అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం

వికీసోర్స్ నుండి

పరిచయం

అచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ౨8661 28846

ఆధునిక తెలుగు

వెన్నెలకంటి వ్యాకరణం

రచయిత:

వెన్నెలకంటి ప్రకాశం

వెల: రూ. 150/-లు

ప్రతుల కోసం: 5849805675

ఈ-మెయిల్‌: sujatha@nirrvitha.in


వెన్నెలకంటి ప్రకాశంగారు రచించిన “వెన్నెలకంటి వ్యాకరణం” అనే ఆధునిక తెలుగు వ్యాకరణాన్ని 2018 జులై నెలలో నీర్విత ప్రకాశకులు ప్రకటించారు. ఇది 176 పుటలతో 13 అధ్యాయాలతో రచయిత చేతులమీదుగా రాసిన తాలిపలుకూ మలిపలుకులతో ప్రకటించిన ఈ వ్యాకరణం ఇప్పటికి తెలుగులో వచ్చిన వ్యాకరణాల్లా కాక మరో కోణంలో తెలుగు నుడిని పరిశీలించి కూర్చినదిగా కనిపిస్తోంది. ఈ పదమూడు అధ్యాయాలలో ఎనిమిది, అంటే. 3-10. అధ్యాయాలు, శ్రా వాక్యం ఆ వాక్య బంధం-వాక్య సముదాయం, 4 నాదోత్పత్తి; 5. ఉచ్చారణ: వర్ణ వర్గీకరణ; 6. సంధి-అచ్చుల మమత 7. కారక బంధాలు -విభక్తి వాదుకలు & క్రియా పదబంధాలు; 9. నామ్నీకరణాల గురించ్వి. 10. భావ పరిశీలన; వ్యాకరణానికి సంబంధించినవి కాగా మిగిలిన ఐదు, 1. ఖాష-భఖావం-సమాచార వ్యక్తీకరణ, 2. భాష -సమాజం- వ్యాకరణం 11. కావ్య భాష్య 12. లేఖన సమస్యలు 13 భాషా జోధన మొదలైనవి భాషను గురించిన పరిచయమూ, సామాజిక నేపథ్యమూ, దాని అనువర్తనం గురించిన చర్చలతో పూర్తవుతుంది. చివరిగా రచయిత మలిపలుకు ఆపైన ఉపయుక్త రచనావళితో ముగుస్తుంది.

ఒక భాషకు వ్యాకరణాన్ని కూర్చేటప్పుడు ఎవరి భాషకు అనే ప్రశ్న తలెత్తుతుంది. రచయిత తను వాడే భాషక్కా తన ప్రాంతంలోని భాషకా, లేక అధికసంఖ్యాకులు వాడుతున్న భాషకా లేక ఇంకేదైనానా అనే సందేహం రాక మానదు. ముందు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. భాష ఇట్లా ఉందాలి అనే వ్యాకరణ రచనకంటే భాష ఇట్లా ఉంది అంటూ చేసిన వ్యాకరణ రచనే ఉత్తమం. దానివలన భాష ఎట్లా ఉంది, సమాజంలో ఆ భాషాస్ట్థితి ఏమిటో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాకరణ రచయిత, మన ప్రాభీన సాహిత్యం నుండి “అట జనీ కాంచె.....”, “వచ్చినవాడు ఫల్టుణుందు....” “ఎవ్వనిచే జనించు......” అనే మూడు పద్యాలను తీసుకొని ఏది ఎవరికి (సగటు తెలుగువాదికి) ఎంత అర్ధమౌతోందో అంటూ బేరీజు వేసుకొంటారు. మొదటిది సంస్కృత భూయిష్టం కాగా రెండవది అచ్చతెనుగు కట్టడితో ఉన్నదీ, ఇక చివరిది మధ్యస్థంగా ఉన్నదీ. అయితే ఈ మూడింటిలోకీ చివరిదే ఎక్కువమందికి అర్థమయ్యే భాషలో ఉన్నది కనుక అట్లాంటి భాషనే వాడాలి, అదే వ్యావహారిక భాషోద్యమానికి ప్రేరణ అంటూ, ఆ ఉద్యమానికి తోడైన కాన్ని మౌలీకాంశాలను ప్రస్తావించారు.

