అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్
పుస్తక పరిచయం
పరమపూజనీయ డా. హెడగేవార్
జీవితము-సందేశము
- అనువాదం, వ్యాఖ్యానం
- వెల: రు. 90/-
- ప్రచురణ:
- నవయుగ భారతి ప్రచురణలు
- ప్రతులకు: సాహిత్వనికేతన్,
- హైదరాబాదు: 040 27563236
- విజయవాడ: 94406 43348
ధర్మాన్ని సమాజాన్ని మన సంస్కృతిని రక్షించుకొనటానికి, హిందువులను సక్షమమైన సంఘటనగా తీర్చిదిద్దటమే ఆశయంగా “రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్” ను స్థాపించిన దా॥కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (దాక్టజీ అని, “పరమ పూజనీయ'” అని సంఘ పరివారం) (1889 - 1940) జీవితం-సందేశాలను పేర్చికూర్చిన వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనాన్ని నాలుగు ప్రధాన అధ్యాయాలుగ విభజించారు. 1925వసం॥ విజయదశమి నాడు స్థాపించబడి, ఈనాడు భారతదేశమంతటా నిస్వార్థ సమాజసేవకు సర్వదా సంసిద్ధంగా (RSS) కార్యక్రమాలు సాగిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక
సంఘం గురించి మాత్రమే తెలిసినవాళ్లకు ఆ సంస్థను స్థాపించి హిందూదేశపు అభ్యుదయానికి కల్చవృక్షంగా ఫలాలను అందించిన “డాక్టర్ జీ " జీవిత సంగ్రహం వారు వివిధ సందర్భాలలో సంఘ కార్యకర్తల నుద్దేశించి చేసిన ప్రసంగాల పాఠం వారి సమాధి ఉన్న నాగపూరులోని రేశమ్ బాగ్ సంఘస్థాన్లో “స్మృతి మందిరం” నిర్మాణం - రూపకల్పన - ప్రారంభోత్సవ విశేషాలు ప్రత్యేక అనుబంధంగా సంఘస్థావనకు ముందు “రాజద్రొహం” నేరం ఆరోపింపబడి స్వాతంత్య్ర సాధనకు జైలుయాత్ర చేసిన ఘట్టం మొ౹౹ ముఖ్యమైన ఆసక్తి కరమైన విషయాలతో 'డాక్టర్టీ గురించి తెలుసుకునే
అవకాశం పాఠకులకు కలుగుతుంది.
నాగపూరులో ఒక నిరుపేద సనాతన కుటుంబంలో బలీరామ్ పంత్, రేవతి దంపతులకు తేదీ ౦1-04-1889న జన్మించిన దాక్టర్జీ, 12సం॥ల వయస్సులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించగా పెద్దన్న మవోదేవశాస్తి పెంవకంలో బాల్యం, విద్యాభ్యానం గడిచింది. విద్యార్ధి జీవితంలోనే ఆయన చేసిన ప్రతిపనిలోనూ దేశభక్తి, స్వాతంత్రేచ్చ ప్రస్ఫుటంగా కనిపించేవి. “వందేమాతరం " సమస్యపై, దేశాఖిమానాన్ని విద్యార్థులలో మేల్మొలుపుతున్నందుకుగాను రెండు పాఠశాలల నుండి వెడలగొట్టబడి, చివరకు పూనావెళ్లి జాతీయ పాఠశాలలో చదివి మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులవుతారు. తరువాత కొంతకాలంపాటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసి ఇంట్లో చదువుచెప్పి (ట్యూషన్లు) కొంత ధనం పోగుచేసుకాని, 1910లో కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజిలోచేరి, ప్రధమశ్రేణిలో ఎల్ ఎమ్. & ఎస్. పరీక్ష పాసయి డాక్టరు పట్టాను పొందారు. కలకత్తాలో ఉన్న ఆరు సం॥ల కాలంలో స్వదేశీ ఉద్యమంలో పాల్గొని దేశభక్తికి ఒరవడి దిద్దుకున్నారు. అప్పుడే 'గరమ్ దళ్ '(అతివాద) రాజకీయ పక్షంలో చేరారు. బెంగాలీ ప్రజలు ఆరంభించిన ప్రతి ఉద్యమంలోను కార్యక్రమంలోను అత్యంతోత్సాహంగా పాల్టొంటూ ఉండేవారు. రాష్ట్రొద్దరణ, సమాజ సేవలే ప్రధానంగా భావించి ధ్యేయవాద జీవితం గడపాలనే సంకల్పంతో డాక్టరు వృత్తి చేపట్టకుండా వివాహం చేసుకొనకుండా, అంతకంటే పరమ శ్రేస్టమైన కర్తవ్యం తాను చేపట్టాలని సంసారబంధం, తాపత్రయాలకు దూరంగా ఆదర్శాలను వదలుకోవటం యిష్టపడని 'డాక్టరుజీ ' ఆజన్మ బ్రహ్మచారిగా జీవితాన్ని నిర్దేశించుకున్నారు.
