ఆబ్రహాము లింకను చరిత్ర/P175

వికీసోర్స్ నుండి

దేశాధ్యక్షత వహించినతరవాత నతఁడు యుద్ధభటులపై ననురాగము సూపుటకుఁ బ్రారంభించెను. అతని దయామయత్వసౌజన్యము లీ విషయమున మిక్కిలి ప్రోద్బల మొసంగెను. అప్పటి యుద్ధమును గుఱించి మాటలాడుచు లింకను, "ఈ ఘోరయుద్ధము దేశమునందలి జనులెల్లరఁ గొప్ప తొందరపాలు చేయుచున్నది. అయిన నిది దుర్భరముగ వేధించుట సైనికులనుమాత్రమె. 'బ్రతికియుండిని శుభములఁ బడయవచ్చు'ననుట సర్వసామాన్యజనసమ్మతముగ నున్నను యుద్ధభటులు దేశోపకారమునకై తమ ప్రాణములనె తృణీకరించి నిలిచి యుసురులఁ దొఱఁగుచుందురు. కావున వారిద యుత్తమధర్మము; వారె సంపూర్ణ గారవమునకుఁ బాత్రుల"ని నుడివి తదనుగణముగ వారియెడఁ బ్రవర్తించుచుండెను. అతడు యుద్ధభటులఁ దన కుమారులఁబోలె గణించుచుఁ బుత్రవాత్సల్యము సూపి "గుఱ్ఱలారా" యని పిలుచుచుండును. వారును 'తండ్రి లింక న'ని యతనిఁ బ్రేమించుచుందురు.

అధికారు లనేకులు యుద్ధభటులవిషయమై లింకను మాటిమాటికిఁ జూడఁగూడదని కట్టు సేయఁ బూనిరి. అయిన నతం డట్టియేర్పాటుల కంగీకరింపఁడయ్యెను. తన కుటుంబమునకుఁ జేరిన బిడ్డలు దమతమ సుఖదు:ఖములఁ జెప్పికొన