ఆస్థానమున నభ గూర్చి వాదములు చేయించి చేసి తాను దానిని అవలంబించుట లోకాన అమతవు. కాలమునకు వ్యా ప్తికి గొప్ప చేయూఁశ వులే ఎఱుఁగ నివాఁడు. 'యథా రాజా తథా ప్రజా'. అట్లే ఒకఁడు చదు దేవుని యనుగ్రహము : ఆకస్మికమగా తటాలున గొప్ప
పండితుఁ డగుటయు, చిన్నప్పుడు మొద్దులని పేర్లన్న యెండ తో విదప అసా ధారణ పండితులైన కథలు మన యనుభవంపు నిజములు ఎన్నియో. కృష్ణరాయుడు వైష్ణవమతమునకు 'Convert', క్రొత్తగా ప్రవిష్టుఁడు. అట్టివారి కి నడ మంత్రపు ఇది ఆది 87 వైష్ణమునకు నామాలు మెండు అన్న సామెతగా మతాభినివేశ మేక్కువ. దేవళములకు దేవుళ్ళకు ఆచార్యులకు విరివిగా ఇచ్చి పోషించినవాఁడు. ఇ దెల్ల అతని పాండ్యరాజ ఇ కథాభిరుచిజేతను యామునుఁడు రాజై పాలించిన కథచేతనం గూడ ఊహింపఁదగును. చారిత్రకముగాను అది సత్యమే. పరాజితరాజు అడవికి వలసపోయి తన హితులం గూర్చుకొని యందుండి మరల తన ఛానిని జయిలచుకొన టకు స్వయము వేచియుండును. కేశిధ్వజుఁడు ప్రాయశ్చిత ముపదేశించినందులకు 'ఖాండిక్యునకు గురుదక్షిణ యీఁగోరి వచ్చేను. ఖాండిక్యుఁడును కేశిధ్వజునకు తనకు పరతత్త్వమును దానిం జేరు యోగమును చెప్పినందులకు ఆర్చిన గావించెను. సౌజన్య 'మన కట్టిది! గొప్ప పండితులు అందళంబుల రాకపోకలు గావింతురు. కూడ పరిజనము పాదూవాహుంబో నిదియు నుండును. ఆది ఆచారము. వాద జయ రూఢికి జేతను ఊరేగించుటయు. వాహన ఖగరాజు రెక్కల మ్రోత్ర నేఁటి వాయువిమానముల మ్రోఁతము జ్ఞప్తి చేయును. మాననీయులకు మ్రొక్కు ' నప్పుడు గొడుగు విప్పుకొని యుండ గ్రూడదు. అది యపచారము, మూయుట మర్యాద. పరికళ్ళాన తరకలు పోవుటకు బేటలతో తూర్పాఱఁ బట్టుదురు. సాధ్వి ' "సావిత్రిక థలో యమవరమున పునర్ణాతుఁడైన సత్యవ తునిం గూడి తన మహారాజు సౌధమును జొచ్చెను, 'కుచేలఁడు కృష్ణుం జూడ వచ్చినవాఁడు అచట నాతిథ్యము కొని యింటికి మరంగా "ఆట నంతయు తనకు ఱుతు తెలియనట్లుగా తన యిల్లు ఇంటిస్థితి కోటీశ్వరునివి ఆనునట్లు, మాఱియుండెను. ఇవి యుంగాంతర పురాణ ప్రస్తావములు వంటి విష్ణుచిత్తుడు' వాదము గెలిచి తన యింటికి మరలినప్పుడు "గానాలంకార సహితంబును రత్నకాంచనమయంబును అగు నాత్మీయభవనఁబుం గాంచి
- స్మితుఁడై పుండరీకాక్ష మహిమాఖిలబ్ధి వైభవంబుగాఁ దెలిసి ప్రవేశించి,
శొంటికంటే శతగుణంటుగా భోగవతపూజా ప్రవణుండై యఁండెను.” ఇది ఈ యుగాన జరిగిన కథయే, ఆవిశ్వననీయమగునా? ఐనను ఇది ఔచితిఁబట్టి రాయకల్పితంబుగా కన్పట్టును, ఆ కశములయందు మృగ్యము. ఊరేగింపునకు, చెవులు గింగురుమనునట్లుగా నానావిధవాద్యములు ఒక్కుమ్మడి మ్రోగిఁపఁబడును, దేవిమట్టుకు అది నిపుణముగానే వాయింపబడుచున్నను. అన్నియు ॰ గలసి పెద్ద ఘోషగా నుండును. ఏది యిష్టమైనవారు దానిచుట్టును మూఁగి విమచు అందూ ఆటవట. ఊరేగింపు కొంత కొంత సేపు నిలిచి, నట్టు సాగి చుందురు. 