వాటిలో కొన్ని ఇవి: భాష మారుతుంటుంద్వి మాటకూ రాతకూ సామరస్యం ఉందాలి; వ్యాకరణం ప్రయోగమూలం; వాడుక భాష కానిదాన్నీ పుస్తకాలలో వాడటం ప్రయోజనకారి కాదు దురభిమానం కూడదు. ఈ పైన రచయిత పిల్లల పాఠ్య పుస్తకాలలో కొంత వరకూ మాండలికతను ప్రవేశపెట్టితే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు కూదా. గిరిగిసుకొనీ మనం వాదే తెలుగు ఇట్లాగే ఉందాలి అనే దురభిమానం తగదని రచయిత స్పష్టం చేస్తున్నారు.

మొదటి అధ్యాయంలో, భాషలో భావానికీ దాని వ్యక్తీకరణకూ సంబంధాన్ని పప్రతిపాదించటానీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలోనీ సారాంశం ఇదిగో చదవండి. భాషకు మూలమూ ఫలమూ రెండూ భావమే. ఇంకా, మూలం, ఫలం ఈ రెంటి మధ్యా ఎలాంటి తేదా లేనప్పుడే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అర్ధవంతం. తేదా ఉంటే. అపార్ణం. అంటే అర్భవంతమ్హాన మాటలు మాట్లాదేందుకూ, రచనలు రాసేందుకూ వ్యాకరణ వాడుక చక్కగా ఉందాలి అంటారు. అలాగే భావ వ్యక్తీకరణ -ప్రక్రియ వక్తకూ (శోతకూ మధ్య జరిగే అనేకానేక ప్రక్రియలద్వారా సాధ్యమౌతోందనీ కొంత విపులంగానే చర్చిస్తారు.

ఇక రెండవ అధ్యాయంలో, వ్యాకరణాన్ని నీర్వదించే ప్రయత్నం చేశారు. వ్యాకరణం, *....పదాల, పదబంధాల, వాక్యాల, వాక్య బంధాల, వాక్య సముదాయాలలో కనిపించే నియమావళి ..... ష్ణ అలాగే, భాష వాడుకలో “సామాజిక జెచిత్యాన్ని” సూభించే నీయమాలనుకూడా వ్యాకరణంలో భాగమంటారు. ఉదాహరణకు అది, ఆమె, ఆవిద, వారు లాంటి సర్వనామాల వాదుకలోని నియమాలు సామాజిక జెచిత్యానికి సంబంధించినవి. ఇవి వమౌలిక(0గా) రూప వ్యాకరణంలో ఖాగం కానీవి అంటారు. ఈ అధ్యాయం చివరలో, _ తెలుగు భాష స్వరూప స్వభావాలగురించిన కొన్నీ లక్షణాలను పేర్కొంటారు: ఉదాహరణకు, క్రియ లేని వాక్యాలూ, పదాలలో 'ఊనిక* (ప్రాముఖ్యత, క్రియాన్వయం ఉన్నవోట కర్తను వాదకుంచటం మొదలైనవి. తర్వాత ఈ చర్చ, తెలుగులో ఖాషావైవిధ్యం అంటూ మాండలికత్క తీరు, శైలి, రీతి అనే తేడాలతో మొత్తం నాలుగు రకాలనీ చెబుతూ సోదాహరణంగా వివరిస్తారు.