1915వ సం॥ నుండీ 1924 వ సం॥ వరకు దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమాలలో పాల్గొనటం మాతృదేశ దాస్యవిముక్తికి, సంపూర్ణ దేశస్వాతంత్య్రం కోసం అలమటించి, ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని చూసి సంక్షోఖించిపోయిన డాక్టర్జీ 1920లో నాగవూరులో జరిగిన కాంగైన్ సమావేశానంతరం, పాల్గొన్న ప్రతి సభలోను మహోద్రేకంతో ఉపన్యాసాలు యిచ్చేవారు. 1920 అక్టోబరులో కాటోల్లోను, భరత్ వాడలోను జరిగిన సభలలో డాక్టర్జీ యిచ్చిన ఉపన్యాసాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగ రెచ్చగొట్టేలా ఉన్నాయని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాపింపచేసి తిరుగుబాటుకు పిలుపునిచ్చారని మే1921లో వారిపై రాజద్రోహంగా అభియోగాలు చేసి కేసు దాఖలు చేయబడింది.
న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు కాకపోయినా, డాక్టర్జీ కేసు విచారణ పగ్గాలను తన చేతిలోనికి తీసుకుని తానే స్వయంగా సాక్షిని ప్రశ్నించటానికి అనుమతి సొందారు. చివరకు, ఒక భారతీయునిపై జరిగే కేసులో విచారణకు వచ్చే అంశాలను విని నిర్ణయాలను ప్రకటించడంలో బ్రిటీషు న్యాయమూర్తి పనికిరాడని ఫిర్యాదు కూడా చేసి ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా సంచలనం సృష్టించారు. అయితే బ్రీటీషు ప్రభుత్వం ఈ అర్జీని పక్కకు పెట్టగా, కేసు విచారణ యధాప్రకారం అదేజడ్టితో (న్మెలీ ) విచారణ కొనసాగింది. న్యాయస్థానం ఆగస్టు 21, 1921నాడు తన నిర్ణయాన్ని వినివిస్తూ డాక్టర్జీ ఉపన్యాసాలు నిస్సందేహంగా రాజద్రోహంగా ఉన్నాయని, అందుచే ఒక సం॥వరకు ఈ తరహ ఉపన్వాసాలు చెప్పనని హమీ పత్రాన్ని యిస్తూ, జమానతుగా వెయ్యేసి రూపాయలకు ఇరువురినుండి-హామీ పత్రాలను, మరో వెయ్యి రూపాయలకు వ్యక్తిగత హామీపత్రాన్ని వ్రాసి ఇవ్వాలని ఆదేశించింది. జమానతు, హామీ పత్రాలు ఇవ్వడం తనకు అంగీకారం కాదు అని డాక్టర్జీ ఖరాఖండిగా చెప్పడంతో, న్యాయమూర్తి వారికి ఒక ఏడాదిపాటు కఠిన కారాగారవాన శిక్ష విధించారు. వలస పాలనకాలంలో సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంతపరంగా విరోధింఛిన చరిత్రకు ఇది ఒక దృష్టాంతం. డాక్టర్జీ త్వాగం, న్యాయ స్థానంలో చేసిప దేశభక్తిపూరిత వాజ్బలమూ, యువ జాతీయ వాదులకు ఎంతో శక్తిని ఉత్సాహాన్ని, ప్రేరణను యిచ్చి ఎంతో జనాదరణకు పాత్రుడయ్యారు.