88 ఆము క్తమాల్యద – ఉపోద్ఘాతము - పచెలువలు ఎదు రెదురుగా తిరిగి లాస్య మాడుచును మరల ఊరేగింపు సాఁగుచును ఉండును. వీథి నిండిన జనము. పొడుగున్నను ఇటునటు సామంతులు రాజకుమారులు అధికారులు ఏనుఁగలమీఁదను గజ్జెలమీఁదను బలని నడుచుచుందురు. ఇతర పట్టణా లయు పల్లెలయు జనము శతూహలముతో అందు కలసికొని నడుచుచుందురు. చేళ్య మేళములు అనేకములు వచ్చియుండ. ను. నటవిబ గాయకు లందు సమాగతులై యుందురు. అందఱు పూర్వ పరిచితులు మిత్రులు ఒండొరులఁ గాంచి ఎచ్చరికలు చేసికొనుచు ఎగతాళు లాడుచు ఇట్లు అతి కోలాహలముగా నుందురు. ఇట్లు దక్షిణ దేశమున గొప్ప తిరణాళ్ళ యుత్సవములు ఊరేగింపులు ఇప్పటికిని ఇంచుమించుగా ఈ విధముగానే జరుగుచుండును. బయటి 'యూళ్ళ నుండి వచ్చినవారు ఆ పూల బంధులయు మిత్రులయు నిండ్ల గొప్ప యాతిథ్యమును అంగీకరించి తమ యూళ్ళకు తరలుదురు. 'యథా రాజా తథా ప్రజా' అనునది మత విషయమన చాల రా జవలంబించిన మతమువారికి ఆస్థానమున ఆదర గౌరవములు. కోరి దాంభికులును ఇచ్చకులుకు అందు చొచ్చుటయు కలదు. రాజు చేతో వైశాల్య సంకోచములం బట్టి ఆదరానాదరములు. పాటింపు గలది. రాజువలన అజ్ఞావి ఇతర మతముల వాకి జనులకు జ్యోతిషమందు విశ్వానము గలదు. 'జన్మరాశికి మూఁడవరాశియం దుండు సూర్యుఁడు శ్రేయః ప్రద్యుడు. కూతులు అత్తగారింటనే కాపురము చేయుచుండి గర్భిణులై నపుడు కాన్పునకు పుట్టింటికి వచ్చు నాచారము గలదు [మఱి శాకుంతలమున కణ్వముని గర్భిణిని లేతచులు దానిని శకుంతలను మగవింటికి పంపివేసెను. "మరల నేనెపుడు ఇక్కడికి వచ్చుడు' యని యడుగఁగా, మనలితశాన వానప్రస్థా శ్రమమున చొచ్చు. భర్తం గూడి అని తాను బదులు చెప్పేను కాని, కాన్పునకు' పిలిపింతునులే అని యనలేదు. మఱి వాల్మీకి వివాసిత సీతను కఠోర గర్భను రక్షించినపుడు, 'జనకుఁడు నాకు పరమమిత్రము, నాయాశ్రమమును నీ పుట్టినిల్లుగానే 'తన్మా వ్యధిష్టా విషయాన్తరస్థం ప్రాప్తాని వై దేహి వాతు ర్ని కేతమ్.' ఇది భర్తవలని దెప్పరమున రక్షణకు పుట్టినిల్లు. ఆశ్ర యించుటయు కానోపును,]. దొంగతనముం గూర్చి రాజుతో ఫిర్యాదుచేసిన, రాజు దొంగను వెదకించి పట్టింప జతనపడఁగా, దొంగ దండనాదికము తప్పించుకొనుట కే సొత్తుగలవారింటికి అట్లుట్లు తా నగపడకుండ చోరితమును నేర్చుటయు గలదు' పూర్వము మంచి రాజ్యమున పోలీసులు ధార్మికులై యున్నంతవఱకు దొ.గ తనము పట్టువడుచును, చోరితము పునర్ణభ్యమగుచునుండెన గాని నేఁడు వారు భావింపుము* అన్నాడు. ఇది ఆది 39 దొంగలకు షరీకును వారితో రహస్య భాగస్థులును ప్రేరకులుం గూడను ఉపోయిన తరువాత ఇఁక చోరిత పునర్లబ్ధి యుండునా? మార్గంగికులు తమ వాద్యమునకు అక్కఱతో ఎఱ్ఱకుచ్చులు వేలాడు తెల్లజాలరులతోడి బురఖాలు తొడుగుదురు, తిరుణాళ్ల ఆ జూడ వచ్చినవారు ధ్వజారోహణనమయమున ఆయూరిలోనున్న అవరోహణమునకు ముందు ఆ యూరిని వదలి పోఁగూడదు. ఆక్షేమకరము అని జనులకు నమ్మక ముండెను. ఆనమ్మకము ఇప్పుడను కలదు. ప్రాయికముగా తోఁటకంచెలలో గేదంగు లను నాటుదురు. అవి ముండ్లుకలవగుట తోఁటకు మంచి రక్షకము. అవి వానాకాలమున పూచును. ఆ పొదలలో నాగలు పరిమళలుబ్ధులు కాపురముండు ననుటయు ప్రసిద్ధము. ఇప్పుడును అట్లే, చెఱకును వేసవిలో నాఁటుదురు. ఆది వరరువునకు నిడుపుగడగా, ఎదిగి అన్ని రంగల నిండుకొనును. శరత్తులో పండివ్రాలును. వర్షలో సూర్యుని చుట్టును గాలి సడికట్టుట ప్రకృతిలో కలిగినదే కదా. తొలివానలలో వడగండ్లు రాలుట కలదే ఐనను, ఇపు డది విరళముగానే యన్నది ఇప్పుడది మళ్లీ రాయఁడు వర్షలో వానిని మాటిమాటికిం బ్రస్తావించుట ఆకాలమున ఆయనరాజ్యాన ప్రాయికమగుటను సూచించును కాఁబోలు, వానకు నేలలో- బీళ్ళలో పచ్చిక దట్టముగా