మూడవ అధ్యాయంలో వాక్యం ఆ వాత్య బంధం - వాక్య సముదాయం గురించి చర్చించారు. వాక్యాన్ని నీర్వచిస్తూ వాక్యం పలుకు రూపంలో దిగుడు స్వరంతో కూడి ఉంటుంది. రచనలో అయితే చుక్కతోకూడి ఉంటుంది. వాక్యానీకి ముగింపు ఉండాలి అంటారు. ఇక్కడ భావం గురించి చెప్పకపోయినా ముందు చెప్పినట్లు ఖావ సమగ్రత కూదా చెప్పారనుకోవాలి. వాక్య సముదాయాల నిర్మాణంలో సంయోజకత్వాన్ని సూచించే పదాలు ఉంటాయి. నాల్గవ అధ్యాయంలో నాదోత్పత్తిని గురించీ ఆ తరువాత వచ్చే ఐదూ ఆరూ అధ్యాయాలలో వర్దాల వర్గీకరణ, సంధి అచ్చుల సమీకరణాలకు అవసరమైన వివరణ ఉంది.

ఐదో అధ్యాయంలో తెలుగు ధ్వనుల ఉత్పత్తినీ, స్థాన, కరణ, ఉచ్చారణా విధానంగురించీ విపులంగా చర్చించారు. ప్రకాశంగారు ఇంతకుముందు ఇతరులు గమనీంచనీ ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. అదేమిటంటే, తెలుగులో నందులు సాధారణంగా స్థానాశిత వర్గీకరణపై ఆధారపడి జరుగుతాయని ఇప్పటివరకూ నమ్ముతున్నాం. ఆయిత్తే త్‌-ల్‌ మధ్య త్‌-న్‌ మధ్య సంధి జరగక పోవడం, భిన్న వర్ణాలకు చెందిన టొ-ల్హ్‌ ద్‌-ల్మ్‌ ట్‌-న్‌, ద్‌-న్‌ మధ్య జరగడం, అలాగే టొ-చ్‌, ట్‌-జ్‌, డ్‌-చ్‌, ర్‌-జ్‌ల మధ్య జరగడం, ఇంకా స్‌-త్‌ ల మధ్య సంధి జరగడాన్ని నిశితంగా పరిశీలించి వర్ణాల వర్గీకరణ స్థానాలపై ఆధారపడినాగానీ దానీకీ వర్షప్రవర్తనకూ ఎలాంటి సంబంధం లేదంటారు. అందుకనీ ప్రకాశంగారు కరణాటశిత వర్గీకరణపై ఆధారపడి సంధి సూత్రాలను ప్రతిపాదిస్తారు. ఉదాహరణకు, ప, బ, మ, (వు ఓపష్టాలుగానూ, తదృస, చ, జ (య) లను జిహ్వోపాగ్రాలుగానూ, ట, డృ న ణ, ల, ళర లను జిహ్వాగ్రాలుగానూ, క, గ లను జహ్వమూలీయాలుగానూ వర్గీకరించి సంధి కార్యాలను సూత్రీకరించటం తేలిక అని సోదాహరణంగా నీరూపిస్తారు. వారు ఇచ్చిన వివరణ ఇప్పటికి ఇదే మొదటిసారి. వారు చెప్పిన సూత్రం: “జివ్వోగ్రాలు సంధికి పూర్వంలో ఉన్నప్పుడు వరంలో ఉన్న జిహ్వోపా[గాలతో కరణం విషయంలో సమీకృతమౌతాయి”. ఉదా. చూ.: పాల్‌[+జిహ్వాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ్ర) ఓ= పాల్ష్‌[+జిహ్వోపాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ]) ఓ= ప్లాల్లో

అలాంటిదే, జిహ్వాగ్రాలు పరంలో ఉన్న పరివేష్టిత జిహ్వాగ్రాల కారణంగా పరివేష్టితాలు అవుతాయి. ఉదా. పాలు+వబ్బా = పాళ్దబ్బా.

పై సూత్రం ప్రవర్తిల్లి పరంలో ఉన్న స్పర్శేతర హల్లు ముందుగా పరివేష్టితంగా మారుతుంది. ఆ పైన పూర్వ స్పర్భం వర హల్లు నుండి అనునాసికతనూ పార్చికతనూ పొందుతుంది.

అంటే బడి+ని ౫ బద్‌+జి -* బత్‌+ణీ అవుతుంది.

