అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/సాహిత్యం, సమాజం, సాధికారిత 'గేర్లు మార్చాలి'

వికీసోర్స్ నుండి

భాష-ప్రగతి

డా॥పి. శివరామకృష్ణ (శక్తి) 94414 27977

సాహిత్యం, సమాజం, సాధికారిత 'గేర్లు మార్చాలి'

ఉద్యోగులకు ప్రజలకు కావలసిన చదువు చెప్పే స్వతంత్రం లేదు. బానిస చదువులు చదివిన వాళ్ళకు ప్రజల చదువుమీద ఆసక్తి లేదు. బూర్జువా చదువులు చెపుతూ విప్లవాల గూర్చి కొందరు గర్జిస్తుంటే, సాహిత్యసభలలో కొందరు పరవశిస్తున్నారు. ఇటువంటి మాయ జలతారు సోకులతో మురిపిస్తున్న ఉత్సవ విగ్రహాలనుండి బతుకుతెరువులకు మూలాధారాలైన మూలవిరాట్టులు జానపద వాంగ్మయం, కళలను నిలబెట్టుకోవాలి. పారిశ్రామికవిప్లవం తరువాత ఉత్పత్తిసాధనాలన్నీ పెట్టుబడి దారుల వశమౌతున్న తరుణంలో, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిస్తే నేడు సుస్థిర అభివృద్ధి కోసం, వికేంద్రీకరణ ద్వారా ఉత్పత్తి సాధనాలను సొంతం చేసుకోడానికి ఉద్యమించాలి.

మార్క్సిస్ట్ విమర్శకుడు త్రిపురనేని మథుసూదనరావు(తిమరా), తెల్లవాళ్ళు రాకముందు గల తెలుగు సాహిత్యం, సంస్కృతిని గూర్చి వివరిస్తూ 'మొత్తం సాహిత్యం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది” అని నొక్కి చెపుతూ, నాటి శృంగారచర్చలు స్త్రీ విముక్తి ఉద్యమంగా పరిణమించేవి అంటారు. తెల్లవాళ్ళ విద్య, ఉద్యోగాలు మనలను ఎలా బానిసలను చేసాయో, లిఖిత (రాత) సాహిత్యం ఎలా ప్రజలకు దూరం కాసాగిందో వివరిస్తారు.కవితా విష్లవాలలో జానపద వాంగ్మయం చేర్చకపోవటాన్నిదుయ్యబడతారు. కొడవటిగంటి ఈ పరిణామాలకు నిరుత్సాహ పడతాడు. కానీ యానాది రాఘవయ్యగారు ఈ పరిణామాలగూర్చి విస్తృతంగా రాయ టమేకాక, గిరిజనుల విముక్తికి తనజీవితాన్ని అంకితం చేసారు.

“జానపద వాంగృయంలో తెలుగు ప్రీల సాహస పరాక్రమాలే కాక ప్రణయ జీవితంలో కూడా స్వేచ్చా, మానవతా స్పూర్తి కనిపిస్తాయి (107) పదకవిత్వం పాలక వర్జాల కవిత్వం కాగా, సంస్కృతీ కరణ దాస్యం లేదు కాబట్టి జానపద కవిత్వం సూటిగా వచ్చింది... మొత్తం సాహిత్యం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది”

(నాయకరాజుల కాలంలో) 'కుల సంబంధాలలో దూరం తగ్గిపోయింది. స్త్రీ పురుష సంబంధాలలో కొంత స్వేచ్చా, శృంగార సమస్యల బహిరంగ చర్చ కనిపిస్తుంది” (186) “మధ్యలో వలస వాదులు వచ్చి మొత్తం సామాజిక వ్యవస్థను కంపింప చేయకపోతే స్వేచ్చాభోగ ఉద్యమం స్త్రీ విముక్తి ఉద్యమంగా పరిణమించేది”. (182) అంతేకాదు 'లేఖనప్రక్రియను మాత్రమే కవితా విప్లవాలకు చోదక శక్తిగా చెప్పటం అర్ధరహితం. లేఖనప్రక్రియ కవిత్వం కోసం పుట్టదు. శారీరక మానసిక శ్రమవిభజన నుంచి ఏర్పడుతుంది" (74) లిఖిత, జానపద సాహిత్యాల పొత్రను,హద్దులను, ప్రత్యేకతలను స్పష్టం చేస్తారు.