మొలగును. పొయలు ఎండిన నదులలో వెల్లువలు లేచి వడివడిగా, భయంకరము లగుచునే, రమణీయములునై సముద్రముం జేరును. అడవులలో నెమళ్ళు కూయును. ఇండ్లలో పెంపుడువియు కూసి ఆడుచుండును. పాముల సంచారము ఉం మ. ఐంద్రజాలికులు బసుమము గరిక నెమలి కుంచె అనువానిని తమ యాట బరికరముగా వాడుచుందురు. దక్షిణాపథమున ఇప్పటికిని అడవులు, దండక మిగుళ్లు, గలవు, కృష్ణరాయని కాలమున ఆవి ఇంకను విస్తారముగనే యుండును. రాయఁడు తన పయనములలో వర్షతో అక్కడి ప్రకృతిని చెట్లపూలను కాయలను నెమళ్ళను చూచియే, కేవలము గ్రంథపఠనమునుబట్టి కాక ఈ వర్షవర్ణన చేసియుండును. ఆటల ప్రేక్షాగృహంబులును అందు వరదాలును పాత్ర లాడునపుడు వానిని పట్టుఓయు తొలగించుటయు మద్దెల మ్రోగించుటయు పరిచితములే. పడగండ్లు రాలిన వానిని నోట వేసికొను చాపలమును ఆపుకొనలేరు. మణి దాన చలిపండ్లు వడును. దారుల బురదకు వెఱచి మృగములు కొండలమీఁదనే గుంపులుగా నుండును. పక్షులు గూళ్ళలో మిక్కిలి ముడుచుకొని వడఁకుచు కదలక మెదలక ఉండును. బేగ్గరు లన్ననో మేఘములు దాపున ఆడుచుండును. చాల సంతోషకారణము కలిగినపుడు ఆకలిదప్పులు తెలియవు. సంతోషకార్యమే సాఁగును. దుర్దినములు ఘటిల్లఁగా నూర్యుం జూడక తినని వ్రతముగలవారికి ఆతనిం గనిపెట్టుటే పని 40 ఆము క్తమాల్యద - ఉపోద్ఘాతము సంధ్యావేళ యెప్పుడో ద్విజులకు తెలియరాదు. సేద్యగాండ్రు అనకూలించిన యా కాల మున చల్లకము చేయుదురు. అడవిమల్లెలు పూచును, సంతలు చెదరిపోవును. అతిథులు ఎక్కడికిని పోలేక వస్తుండవలయును. ఆకాలమున ఇంకను దేశాన మట్టిమిద్దెలు మెండుగా నుండినవి. అవి వానలో, ఉరియును. ఇఁక పాంథులబాధ చెప్పవలయ నా? సేద్యమునకు దున్నలను ఎడ్లను సమానముగానే పూన్చుచుండిరి. ప్రజలకు కట్టెలు నాని మండనందున వంటపసి చాల క్లేశకారి య యెను. కెరొసీను నూనెయు ఆగ్గిపుల్లలు లేని ఆకాలమున వానమునురుల నిప్పు చేసికొనుట . విసివించు పని. అందును విశేషముగా అనాఢ్యులకు. ఇల్లిల్లు తిరిగి ఒక నిప్పుకణిక సంపాదించుకొని దానిని ఉపాయములు సూది మండించి ఎట్లో పంటచేసిన అవండిన యన్నము ముందు తినువారికే ఐపోవుగు స్త్రీలు మరల ప్రయత్నము చేసి అది యెంత సేపటికి ముగియక పడుక టిల్లు చేరఁబోరు అక్కడ వీరికై కాంతులు కౌగిళ్ళగై క ను పెట్టుకొని వేగించుచు విసుక కోనుచు ఉందురు పూరిండ్లవారు గడపక్షడనే కంబాలు కడిగికొందురు. పెద్ద జల్లులో గాలి గొడుగును
- పచఁగొట్టును. బాటసారులు తడియచునే నడువవలయును. అట్లు వారు వియోగబాధను
కొంత ఓర్చుకొందురు. రచ్చలు దొరకిన అందు చేరుదురు. అంతలోనే లేనిపోని వాదములు తీవ్రము గానే చేయుదురు. ఇంతలో జల్లు తగ్గిన, ఎక్కడివా రెక్కడికి చెదరి పోవుదురు. కాకులు వీథిచెట్లపై గూళ్ళుకట్టుకొనును. వానయైనందున కాపులు సేద్యపుఁఐను లకై పంట చేనియఁదే గుడిసెలో కావురి ముందురు, వారికి ఇండ్ల నుండి భార్యలు గూడలు దాల్చి అంటళ్ళు మోసికొనిపోవుదురు. చుట్టును వాన, వాకిలికి గూడ మూత. గుడి : సైలో ఆ దంపతులకు చలికి వెచ్చని యొంటిపాటు వారు ఆ పనులనడుమనే కాముని య్యాటలును కొంత యాడుదురు. ఆ వానకారులో సంపన్నులగు రెడ్లు ఆప్పుడు సులభము లగు పలు అడల మిశ్రవు' గూరను చింతచిగురుతో చేర్చి పొరంటి అసాథకముతోనే వేడివేడి చిన్నారుగబియ్య . పన్నమును కలుపుకొని దండిగా నూనె పోసికొని గొంతుదాఁక ఉనుదురు. చలివినోదముగా మంచముక్రింద మేకెరువు కుంపటి అంటించి పెట్టుకొం దురు. ప్రక్కనే కట్టివేసియున్న దూడలచే హితపుగా దేహమును నాకించుకొందురు. అనఁగా సంపన్నులయ్యు, అనాగంపు భోజనమును పడుకయు ఉబుసును కలిగియుందురు. సంపన్నులయ్యు సిసినితనమును పాత్రవాడుకలను మానరు. మఱి రాజులన్న నో' భోగులు, ప్రొక్కి మేలుకొందురు. వారు నెమళ్లను పెంచుదురు. అనెమళ్లకు బంగారు రతనాలవాన యష్టులు. వాని పైన ఉండి ఆడ కూయుట వారికి మేలుకొలుపు. అంతట మంచిసువానశలతో 1 ఇది. ఆది 41 నలుగు పెట్టించుకొని చాలసేపు వేన్నీళ్లతో స్నానము నేయుదురు. తళతళని సన్నని దోవతి కట్టుకొని మణిహారము వేసికొని వాసనగల మొగలితేకును తుఱుముకొని జామైన తరువాత కొలువొసంగి దురు. తరువాత అడవి జంతువులు శ్లాఘ్యంపు మాంసముతో రాజనాల యన్నమును దండిగా నేయి ఫోసికొని ఆరగింతురు. కస్తురి యెక్కువగా వేసి గమాయించు తమ్ములము నేసి ఆగరు చెక్కలు రాజు ఇనువ బండికుంపటి పెట్టుకొని మేడకిటికీలవద్దఁ బ్రియలంకూడి ఉఖముల వాన చూచుచు హాయిగ కాలము గడుపుదురు. ఒక్కొక్క విషయమునను రెడ్లకన్నను రాజుల నాగరికత రసికత ఎక్కువగా చెప్పఁ బడినది. రెడ్లు ఆట్లుండకన్న రాయఁడు అట్లేల కల్పించును? హేళన చేయనేల? ఆది నాఁటి వస్తుస్థితియే యన తలంపఁదను. ఇటీవలం గూడ రెడ్లు వట్టి యొదలును తలకుఁ పలుబారల వెనుమోపు తలగుడ్డయు తమకు ఏక లక్షణముగా చుట్టుకొని యుండిరి కదా. శరత్తున తామరలును కలువలును పూచి సరస్సులు కనువిందు అగును. ఆకసము నలుపెక్కును. సూర్యచంద్రనక్షత్రములు కాంతి యెక్కును. వెన్నెల అతిరమణీయము, వరులు వండ.ను, దోసలును. చెఱకు పండి వ్రాలుసు. నల్లని మింట తెల్లని మేఘ ఇందుపుగింజ గందము వండు నీటిని తేర్చు ఖండములు. ఏడాకులయరఁటులు పూచును నమట ఎఱిఁగినవిషయమే. మబ్బు విడిచిన యెండల వేఁడి 1 L నీచకులజులు గాక. ఉత్తమకులజులగు బ్రాహ్మణోత్తములను దుర్గాధిపతులు చేయుట రాజ్యమునకు క్షేమకరము. వారు విశ్వసనీయులు, ఎప్పుడును రాజునకు తిరుగఁబడరు, నీతిశాస్త్ర మెఱిఁగి అధ్మము చేయ వెఱచు : యసుమళ్లిన బ్రాహ్మణులను ఏఁబదిఏండ్లు దాఁటి డెబ్బదిశీ' లోను వారిని మంత్రులుగా నుంచుకొనుట శ్రేయము. అట్టి యుత్తములు దొరకకున్న, గుణహీనులు అపకారు లగుదురు గాన వారిని మాని, సొంతముగానే తోఁచినట్లురు చేత వచ్చినట్లును పనులు చేసికొనుట శ్రేయము. గొప్ప కార్యములకు ఒక్కనినే అధికారిగా పెట్టక పలువురిని నియమించుట శ్రేయము. బ్రాహ్మణునే గొప్ప యధికారమున నియమించుట శ్రేయము. అతఁడు క్షత్రియ. శూద్రుల పరిహాసమునకు వెఱచి కార్యసాధకుఁడగును. మఱియు అతఁడు రాజును చక్కఁగాఁ గొలిచి బ్రదుకుట తన ధర్మమని యెఱుఁగును. దేవాలయములు ధనమును పొరపాటుననైనను బొక్కసమునకు రానీకూడదు. ఏలన అది జేఱుచును. రాజు రాజ్యమునకు తొలుత బయటి శత్రువులు తొలఁగించుకొని తరువాత రాజుం 42 ఆము క్తమాల్యద—ఉపోద్ఘాతము లోపలి క్షుద్రుల నథంపవలయును. కొండెగానిని తటాలున తఱిమివేయఁగూడదు. ఒక పాటిగా ఉంచుకొనియే యుండవలయును, కొండల నడవులనుండు ఎలఱుకుల పొరుగూళ్లను కుదురుగా నొక చోటనుండి సేవచేయని శూరుల కిచ్చిన వారొండొరులపై వ్యావృతులగట తక్కిన