తెలుగు సంధి నియమాలకు వర్ణాల స్థానాశ్రిత వర్గీకరణ కంటే తరణా్యశిత వర్గీకరణ వబఖ్యవబా ఉవయోగకతరమూ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించి సోదాహరణంగా నీరూపిస్తారు.

అలాంటిదే ఏరు, నూరు, మోకాలు లాంటివి ఏటి, నూటి, మోళాటి కావడం కరణా(శిత వర్షం కావడమే నంటారు. అలాంటివే నూయి-టనూతి, చేయి-టచేతి కావడంకూదా అంటారు. కారణం, య, తలు జిహ్వోపాగ్రానికి చెందటం అంటారు. కానీ ఈ వివరణ ఇట్లా సంధి జరిగినవాటి గురించి చెబుతుంది సరేగానీ సంధి జరగనీవాటిగురించి ఏం చెబుతుంది. నేటి తెలుగులో పదాంతాలలో ను, లు, రు, యి ఉండి సంధిలో ఎలాంటి మార్పు పొందనివే కోకొల్లలు. అంటే చారిత్రికంగా ధ్వనులలో వచ్చిన మార్పులవలనే నేడు సంధి కార్వాలలో విరళంగా కనబడుతున్నవీ సామాన్య సూత్రాలకు లొంగనివీను.

అచ్చులమధ్య జరిగే మార్పులను స్వరమైత్రి అనీ, స్వర సమీకరణం అనీ అనడం ఆనవాయితీ. ఈ రచయిత వీటిని అచ్చుల మమత అంటున్నారు (ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న పారిభాషిక పదాలను వాడక కొత్తపదాల వాడుక ఎందుకో). రెండూ అంతకంటే ఎక్కువ వర్ణాలమధ్య జరిగే సంధి కార్యాలలో “త్రోడ్రి వర్ణాలను తాకే ధ్వన్యంశాలను” అలా కానివాటినుంచి వేరుచేసి వర్గీకరిస్తారు. వాటినే చరాంశాలూ న్టిరాంశాలుగా పేర్కొంటారు. అంటే ఒక వర్డానికి సంబంధించిన థధ్వన్యంశాలు మరో వర్షానికి గనక పాకితే వాటిని చరాంశాలు గానూ అట్లా పాకలేనీ ధ్వన్యంశాలను స్థిరాంశాలుగానూ చూడాలి అంటారు. ఇప్పటివరకూ తెలుగులో జరుగుతున్న స్వరసమీకరణంపై చే. రామారావుగారూ, క.వెం. సుబ్బారావు గారూ, నే నాగమ్మారెడ్డి, జె.వి. శాస్రిగారూ, గా. ఉమామహేశ్వరరావు వెొుదలైనవారు ఎందరో వివృలంగా చర్చించినా చరాంశాల ప్రతిపాదన ఇదే ప్రథమం.

