అశోకుడు/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము


పాటలీపుత్ర యాత్ర

బ్రాహ్మణుఁడు తన భార్యతోఁ బాటలీపుత్రమునకుఁ బోయెదనని చెప్పినతరువాత నందులకుఁ దగిన ప్రయత్నములను జేయ నారంభించెను.

అది వేసవి కాలము.— వై శాఖ మాసము - సుడిగాళ్లు వీచుదినములు. నౌకాయాత్ర కది నుంచి సమయము కాదు. ఇంతేకాక విదేశమునకుఁ బోవలసి వచ్చినచోఁ బ్రయాణ వ్యయమునకును గృహ వ్యయమునకునుగూడ ధనము కావలయును. ఎట్లో యన్నీయును సమకూర్చుకొనుట కా బ్రాహ్మణున కించుక యాలస్యమయ్యెను. ఆ చంపక నగరము నందలి దయాళుఁడగు నోక వర్తకుఁ డాతనికి దగిన సాహాయ్యము చేసెదనని మాటయిచ్చెను. అశ్విజమాసమునం దావర్తకుని పెద్ద యోడ యొకటి వాణిజ్యవస్తువులు దీసికొని పాటలీపుత్రమునకుఁ బోవలసియుండెను. భాహ్మణుఁడు తన కుమారైందీసికొని యా యోడ పై నెక్కి పోవుటకు స్థిరపరచు కొనియెను.

క్రమముగ వర్షాకాలము వచ్చెను. నదీనదములు జల ప్రపూర్ణము లయ్యెను. చంపావతీనది చిన్నదియే యయ్యు నిప్పుడుభయకూలముల నోఱసి ప్రవహించుచుండెను.

ఇప్పు డా నదీతీరమునకుఁ జిన్నవియుఁ బెద్దవియుఁగూడ వర్తకనౌకలు వచ్చుచుఁ బోవుచుండెను. అశ్విజమాసము వచ్చినది. బ్రాహ్మణుఁడు నిర్దిష్ట దినమున సుభద్రాంగిని వెంటబెట్టుకొని యావర్తకుని యోడపై నెక్కి రాజధానికిఁ బ్రయాణమయ్యెను.


నాలుగవ ప్రకరణము


పాటలీపుత్రము

మహారాజగు బింబిసారుని కాలమున మగధ రాజ్యమునకు రాజగృహము రాజధానిగనుండెను. రాజగృహమునకు నలుదెసలను పర్వతపంక్తులుండుటచే నా నగరము శత్రుదుర్భేద్యమై యుండెను. రాజులు తమ రాజ్యరక్షణ విషయంబున నెప్పుడును నిర్విచారముగ నుండఁజాలరు; ఎల్లప్పుడును దమ రాజ్యమును విస్తరింపఁ జేయవలయుననియే ప్రయత్నించు చుందురు. బింబిసారుని పుత్రపౌత్రులు తామా రాజగృహమునందే యున్నయెడలఁ దమరాజ్యమును విస్తరింపజేయుటకును, దా మున్నతిం బడయుటకును దగినంత యవకాశ ముండదని తలంపసాగిరి. క్రమముగా బింబిసారుని సంతతివారిదృష్టి పాటలీపుత్రము వైపునకుఁ బ్రసరింపసాగెను.