రాజ్యమునకు క్షేమము, పార్వతీయులు స్వల్పమునకే అతిమిత్రు లగుదురు. అది తెలిసి మెలఁగవలయును. [ఇట్లు రాయఁడు యామునాచార్యులచే ఉపదేశింవించిన రాజు నీతియెల్ల ఆ రాజ్యాన అనుష్ఠానరూఢ మని ఎన్నఁ దగును.] గొడ్రాలికి అనుంగు బిడ్డ అదృష్టవశమున దొరకి చిత్తమున వాత్సల్య మేపారిన ' స్తన్యంబు తానై పుట్టుటయుఁ గలదు. యంత్రకారుఁడు లోహనాళమున ఆశ్మములు నేయుట అనఁగా ఫిరంగివాఁడు కోటంగూల్ప గుండ్లను వఱపుటం జెప్పుటచే, రాయని కాలమున ఫిరంగులు యుద్ధాయుధములలో నుండెననియు వానిని కోటం గూర్పి నువయో గింతురనియు తెలియుచున్నది. లోకాన తల్లి పోలిక కూఁతునకు చెట్ట, కొడుకునకు గణము అనియు, తండ్రిపోలిక కుత్రునకు గుణము, కొడుకునకు చెట్ట యనియు సాముద్రికమునఁబోని విశ్వాసము అప్పుడును కలిగి యుండినది. దోహదములు గ్రంథ ప్రసిద్ధములే కాని అనుభవప్రసిద్ధములు కానట్లుతోఁచును. దోహదములు యథావిథిగా అరుష్టించి చూచినం గదా? రాయఁడైనను చూచియుండునా? మాళవికలో కాలాన పూటక వెనుజెక్కిన యశోకము మాళవికతన్నుతో నిండార పుష్పించిన దాని కాళిదాను చెప్పినాఁడు. మఱి యవి గ్రంథముల కెట్లెక్కెనో ! ఆ కాలమున దేవశములందలి యర్చలు తాము నోరు విప్పి భక్తులతో మాట లాడుట విశ్వననీయముగానే యుండెను. స్వప్నమున తెలుఁగు వల్లభుఁడు కృష్ణదేవ రాయనితో ఆముక్తమాల్యదం జెప్పు మని నోరువిప్పి ఆదేశించాను. విష్ణుచిత్తునితో వడ పేరుంగోయిలొడయఁడు మధురరాజు నాస్థానికిం బోయి వాదించి గెలుపుమని ఆన తిచ్చెను. మఱియు తన కూఁతు వ్యాధింగూర్చి ఆయనతో మొఱయిద, దాని కలరూపును తద్వారణోపాయమును తాను నోరు విప్పి - అర్చక ముఖముగాఁ గాదు - ఆనతిచ్చెను. శ్రీరంగమున రంగనాథుఁడును విష్ణుచిత్తుఁడు తన కూఁతు రగపడమికి దుఃఖించి తన యెదుర నాగాత్యము చేయఁగా ఆయనతో ఎల నవ్వుచు వావిచ్చి నీయింటం జూచుకొమ్ము, నీకూఁతు రందే ఉన్నది యని పలికెను. ఆమె అట్లే అందు అగపడినది, ఆముక్తమాల్యద రచయిత? 48 ఆ కల్యాణ విభవమంతయు రాయుడు పూర్ణవిశ్వాసముతోను భక్తి పరాకాష్ఠ తోను చెప్పినదే. భక్తి ప్రపత్తులకును దేవుని యనుగ్రహమునకును చదువుతో పనిలేదు. జాతితోను పనిలేదు. విష్ణుచిత్తుఁడు చదువు పుట్టు గడ్డియైన బ్రాహ్మణ వైష్ణవ భక్తి ప్రపన్నుఁడు. దాసరి మాల, భక్తితత్పరుఁడు పాటతో చెక్కుల నానందాశ్రులు ప్రవాహముగా పాఱు వాఁడు. పుట్టు ప్రపన్నుఁడు. వినుక లిసాంగత్యాదులచేత జ్ఞాని, బ్రహ్మరాక్షస్సుకు ఎంతయో ఉపన్యసించి 'చంపకు చదువుల' నని యనిపించుకొన్నవాఁడు. "విష్ణుతో నివ్వల నొక్కవేల్పు గణియించిన పాతకినౌదు" ననుటచేతను "ఏనుఫలం బెఱుంగ; ఫలంబు వరమేళు ముఖోల్లాసంబ; యాజ్జా కేంకర్యంబులకును అనుమతి కైంకర్యంబులకు ఫలపరిమాణగణన ప్రవన్నుల కెక్కడిది? కాన బంధకం బగుట ఫలం బింతంత, యందుఁగొంతఁ గొ మ్మన వెఱతు. భగవంతుండ రక్షించు" ననుటచేతను భాగ వత ప్రవ న్నానుష్ఠాన వరమ రహస్యమును అనుష్ఠానపర్యంత మెఱిఁగినవాఁడు. (దీన రాయఁడును ఈ పరమ రహస్యములను తానును నిజానుష్ఠానపర్యంత మెఱుంగు ననుట సిద్ధము.) బ్రహ్మరాక్షసుని పూర్వజన్మవృత్తాంత వివరణమున లెన్సగా చదివిన బ్రాహ్మణులు, పౌరోహిత్యవృత్తులు, అందందు వైదిక వేషంబుననే ఎంత నీచపు బ్రతుకును, అతి భయంక రానంతర జన్మముం