“ప్రజాసామ్యం పేరుతో బూర్జువా నియంతృత్వాన్ని అభ్యుదయ వాదం సమర్దించింది. మధ్యే మార్గంగా సంస్మరణ వాదాన్ని చేపట్టటంతో అవకాశ ధోరణులు ప్రబలం అయ్యాయి. The bourgeoisie has stripped off its halo hither to honored and looked up to reerent awe. It has conerted physician the priest, the poet, the man of science into its paid wage laborer N.(Marx- Engels' Manifesto) సాహిత్యం అమ్మకపు సరుకుగా మారిపోయింది. కళవ్యాపార కళగా మారిపోయింది. వెన్నెముక లేని మధ్యతరగతి జీవితం సాహిత్యంలోకి ప్రవేశించిది. 117. వాళ్ళు (నవలా రచయితలు) వ్యావహారిక భాష దగ్గరికి తీసుకరావటంకాక, వ్యావహారిక భాషనే సాహిత్య భాషగా మార్చారు. తెలుగు ఇంగ్లీష్‌ పదాల కలయిక, వాక్య నిర్మాణం లో ఇంగ్లీష్‌ వాక్యనిర్మాణ పద్దతులను ప్రవేశ పెట్టి వ్యావహారిక భాషను ప్రజలకు దూరం చేసారు... (118, సాహిత్యంలో వస్తుశిల్పాలు. త్రిపురనేని మధుసూదనరావు. 1997)

కొడవటిగంటి కుటుంబరావు కూడా ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహపడతాడు (పల్లెటూళ్ళలో జనం నిత్యజీవితంలో వాడే ప్రయోగాలూ పదజాలము తెలియని పేరుపడ్డ రచయితలు చాలామందిమి ఉన్నాం. మధ్య తరగతి మిధ్యా ప్రామాణిక భాష వొకటి ఆధిపత్య భాషగా స్థిరపడటం మొదలైంది. ఈ కాలపు అభ్యుదయ సాహిత్య కారులు రాజకీయ సామాజిక ఆర్ధిక రంగాల మీద దృష్టి పెట్టినంతగా భాషమీద దానిగతి తార్మికత మీద దృష్టి పెట్టలేదు. 61.

విప్లవాల సంగతి అటుంచి చిన్న చిన్న సంస్కరణలను కూడా సాహిత్యం చెయ్యలేదు. జీవితం దిగబెరుకుతున్నప్పుడు, సాహిత్యం ఎగబెరకదు. 96.ప్రజాసాహితి కొ.కు శతజయంతి ప్రత్యెక సంచిక. 2009

యానాది రాఘవయ్య గారు బ్రిటిష్‌ దమన, దండ నీతి బలహీన వర్గాలను ఎలా బలితీసుకున్నాయో 'యానాది 'లో చిత్రిస్తారు. ఇది ఎవరి తప్పు అని నిలదీస్తారు. (బ్రిటిషు ప్రభుత్వం మన అనాది నీతులను మంటగలిపి కొత్త నేరాల జాబితా మనకు అంటగట్టి నప్పటినుండి, ప్రతిదీ నీదా, నాదా అనే గీటురాతికి లోబడవలసి వచ్చింది. ఎవరూ కష్టించి పండించని చెరువు చేపలు, కప్పుతుంగలు, అడవి కట్టెలు, సవకచెట్ల తోపులు, పోరంబోకుల ఫలితాలు, ఈ పంచాయతీరాజులు రాకమునుపు పేద సాదా అనుభవించు చుండిన

పుడు, యానాదికి తిండి కరువే లేకుండెను. అతని సంసార బలగము బరువే కాకుండెను.