కారక బంధాలు -విభక్తి వాడుకలు అనే ఏదవ అధ్యాయంలో ఇప్పటివరకూ ఎవరూ వాడని పారిభాషిక పదజాలం వాడుతూ తెలుగులో ఐదు రకాల వాక్యాలు ఉన్నాయన్నారు. వాటికి వరుసగా, గుర్తింపు వాళ్యాలు (అతను కోపిష్టి, వెందుడు వాక్యాలు (నాకు రెండు కార్లు ఉన్నై, మనోప్రవృత్తి వాక్యాలు (అతనికి ఇద్టీలంటే ఇష్టం), అస్తిత్వ వాళ్వాలు (డాక్టరుగారు ఉన్నారా?) కార్య వాళ్వాలు (అతను పరిగెత్తాడు, తలుపు తెరుచుకుంది) అని పేర్లు పెట్టారు. ఇవి పూర్తిగా వక్త అనుభవపూర్వకమైన వ్యక్తీకరణపై ఆధారపడి చేసిన విభజన. భద్రిరాజు కృష్ణమూర్తి, చేతళూరి రామారావు, మొదలైన వ్యాకర్తలు నీర్మితిని ప్రధానంగా తీసుకొని వాక్య విభజన చేశారని చెప్పాలి. అట్లాగే, రచయిత తెలుగు వాక్యాలలో ఉక్తం, ఆఖ్యాతాల తేదాను గుర్తించడం ముఖ్యమైనదని చెబుతూ, వివిధ వాళ్యాల్లోని తేడాలను ఉద్దేశ్య విధేయాల సంయోజనంగానే గుర్తిస్తారు. అయితే ఇదంతా వాక్వాలలో వివిధ రకాలను గుర్తించడం వరకే. అసలు, వాక్యాల అర్జ్భావగాహన వాక్యాలలో వాడిన నామబంధాల విభక్తి రూపాలవలన ఏర్పడుతుందని చెబుతూ ఎనఖైదాకా ఉన్న విభక్తి ప్రత్యయాలనూ ఉపపదాలనూ మొత్తం 37 రకాల అర్థ్ధపరకమైన నామసంబంధాలు గానూ మళ్లీ వాటిని 14 రకాల కారక సంబంధాలుగానూ విశ్లేషిస్తారు.

ప్రాణంతీయు లేక చంపు అనే క్రియలు సమానార్థకాలు అని మన సాధారణ నమ్మకం. అయితే అవి కావనీ వాటి వాడుక రుజువుపరుస్తోంది అని ఉదాహరణలతో చూపిస్తారు.

(18) ఆ విషం అతనీ ప్రాణం తీసింది.

(20) ఆ విషం అతనీనీ చంపింది.

20 వ వాక్యం బాగుండకపోవటానీకి కారణం చంపు అనే సకర్మక (క్రియా వ్యాపారానీకి కర్తృత్వం వహించలేకపోవటంగా కనబడుతోంది. మరి అదే విషం 18 వ వాక్యంలో ఎలా సాధ్యమైంది. ప్రాణం తీయడం, చంపడం రెండూ స్తూలంగా ఒకే అర్ధాన్ని స్ఫురిస్తున్నా వాటి అర్జకాలమధ్య తేడా కనబడుతోంది. ప్రాణంతీయడానికి కర్తృ పదాలు (ప్రాణులు కాకపోవచ్చుగానీ చంపడానికి కర్తృ పదాలు 'ప్రాణులైవుందాలనీ నీయమం తెలుగులో ఉందనిపిస్తోంది. క్రియా పదబంధాల గురించి 8 వ అధ్యాయం లో చర్చించారు. దీన్లో, కార్యన్సితీ (250609 కాలనూచనా (18%96) దెందూ 'ప్రత్యయాలతోనే తెలుస్తాయని చెబుతూ, “తెలుగులో ఉండు అనే క్రియ మాత్రమే కాలాన్ని సూచిస్తుంది” అనీ, ... “మిగతావన్నీ కార్య స్థితిని సూచిస్తాయి” అంటారు. ఇట్లా వీరిదే మొదటి ప్రయత్నం అనుకుంటాను. 97 వ పుటలో ఇచ్చిన పటానికి వివరణ ఇంకా ఉంటే బావుండేది.

ఇక 9వ అధ్యాయంలో నామ్బీకరణాలగురించి చేసిన చర్చ చేకూరి రామారావు (బేరా) గారి వ్రతిపాదనలపై నమీక్షా వ్యాసంలాంటిది. చేరాగారి ప్రతిపాదనలలో ఉన్న కొన్ని సమస్యలను పట్టుకొని చర్చించటం జరిగింది. భావ పరిశీలన అనే పేరుతో 10 వ అధ్యాయంకింద తెలుగు వాక్యాల అర్థ స్ఫోటన ఎలా జరుగుతుందో వివరించబూనటం ఒక విధంగా ఈ వ్యాకరణంలో ఉన్న కొత్తవనమే. పదం, వ్యాకరణం, స్వరం ఇంకా సందర్భం అనే నాల్షింటిని తీసుకొని అర్థ స్ఫూర్తిని వివరిస్తారు.