దెచ్చుదానిని, బ్రదుకుచుండిరో ఉదాహరింపఁబడినది. అతఁడు ఆధీతిబోధంబులు ప్రపన్న రహన్యపర్యంతము ఎఱింగి, “విష్ణువుతో నివ్వల నొక్క వేల్పు" ఇత్యాది యొట్టు ప్రపన్నుని నోట ఎంతటిదో ఎఱింగి దాని గణనచేసి చానిని విడిపించినవాఁడు. అతఁడు మరల రాగానే అతని ప్రపన్నత నిజమని చిత్తమున కెక్కి అతని పాట చరణ మైనను తన్నుం గావగల మహిమకాలి యని యెఱింగి, ఇప్పుడు నమ్మకము పొడమి, వాని పాదములం బట్టుకొన్నవాఁడు. ఆ కాలపు దారి దోపిళ్ళ విధమును ఆ దొంగల పన్ను గడలను పాంథులు వారికి బలియగు విధమును వారిని తప్పించుకొను విధములును ఆకాలమున అందందు జరుగునవి రాజై తాను ఎలుంగఁగలిగినవి, రాయఁడు దీన నుదాహరించెఁగావలయు. ఆముక్తమాల్యద రచయిత ? ఆముక్తమాల్యదను కృష్ణదేవరాయఁడు కలలోని దేవుని యాదేశముబడి తా రచించికి నని అందు తన స్వన్నవృత్తాంతమును దాని తన యనుష్ఠానమును చెప్పే 44 ఆముక్తమాల్యద, ఉపోద్ఘాతము యున్నాఁడు. ప్రతి ఆశ్వాసాంతమును 'కృష్ణరాయవనుధాధ్యక్షోత...... ఆశ్వాస మాద్యంబు' 'కృష్ణరాయ మహిభృన్నా మాస్మత్... ఆశ్వాసము ద్వితీయంబు...' 'కృష్ణరాయమహిజా న్యుత్పాడిత.... ఆశ్వాసము నప్తమంబు.... అని విన్పష్టముగా ఏడింటి యవసానమునను చెప్పుకొనియున్నాఁడు. శ్రీహర్షుఁడు తన నైషధమున విలక్షణముగా ప్రతి సర్గకును కడవలు ఇన్నవ సర్గ ముగిసినది అని "దకమ స్తస్య వ్యరంసీ స్మహా కావ్యే చారుణీ నైషధీయచరితే సర్గ నిసర్గిజ్వల" అనియు, n మహా | కావ్యే తద్భువి నైషధీయచరితే నరో గమత్ షోడశః" అనియు, "ద్వావింశో నవసాహసాఙ్క చరితే చమ్పూకృతో ఒయం మహా! కావ్యే తస్య కృతా నలీయ చరితే సర్గా నిసర్గోజ్వలః" అనియు అందలి యరువది రెండు సర్గలయు కడపట అద్భుత ప్రౌఢస్రగ్ధరలు చెప్పినాఁడు. శ్రీ రాయఁడును ఇందు అట్లే అతులితమ త్తేభములం జెప్పి ఆ మహాక వీని అనుకరించినాఁడు. ఇట్లు మఱి యెందుండ నో, ఇఁకను "రచయిత ఎవరు" అను విప్రతిపత్తికి ఎడము ఎక్కడనన్నది ? కవి తన పేరును ఇంత సుఘటితము చేసియుండఁగ ఇఁక నేమి? ఐనను రాయనికాలమువాఁడైన తెనాలి రామకృష్ణకవి ఒక చాటువున “అల్లసాని పెద్దన తెల్పె ముది మది దన్ని యాముక్తమాల్యద" అని చెప్పినట్లు కొంత జన విశ్వాన ముండుటచేతను, ఆప్పకవియు "ఆంధ్రకవితాపితామహుఁడు. 'కొనియె' ననుటకు ‘కొనె’ నని చెప్ప.... విష్ణుచిత్తీయమునందు" అని చెప్పి యుండుటచేతను, అట్లే పూర్వ వ్యాఖ్యాతలు దీనిని పెద్దనకృతం బనుటచేతను, నిజముగా ఆముక్తమాల్యద రచయిత యెవరు అని విప్రతిపత్తి పొడమి దానిని నిర్ణయింపవలన ఏర్పడినది. "కావ్యం యశ నే౬ర్థకృతే వ్యవహారవిడే" అని యిత్యాదిగా కావ్యప్రయోజనములఁ జెప్పుచు కావ్యప్రకాశమున మమ్మటాచార్యుఁడు. 'ఆర్థకృతే-' అన్నందులకు"శ్రీహర్షాదేశ్ ధావకాదీనా మివ ధనమ్," అని వివరించినాఁడు. దీనింబట్టి కొందఱు ధావకుఁడనువాఁడు శ్రీహర్షునివలన ధనముగొని, తన పేరుం జెప్పక, హర్షుని పేరనే ప్రియదర్శికార త్నా వళ్యాది నాటకాదులను రచించినాఁడు, "శ్రీహరో నిపుణః కవిః" అనుట ఉత్తమాట యనిరి. ఆదియైనను ఎంత సత్యమో ఎవ రెరుంగుదురు ? రుజువు ఏది? అద్దే రాయఁడు పెద్దనకు ధన మొనంగి, మడిమాన్యము లిచ్చి, తన పేర ఆముక్తమాల్యదను వ్రాయించు కొనెను..