అప్పటికీ అతడు తిన్నది నాగజెముడు పండ్లు, నివసించినది కాలువ కట్టన. తాగినది దొరువు నీరు, కట్టినది పారవేసిన పరాయి కట్టుగుడ్డ, అట్టి నిరపరాధికి, నిష్కామకర్శికి, ఒకేసారి ఇద్దరు పెండ్లాలు ఉండకూడదని, బొట్టుకట్టని స్త్రీ తోడి కలయిక వ్యభిచారమని ఏ పనిచేయక, స్థిరనివాసము ఏర్పరచు కొనక, తిరుగుబోతుగా నుండుట, ఎవరికీ అపాయము కానప్పటికీ శిక్షార్హమని, దిసమొలతో తిరుగుట నేరమని, గ్రామాన్ని వదిలి మరో గ్రామానికి పోవటం పెద్దనేరమని మొదలగు అనేకనేరాలను అతని నొసటిపైన మనం రాస్తే అది ఎవరి తప్పు? (యానాది పేజి 118.ఆంధ్ర రాష్ట్ర ఆదిమ సేవా సంఘ ప్రచురణ 1974).

కోర్టులో గిరిజనులు పడే తబ్బిబ్బులను గిడుగువారు పేర్మొంటే న్యాయవాదియైన రాఘవయ్యగారు కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు.

ఇంత స్పష్టమైన అవగాహనతో, సమకాలికులు పనిచేసిన ఉదాహరణలుండగా, హక్కుల ఉద్యమాలు కప్పగంతులు వేస్తున్న జాడలను బాలగోపాల్‌ ఇలా కనుగొంటారు. 'కమ్యూనిస్ట్‌ ఉద్యమం నుండి వచ్చిన అనేక అభిప్రాయాలు ఫౌర హక్కుల ఉద్యమంలో భాగం అయిపోయాయి. అవి ఈ ఉద్యమానికి అవసరమా? ప్రయోజనకరమా? అసలవి సత్యమేనా అని చర్చించకుండా, వాటిని పౌర హక్కుల అవగాహనలో భాగం చేసుకోవటం వల్ల ఈ ఉద్యమం విశాల స్వభావాన్ని సంతరించుకోలేక పోతున్నది. తనదైన అవగాహనను రూపొందించుకోలేక పోతున్నది”. (46).

“తిండి ఉంటె చాలు వాక్‌ స్వాతంత్రం అక్కరలేదని, వాక్‌ స్వాత్రంత్రం ఉంటె చాలు తిండి అక్కరలేదని, హక్కులలో హెచ్చు తగ్గులు నిర్ధారించటానికి జరుగుతున్న చర్చను పౌర హక్కుల ఉద్యమం తిరస్మరించాలి. మనీషి నిండుగా ఎదగటానికి అన్ని హక్కులు అవసరం అని గుర్తించాలి” (78. హక్కుల ఉద్యమం. బాలగోపాల్‌).

హక్కుల ఉద్యమ అధివక్త భాషావేత్త చామ్మీ ఇదే విషయాన్ని కాస్త కటువుగా చెప్పాడు. “పారిశ్రామిక ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమో కార్మికులందరికీ అనుభవ పూర్వకంగా తెలుసు. కార్మికులందరూ మార్క్స్ ను చదివే ఈ విషయం తెలుసుకోలేదు. మార్క్స్ పూర్వం నుంచే ఈ భావనుంది. (20 చామ్స్మీ 'ఆలోచనే ఆయుధంగా ' ప్రజాశక్తి బుక్‌ హౌస్‌).

శ్రామిక సంస్కృతిపై స్పష్టమైన అవగాహనగల తిమరా, 'జానపద సాహిత్యంలో వర్గ స్పృహ ఉంది, వర్గ చైతన్యం లేదు”. (109) అనే నిర్ణయానికొస్తారు. కానీ వర్గ్ణచైతన్యం అనాదినుండి జాతి మనసు లో లోతుగా నాటుకున్న వైనం మన స్థల పురాణాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి (ఆర్మిటైప్స్‌) ప్రాగ్రూపాలను మార్క్స్ కూడా వాడారు.శ్రీశ్రీ సరేసరి. జాతి సంస్కృతిని నడిపించే నిర్మాణాలను ఆవిష్కరిస్తూ మానవ, భాషాశాస్రజ్జులు జానపద గిరిజన సాహిత్య విమర్శను (లిటరరీ ఆంత్రపాలజి) తీర్చిదిద్దితే, అస్తిత్వవాదులు లిఖిత సాహిత్య విమర్శను పెంపొందించారు. (నిర్మాణ వాదం మొదట్లో భాషకు సంబంధించినదే. భాష అన్నపుడు మాట్లాడే భాష రాసే భాష మాత్రమే కాదు, అన్నిరకాల వ్యక్తీకరణ రూపాలుకూడా. (95 సాహిత్య విమర్శపదాల డిక్షనరీ. నళిని)