11 వ అధ్యాయంలో కావ్యాలలో వాడే భాషను గురించి చర్చిస్తారు. ఒకరకంగా ఇది వ్యాకరణంలో భాగం కాకపోయినా ముందు చర్చించిన వ్యాకరణ ప్రతిపాదనలకు ఇక్కడ ప్రయోగాత్మక పరిశీలన జరిగినట్లుగా చెప్పుకోవాలి. ప్రాభీన రస సిద్ధాంత కర్తబైన ఖామకుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, వామనుడు, ఆనందవర్దనుడు వెొుదలైనవారి సిద్దాంతాలన్నీ చదివేవారికీ వినేవారికీ కలిగే 'పత్యేకానుభూతికి మూలం వ్యంజన, ధ్వని, రీతి, వక్రోక్తి మొదలైనవే అనీ అంటారు. అంటే సాధారణ వ్యాకరణానికి అనుగుణంగా ఉందనీ రచనా సాంప్రదాయం అనుకోవాలి. అయితే ఇవేమీ వ్యాకరణ విరుద్దాలు కావుగానీ అసాధారణ వ్యాకరణ ప్రయోగాలుగా చూడాలి. చేరాగారు అప్పుడప్పుడు అంటుందేవారు అందరూ చెప్పినట్లు చెబితే కవి ఎందుకవుతాడు అని. ఇందులో అసలు విషయం ఏమిటంటే వ్యాకరణం నడ్డి వంచుతాదే తప్ప వ్యాకరణ భంగం కానివ్వరు. ఇట్లాంటి వంగిన వ్యాకరణం కావ్వానీకి రసపోషణకు తోద్బ్చడుతుంది. దీనినే వ్యాకరణ సమత (సమ్మతి) అంటూ దానితోపాటు వర్ణ సమత, పదసమత, స్వరసమత మొదలైనవన్నీ కలిసే సంపూర్ణ సమత చేకూరి వాత్యభావానీకి దారితీస్తుందంటారు.

లేఖన సమస్యలనే మరో అధ్యాయంలో తెలుగు లేఖనంలో సమస్యలుగా గుర్తించిన కొన్ని వ్యాకరణ అంశాలను గురించి చర్చిస్తారు. వీటిలో కొన్ని అర్థసందిగ్ధతకు అస్పష్టతకూ దారితీసినా మిగిలినవన్నీ కలన శైలిలో భాగమే. ఆధునిక యుగంలో ఎంతో కాంత సొంత మాండలికం రాతలో మాటలో కనబడకపోదు. వాటిని తగ్గించుకోవాలసిన అవనరం నందర్భాన్నిబట్టి ఉండొచ్చు. ఈ అధ్యాయంలో చివరిగా గతి తప్పిన విరామ చిహ్నాల వాడుకను ఉదాహరణలతో ప్రదర్శిస్తారు. ఈ వ్యాకరణంలో చివరి అధ్యాయంలో తెలుగు భాషా బోధన గురించిన చర్చలో భాషాబోధనలో నేర్చుకొనే వ్యక్తికి అవసరమైన భాషాంశం గురించీ, క్షేత పరిథి గురించీ వాటిలో ఉందే ప్రత్యేకతలూ వాటివలన వచ్చే సమస్యలను అధిగమించడం గురించి స్థూలంగా చర్చిస్తారు. చివరికి కాసరుగా విశిష్టభాషగా తెలుగు కావడానికి తెలుగుకు ఉన్న విశిష్టతలను కొన్నీంటినీ చర్చిస్తారు.