అని, "అర్ధకృతే" అను శాస్త్రమునకు దీని నౌక, యుధాహరణముగా ఆముక్తమాల్యద రచయిత? 46 కొందఱు గ్రహించునట్లున్నది. అంతట రచయిత రాయడ నా పెద్దన. యగునా, అని ఇపుడు వాదములు సేయఁబడుచున్నవి, 1 రాయఁడేమో పుట్టాంధ్రుఁడు క్యాడు తెనుఁగు అతని తల్లిభాష గాదు. కర్ణాటుఁడై నృపులతో' 'బాసాడి', ఆంధ్ర మెఱింగినవాఁడు. అట్టివాఁడు ఇంత ప్రౌఢ కావ్యము వ్రాయఁగలడా ? - అని ఒకటి. మఱి బృహదాంధ్ర నిఘంటు నిర్మాత, సకలాంధ్ర కావ్యములను వ్యాఖ్యానింపించి అచ్చు వేయించినవాఁడు, ఆంధ్రత త్వ వేది, ఆంగ్లుఁడు బ్రౌజాదొర ఎట్టి యాంధ్రమును వ్రాసియుండునో, మాటాడియుండునో, ఉదాహరణము మృగ్యము గాని, అతఁడు ఆ భాషనిగూడ రహస్యములతో ఈ యాముక్త పర్యంతము తా నెఱింగినవాఁడు. పుదూరు ద్రావిడులు, ఆఱవలు శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారు. మఱి వారికన్నను ఆంధ్ర కవియు పండితుఁడును ఉండునా? వారివి ఎన్ని పద్యములో అచ్చము కృష్ణరాయనివే పెద్దనవే అను భ్రమగొల్పునవి తన్నాటకములం గలవు. కావున ఇది నిలుచు వాదము గాడు. రాయఁడు తన గీర్వాణ కృతులుగా ప్రస్తావించిన మదాలస చరిత్రాదులలో కొన్నింటినుండి ప్రపంచదర్పణ మను నొక యప్రకాశిత లిఖిత పుస్తకమునుండి రసమంజరి సత్యావధువులవి అని శ్లోకములు ఒక్కెడ ఉదాహరింపఁబడినవి. మఱి వియు అల్లసాని పెద్దన పేరునే ఉన్నవి. దానిం బట్టి రాయ్యడు చెప్పిన సంస్కృత గ్రంథము లన్నియు ఉత్తవి కావు నిజములే అనియు, లోకాన ఏకారణము నేతనో ఆవియు నిజాశ్రికుఁడగు పెన్షన మహాకవి క్షేత్రలో వ్యవహృతము లనియు ఎట్టో ఖిలమైపోయె ననియు ఉహింపఁదగును. భాషావాగనుశాసను నన్నయయు. ఉభయ కవిమిత్ర తిక్కనయు డిండిమజేత శ్రీనాథుఁడును పెద్దనయు సంస్కృత రచనలును ఏవేని చేసియుండరా ? ఆవి ఉత్త బిరుదులా ? మఱి తెలుఁగునాడు సంస్కృతయుగము దాఁటీపోయినది. కావున వానికి ప్రచారము సంపాదించుట సుఖవుకాక పోటునవి. ఆ రచనయన్నచో రచయితృ ప్రీతికిని తాత్కాలిక పండితగోష్ఠి మెప్పునకును కొంత రాజసమ్మానమునకును పర్యాప్తమై మణి క్రిందికి ఇవలికి దిగ దాయెను. ఆది యుండనీ. L పేరనే సకల రాయవాచకము లందు రాయని మందలి తాత్పర్యముతోనే వ్రాయఁబడినవానియందు, ఈ కృతిం గూర్చిన ప్రస్తావము లేదే అని' యనుచున్నారు, మఱి స్వప్న వృత్తాంత కావ్యరచనా ప్రతిజ్ఞతోను ఆశ్వాసాంత పద్యములతోను ఇట్టిది యొకటి దీవించుచుండఁగా, ఇది యుండుట మన కన్నను ఎంతో సన్నిహితులుగా వా రెఱుంగరా ? వారు ఎబ్బంగినైన, ఇటో ఆటో, దానిని సూచింప 46 ఆముక్త మాల్యద - ఉపోద్ఘాతము కయే ఏల విడుతురు ? తెనాలిరామకృష్ణుఁడు ఒక తట్టునకు మ్రొగ్గియు నుండేడు, కావున అందు లేకపోవుట ఏ కోటికిని బలము గూర్పదు. ఇంక చిరకాలమునకు తరువాత వ్రాయఁబడిన వ్యాఖ్యాతలమాట ఇట్లు నూటిగా లేపఁబడిన విప్రపత్తి కలిగినపుడు నిర్ణ యమునకు సాయపడదు. వ్యాకరణ దోషాదుల కలిమిలేములును ఏకాంతము నిర్ణయ మునకు ఒదవవు. దోషమా అను నిశ్చయమే తొలుత తేలదు. కృష్ణరాయని యా స్థానిని శ్రీనాథుఁడు విరాజిల్లిని యాస్థానులను, వాని యనుషంగ మున 'వేదాద్రి మంత్రి యాస్థానిని, తలఁచుకొని సౌరిడి నన్నింటిందలపోసికొన్న "ఇట్టి కవులకు నేను వాకట్టుకొఱకుఁ జెప్పినాఁడ. పాండురంగ విజయ"మను రామకృష్ణునియా 'వాకట్టు', ధీరత అదెట్టిదో ఆబ్బ ! మఱియు 'కృష్ణరాయఁడే యైన ఉపనిషదాదులను