మార్కిస్ట్‌ దృక్పధంతో జానపదుల, గిరిజనుల పోరాటాలను సమీక్షించిన చరిత్ర కారులు రంప, గూడెం పితూరిలలో సాంస్కృతిక వారసత్వం నిర్వహించిన పాత్రను గుర్తుచేస్తారు.

“In Gudem Rampa case, religion was used to express dissatisfaction with subjugation and frame the terms of delierance with in a known model that proided symbolic capital to counteract the superior control of economical capital by their oppressors...This was rendered authentic by the encounter of Bodadu with fie Pandaas in the jungle, a symbolic mediation of local and national culture that was politically expedient for integration of hill men with the supporters in the plains Ñ.

(Readings in Subaltem Studies Ed.Daid Ludden 2002. Orient black Swan.)

సాంస్కృతిక వారసత్వంలో, స్థల పురాణాలు, జాతరలు, కొలుపులు, పురా గేయగాధలు ప్రధాన పాత్ర వహిస్తాయి.

నాగరాజులకు మత్స్వరాజులకుగల సహజ వైరాన్ని విశాఖ మన్యంలో మత్స్యగుండం పురాగాధ వివరిస్తుంది.

వస్తుమార్పిడి, సమష్టినిర్ణయంతో నడిచే వ్యవస్థ /విధానం గిరిజనులది. బంగారం, నాణేలు వంటి కృత్రిమ విలువలను వారు మాయగా భావించి విధ్వంసానికి దిగటాన్ని తెలియచేసే ముఖలింగం లో మధుకేశ్వరస్వామి, కారా మాస్టారి యజ్ఞం కథను తలపిస్తుంది.

కానీ వివిధ రూపాలలో నాగరికత దాడి చేస్తుందని, దాన్ని ఎదుర్కోవటానికి కావలసిన నైపుణ్యం, చదువు నేర్చుకోవాలని పూరి క్షేతం అక్షర బ్రహ్మకథ బోధిస్తుంది. చదువుతో పాటు, ఇందుకు కావసిన బలగాన్ని కులాలను కలుపుకుంటూ సమకూర్చుకోవాలని మోదకొండమ్మ కథ, నాగరాజుల మత్స్వరాజుల కథలాగే,” పంచ పాండవుల పంట దుర్యోధనుడి వంట, కొండవారిపంట - దిగువ వారి వంటకు పోతున్నప్పుడు జరుగుతున్న దోపిడీని గిరిజన భారతాన్ని వర్ణించే నందిపండుగ పాట వివరించి, తంతుద్వారా మాజిక్‌ రియలిజం శిల్పంతో సుఖాంతం చేస్తుంది.

అయితే చదువు నేర్చుకోవాలనే అక్షర బ్రహ్మకద ఒక తంతుగా మారితే, ప్రభుత్వం 'సంతోష చంద్రశాల ' 'ఆటబడి - పాటబడి” “చదువు కొత్తలు” వంటి ముద్దుపేర్గుపెట్టి, సార్వత్రిక విద్యపేరిట గిరిజనుల ఆటపాటలను పక్మన పెట్టి, “పల్లపు” చదువులను గిరిజనుల మీద రుద్దసాగారు. వీరి రచనలలో హైకూలు దొర్లుతాయి కాని గిరిజనుల సాంస్కృతిక వాసనలేమీ కనిపించవు.

విశ్వవిద్యాలయాలలో జానపద విజ్ఞానం జోధించేవారు కూడా మానవ, భాషాశాస్త్రాలు వృద్దిచేసిన విమర్శనా సంప్రదాయం, (అంబేద్కర్‌ సార్వత్రిక విద్యాలయం ఒక అధ్యాయంగా చేర్చినా) ప్రచారానికి నోచుకోలేదు. మానవశాస్త్ర వేత్తలకు సాహిత్యం అక్కరలేదు.

(తరువాయి 27 వ పుటలో)