స్వరాజ్యము, జాతీయత, హిందూత్వము, నిజమైన స్వాతంత్య్రమూ అంటే ఏమిటో ప్రచారం చేయడానికి నాగపూరులోనే 'స్వాతంత్య్ర ', అనే దినపత్రికను ప్రారంభించి కొన్నాళ్ళు పత్రిక ద్వారా ప్రచారం సాగించారు. అయితే, ప్రభుత్వం ఈ పత్రికపై ఆంక్షలు విధించి, ఆటంకాలు కలిగించడంతో పత్రికా ప్రచురణ ఆగిపోయింది.
భారత జాతీయ కాంగ్రెసు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్కి, జాతి నిర్మాణంలో కాం[గైసు అనుసరించిన విధానాలు, రాజకీయాలు నిరాశను కలిగించాయి. 1923లో హిందూ, ముస్లింల మధ్యచోటు చేసుకున్న విద్వేషాలు, అల్లర్లు ఆయనను ఎంతో కలచివేసాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్, వినాయక దామోదర సావర్కారు, బాబూరావు సావర్కారు మరియు ప్రధానంగా బీ.ఎస్.మూంజే మొ॥ వారి ప్రభావం వారిపై పడింది. వీరసావర్కారు ప్రతిపాదించిన “హిందూత్వ” సిద్ధాంతం ప్రభావం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం చూపింది. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు, సంస్థల కార్యక్రమాలు, రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు అన్నిటినీ అధ్యయనం చేసారు. మాతృభూమియైన భారతవర్షం వైశాల్యంలో, జనసంఖ్యలో, సృష్టి సౌందర్యంలో, ఖనిజసంపత్తిలో, పాడిపంటలలో, యివిగాక వేదాంతం, ధర్మం, సంస్కృతి, చరిత్ర, విద్య, పరాక్రమం, కళాకౌశల్యాదుల్లో ఎంతో ముందుండిన హిందూ రాష్ట్రం ఎందుకు ఈ విధంగా వెనుకబడింది అనే ఆలోచన ఆయనను వేధించసాగింది. ఆవేదన నుంచి ఒక నూతన మార్గాన్ని అన్వేషించాలనే సంకల్చం ఆయనలో చోటు చేసుకుంది. భారత జాతీయత, హిందూ సంస్కృతి మరియు వారసత్వం మూలాధారాలుగ ఉండవలసినదేననీ గాఢంగా నమ్మారు. హిందూత్వమే యధార్ధ భారత జాతీయత” అనే సిద్దాంతం డాక్టర్జీ ఆలోచనలలో దృడంగా పాతుకుపోయింది. “హిందూ రాష్ట్రాన్ని సముద్దరించాలని, ఆ ధ్యేయం నెరవేరటానికి నివురుగప్పిన నిప్పులా చేయటానికి " రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” ను ఒకరాష్ట్రీయ సంఘటనోద్యమంగా ప్రారంభించారు.
మహాపురుషులకు క్రియాసిద్ధి 'సత్త్వ' మనే మహత్తరగుణంతో లభిస్తుంది; ఉపకరణాలవలన కాదు- అని పండితులు చెప్పిన లోకోక్తి డాక్టర్ జి విషయంలో ప్రత్యక్ష ఉదాహరణ. నాగపూరులో బీజమెత్తిన సంఘ వృక్షం, కాలక్రమేణ అన్ని జిల్లాలకు, నెమ్మదిగా దేశం నలుమూలలకు శాఖోపశాఖలుగ విస్తరిల్లింది. సంథు సభ్యులు అందరూ క్రమం తప్పక ప్రతినిత్యమూ నిర్ణీత సమయానికి సంఘ స్థానానికి వచ్చి, సరియైనవేళకు (భగవ) దధ్యజారోహణ (కాషాయ జెండా) చేసి మాతృభూమి ప్రార్ధన చేయాలనే కఠిన నియమం పాటించే సంన్కృతిని పాటించటం సంఘం ప్రత్యేకత. సంఘం ఒక వ్యాయామశాలయని కొందరు, స్వచ్చంద సేవక దళం అని సేవాసమితి అని, కొందరు విప్లవ సంఘమని రకరకాల అపోహలను ఎదుర్కోవలసి వచ్చింది. అన్ని అవరోధాలను, నిషేధాలను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని, స్వీయ సిద్ధాంతాల నుంచి అంగుళం మేరకూడా చలించక, సంఘ కార్యక్రమాలను ముందుకు నడపటంలో డాక్టర్ జీ కృతకృత్యులయారు.