ఎఱిఁగి చెప్పునా, పెద్దనయే యైన చేఁవ వేపుడు మొదలైనవి ఎఱింగి చెప్పునా, ఆను విచారము మందము. ప్రతిభకు అన్నింటి యెఱుకకు చారులుండును. నామిత్ర మొకఁడు నాతో జోడువీడక తిరుగుచుండువాఁడు ఎన్నఁడును అంతగా వ్రాయనివ్వాడు ఒకప్పుడు నాకన్నను. మేలనఁ దగిన వ్రాతలను సొంతముగా, నా కెఱుక లేకయే ప్రకటింపఁగా ఆన్మదుభయపరిచితు లెంతలో అవి యాతని పేరి నా బ్రాఁతలే యగును అతనివిం గావన్న యవిశ్వాసమును మఱియు రాయని నాటి చారిత్రక ఎంతయో, పలుకుచుండి ధనుట నిజానుభవవిదితము. విషయములందు, సందేహముల యెడ, ఇల్లే అట్లు గాదను నిర్ణయమును రూఢిసేయుటకు ఇంకను ఎంత సామగ్రి వలయునో ఎంత విచారము వలయునో. మన దీపు డొక సామరస్యయుగము, అన్ని మతములకు చోటుగలది, సమాధానములు సులువయినది. కావున ఈ విప్రతిపత్తియందు గ్రంథములో పొందినదానిని అటులే అంగీకరించుట శ్రేయము. అదియు శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులవారి సంజీవనియందు అంగీ కృతము, డాక్టర్ సి. ఆర్. రెడ్డి ప్రభృతులచే అనుగృహీతము. మనుచరిత్రయందలి రాయల వంశావళి అట్లే తుచ తప్పక ఆముక్తలోను ఉండుట మాత్రమే కాదు, అది కారణములచే మర్షణీయ మగును, అంతియ కాక మనువునందలి దశావతాతాది: యిత రచద్యములును అట్లే వదపాదాంశ భేదములతో ఆముక్తలో నున్నవి. మఱియు మనువునందలి పెక్కు పద్యముల ప్రౌఢ మనోహరాసాధారణపు టెతు గడలును పోకడలును, అతిశ్లాఘ్యములు. మాలతీమాధవములోనివి ఉత్తర చరితలోను, ఆముక్తమాల్యద -రచయిత ? ఉత్తరచరితవి మహావీర చరితమునను ఉన్న యద్దు, ఉన్నయట్లు, 47 అమ్మ త్త మున నున్నవి. అక్కడనో భవభూతి యొక్కఁడే, ఇక్కడనో ఇరువురు పెద్దనయు రాయఁడును కలసికొని కూర్చినారు మార్చినారు పేర్చినారు, ఏక నక్కిక అని యనిపించినారు.-- అని యెన్నందగును... ఒక యుదాహరణము ఇది మనువులో సాయంకాలపుఁ జక్రవాకి, 1 "క్రుంకె వంకజబంధుఁడు, ఆ సమయంబున- ఏవిహంగముఁ గన్న నెలుఁగించుచును సారె- కును సైకతంబులఁ గూడఁ దారుఁ దారీ కల్గెని యది తన జోడు గాకున్న మెడ యెతి కలయంగ మింట సరయు ; నడసి కన్నీటితో మరలి తామర యెక్కి వదన మెండఁగ సరోవారి నద్దు ; నద్ది త్రోవఁగ సైప కట్టిట్టు గల్గిని ప్రతిబింబ మీక్షించి బ్రమని యుఱుకు; నుఱికి యెఱకలు దడియ, వేరొక్క తమ్మి కరుగు, నరిగి రవంబుతోఁ దిరుగు తేంట్లఁ బొడుచు ముక్కున మఱియును బోవు వెదక సంజ ప్రియుఁ బాసి వగ నొక్క చక్రవాకి.” ఇది యాము క్తమున శరత్ కేకి అర్కమండలి కర్ర మడ్డమైనంతనె, యెఱ మాని మోము బిట్టెత్తి చూచి; ఘుమఘుమధ్వని గాలి గుహ జొరఁ, బురి యొకం చుక యెతి కని తలంచుకొని వంచి ; A-D 48 ఆముక్తమాల్యద -ఉపోద్ఘాతము నిష్పష్పకేతకి నేత్రాంబు వొత్తి, భే క్షపుఁడెం పడియచోఁ గణ మొగ్గి, కేకకు ధృవనశగ్రీవమై తాక యొ క్కిం కార్చి, వాత నేమేమొ కమిచి ; వెడలు బీటెండకును శరద్వృక్ష మీఁగి వార్షికమె యెక్కి, త్రోటి నిర్వంకఁ బక్ష తులను నివురుచు, వెట్టిచూపుల నురంబు కెలకులఁ గనుంగొనుచుఁ గానఁ గేకులుండె. రంగనాయకుల పేట నెల్లూరు 1-12-1966 జ్ఞానవత శ్రీపాద రేణువు నే. రామదాసు
This work was published before January 1, 1931, and is in the public domain worldwide because the author died at least 100 years ago.