వెన్నెలకంటి వ్యాకరణంపేరుతో ఆధునీక తెలుగు వ్యాకరణ వర్ణనలో చాలా వరకూ కౌత్త వరవడిలో రాసినవే. వ్యాకరణంలో ఏమాత్రం ఇష్టం ఉన్నవారైనా దీన్ని తప్పక చదివే ప్రయత్నం చేయాలి. ఖాషాశాస్త్రంలో ప్రవేశం ఉన్నవారికి ఈ శైలి సహజంగా అనిపించినా సాంప్రదాయక వ్యాకరణంతో పరిచయం ఉన్నవారికి ఎంతోకొంత కొత్తగానే ఉంటుంది. ఆధునిక భాషాశాస్త్ర వరవడిలో సమ(గ్ర తెలుగువ్వాకరణం ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే ఇలాంటివి భవిష్యత్తులో సమగ్ర తెలుగు వ్యాకరణ రచనకు ఆధారాలు అవుతాయి. రచయిత యార్ము విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పిహెచ్‌.దీ. పొంది వివిధ విశ్వవిద్యాలయాలలోనూ _ ప్రత్యేకంగా ఇంగ్లీషూ తదితర విదేశీభాషల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా భాషాశాస్త్ర జోధకుడిగానూ గడిచిన ఐదు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలలో గడించిన అనుభవంతో కూర్చినది కావడం ఈ వ్యాకరణం ప్రత్యేకత.

కవిత

తెలుగు నుడి

గుండెల్లో ఒదిగిపోయే కమ్మదనం

తెలివిని పెంచుటే తెలుగుకున్న గొప్పగుణం

అమ్మపాలలా ఫౌష్టికం జుంటికేనెలోని తీపిదనం

లే ఎంటదల్లోని చురుకుదనం పున్నమి వెన్నెలలోని చల్లదనం ... తపనపెంచే లోచనం తాజా పూల పరిమళం ....

మనశ్వాసలొ నీలిపి మానవతై

మెరిసేది మన తెలుగు...!

దశదిశలా మల్లెల పరిమళమై. ఎదలో చిలిపితనాన్ని కురిపించేది జాను తెలుగు!

నన్నయకవి ప్రసన్నత పాల్కురికి ప్రావీణ్యత... శివకవుల జానుతెనుగు శివమెత్తిన దేశీయత... తిక్కన రసనైపుణ్యం ఎర్రన నాచన వర్ణన వు శ్రీనాథునిపాండిత్వం పోతనకవి సహజత్వం.. తేటతేట హృదయాలకు వెలుగునింపు దివ్యగుణమే తెలుగు

శతక కవుల చమత్కృతులు పదకీర్తన జావళీలు

కృష్ణరాయ స్వరయుగం కావ్వరసం కమనీయం

అచ్చతెనుగు జిగిబగీలు అతులిత మాధురీ మహిమలు... ముద్దుపలుకు గుంఫనాలు శ్లేష ద్వ్యర్థి చేమ కృతులు... వలపుల వయ్యారి కులుకు నవరస నాట్యపు నదకల నవ్వతెలుగు

ముత్వాలసరులతోగురజాడ

అమలిన శృంగార శోభగా రాయప్రోలు

కందుకూరి సంస్కారం గిడుగుమూర్తి వ్యవహారం... కృష్ణశాస్త్రి విశ్వనాథ శీశీల భావుకతా...

జాషువా దాశరథీ సినారె కాళోజిల మానవతా

సూరి బ్రౌను ప్రతాపరెడ్డి వట్టికోట ఆధునికత దివ్యతెలుగు

వచనకవిత నవల కథల కాల్చనీకత వాస్తవికత....

అతస విరస దిగంబర నయాగరా చేతనత్వ... హేతువాదమనుఖూతి స్రీవాదపు దళిత గీతి..

మణిపూసలు నానీలు పలుకుబళ్ళు హైకూలు...

నీఖార్భైన జానపదం నిత్వనూత్న సుకుమారమే తేటతెలుగు!! ఎదసవ్వడి గుసగుస గుణగణాల మాధుర్యం మాతృభాష.

డా.పాండాల మహేశ్వర్‌

9912180054


జిల్లాస్థాయి వరకు కోర్టుల్లో తీర్పులు తెలుగులో తేవాలి (జి.ఒ.నెం. 485/29.38 1974)