సంఘ్ స్థాపించిన తర్వాత వివిధ కార్యక్రమాలలో, సందర్భాలలో సంఘ కార్యకర్తలతో సమావేశం అయినపుడు, ముఖ్యంగా 1935వ సం॥లో (అప్పటికి సంఘం స్థాపించి పది సం॥లు అయింది) చేసిన ప్రసంగాలు ఎంతో ఉత్తేజకరంగాను, స్ఫూర్తిదాయకంగాను, హిందూ సమాజానికి సంజీవని వలె ఉండటంతోపాటు హిందూత్వ భావోద్వేగాలను రేకెత్తించేవిగా ఉండేవి. హిందూస్థాన్ హిందువులది; శివాజీ నుండి ప్రేరణ పొందుదాం; ఎందుకంటే అతడు హిందూసమాజానీకి ఆదర్శంగా నిలిచే ఏకైక మహాపురుషుడు, హిందూ ధర్మాన్ని ప్రాణం పోయినా, అఖరినెత్తుటి బొట్టు వరకు వదలి పెట్టకూడదు. మనలనుమనం సంరక్షించుకోవాలన్నా, ఇతరులలోని ఆక్రమణ ప్రవృత్తిని తొలగించాలన్నా మనం శక్తిమంతులం కావలసి ఉంటుంది. స్వరాజ్యం బిచ్చమెత్తితే వచ్చేది కాదు, సంపాదించుకునేది; జీవితమంతా సంఘకార్యం చేయదలుచున్న వారు కూడా చదువుకోవడం, తద్వారా సంఘం పనిచేయడానికి యోగ్యతను అధికారాన్ని సంపాదించుకోవడం అవసరమే, యిలా సాగేవి డాక్టర్జి ప్రసంగాలు. ఈవిధంగా సంఘకార్యమే జీవిత లక్ష్యంగా, దైనిక జీవితం అంతా ప్రతి నిమిషం సంఘానికే వినియోగించి, నిరాడంబరంగాను, ప్రచారాలకు దూరంగాను, అపారమైన ధీశక్తి అసమానము గంఖీరము అయిన నీతిజ్ఞత, అచంచలమైన ధైర్యం మూర్తీభవించిన డాక్టర్టీ తన జీవితమే ఒక మహాయజ్ఞంగా ఆహుతిచేసి, హిందూ రాష్ట్రానికి ఒక అపూర్వమైన వెలుగుని, నూతన దృష్టిని సృష్టించి- హిందూరాష్ట్రం (భరతఖండం/ఆర్యావర్తం) చరణాలపై కానుకగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ను అర్చించిన డాక్టజీకి 1932 నుండీ ఆరోగ్యం క్షీణించి దీర్జకాలిక చికిత్సలు పొంది, చివరకు 1940సం॥ జూన్ 21నాడు - స్వర్గస్థులైనారు.
1940లో డా॥ హెడ్గేవార్ మరణించిన తర్వాత వారి జీవితాన్ని సంక్షిప్తంగా పరిచయం చేనిన పుస్తకం హిందీలో వెలువడింది. తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకం 1971లో మొదటిసారి ముద్రింపబడింది. ఆ తరువాత్త 1935వ సం॥॥లో సంఘం స్థాపించి దశాబ్టి ఉత్సవాలు జరిపినవుడు డాక్టర్ జీ ప్రసంగం, 2003లో హిందీలో ప్రచురితమైన “డా. కేశవబలిరాం హెడ్గేవార్” (నవభారత నిర్మాతలు” గ్రంధావళిలో భాగంగా) గ్రంధంనుండి 'రాజద్రోహానికి నేరవిచారణ” ను ప్రత్యేక అనుబంధంగా తెలుగులోకి 2004లో వడ్డి విజయసారధి అనువాదం చేసారు. ఈ విధంగా 'డాక్టర్” జీవితం- సందేశం, దానితోపాటు చేర్చిన కొత్త అధ్యాయాలతో 2019లో నవయుగ భారతి ప్రచురణలు, హైదరాబాదు వారు తమ ప్రధమ ముద్రణగా వెలువరించారు. దేశభక్తి భావనలను 'ప్రజ్వలింపచేయుటలో ఈ గ్రంధానికి ప్రాముఖ్యం ఉంటుందని తక్కువ ధరకే అందజేస్తున్నారు.
- - ఎం. వి.శాస్త్రి 9441342999