అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/ఇకపై తెలుగు మాధ్యమంలో చదువులుంటాయా?

వికీసోర్స్ నుండి

తెలుగు చదువులు

నూర్‌బాషా రహంతుల్లా 6301493266

ఇకపై తెలుగు మాధ్యమంలో చదువులుంటాయా?

తెలుగు మాధ్యమంలో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా? తెలుగుదేశం, వైసిపి పార్టీలు రెండూ కూడా ప్రాధమిక విద్యను ఇంగ్లీషు మీడియానికి మార్చుతామని, తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంచుతామని తమ మ్యానిఫెస్టొలలో ప్రకటించాయి. కానీ ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో ఉంచి ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా మాత్రమే నేర్పాలని తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు. మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం 9వేల ప్రాధమిక పాఠశాలల్ని ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చారు. ఈ సంవత్సరం మిగిలిన 40వేల ఫైచిలుకు ప్రాధమిక పాఠశాలల్ని ఆంగ్లమీడియంలోకి మార్చబోతున్నారు. ఇకమీదట అన్ని ఆంగ్లమాధ్యమ పాఠశాలలే ఉంటాయి. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంపై మక్కువ చూపుతున్నారట. ఈ ఒక్క కారణం చూపుతూ ఇప్పటిదాకా కొనసాగిన తెలుగు మాధ్యమాన్ని మూల దశలోనే లేకుండా తీసిపారేస్తున్నారు. బ్రతుకుతెరువుకు పనికివచ్చే వృత్తి విషయాలను తెలుగులో బోధించకుండా కవిత్వాలు పద్యాలు కథలు ఉండే తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే బోధిస్తారట. విద్యార్థులకు అటు తమ భాషను రానివ్వకుండా, ఇటు స్వేచ్చగా అనుమానాలు నివృత్తి చేసుకోనివ్వకుండా ఇదేమి చదువు ? ఇది పిల్లల మాతృభాషను మార్చటం కాదా ? మరో భాషలోకి వలస తీసికెళ్ళటం కాదా?

సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలకు సన్మానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆదేశించారు. ఇది మంచి సంప్రదాయమే. కానీ తెలుగులోనే డిగ్రీ దాకా చదివి, తెలుగు మాధ్యమం లోనే సివిల్స్‌ పాసైన అభ్యర్థులకు ఘనసన్నానం చెయ్యాలి. తెలుగు మాధ్యమం ద్వారా పరీక్షల్లో నెగ్గి పద్ధతుల్లో నైపుణ్యశిక్షణ ఇప్పించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు ఇవ్వాలి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా దేశభాషలకు స్వాతంత్య్రం రాలేదు. మాతృభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట గాంధీజీ. భాషా చాతుర్యం ఉంటే ఎంతటి క్లిష్టమైన వ్యవహారాలనైనా అవలీలగా పరిష్మరించుకోవచ్చు. చెప్పాలనుకున్న విషయాలు సాఫీగా చెబుతూ నదీ ప్రవాహంలా ముందుకు సాగేది మాతృభాషే, ప్రపంచ భాషలను శాసిస్తున్న ఆంగ్లం కూడా ఎన్నెన్నో పరభాషా పదాలను తనలో ఇముడ్చుకొని నేడీ రూపం తీసుకొంది. ఇంగ్లీషు ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇముడ్చు కోవటమేకాక విశ్వవ్యాప్తంగా విద్యాలయాలను సమకూర్చుకొని విద్యార్జులకు నేర్పుతూ ప్రపంచ భాషగా ఎదిగింది. నాలుగు మాటలు ఇంగ్లీషు కలవకుండా తెలుగులో మాట్లాడుతున్న పరిస్థితి నేడు మనకు లేదు.

మన పిల్లలు పై స్థాయిలోకి వెళ్లదానీకి, బాగా చదవడానికి ఇంగ్లీషు మీడియం చదువులే మంచివన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు, ప్రభుత్వాలు వచ్చేశాయి. ఇక్కడి భాషతో ఇక్కడే బతకవచ్చన్న భరోసా ఎవ్పుడు ఏర్పడుతుంది? మాతృభాష బువ్వ పెడుతుందన్న నమ్మకం ఎలా కుదురుతుంది?

ఇంట్లో తెలుగు - బడిలో ఇంగ్లీషు

మనిషి మాతృభాషలో ఆలోచిస్తాడు. మన ఊహకూ, కాల్పనిక శక్తికీ, నూతన సృజనకూ మూలం మాతృభాషే, మాతృభాషగా తెలుగు మన ఇళ్ళల్లో ఇంకా బ్రతికే ఉంది. “ఇంట్లో తెలుగు -బడిలో ఇంగ్లీషు” లా ఉంది మన జీవితం. మన పిల్లలకు నేర్చే చదువు కూడా తెలుగు మాధ్యమంలోనే ఉండాలని కొందరు అడుగుతున్నారు.

మాతృభాషను విస్మరించి పరభాషకు పట్టం ఎందుకు కడుతున్నారు అంటే ఉద్యోగాలు పరభాష లోనే దొరుకుతున్నాయి కాబట్టి. మన పిల్లలకు మాతృభాషలో కనీసం ప్రాధమిక విద్య లేకపోవడంవల్ల పిల్లల్లో సృజన పోయింది. అందుకే చాలామంది ఇంగ్లీషు మీడియంలో చదివిన యువకులు, నాయకుల పిల్లలు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు. మన దేశంలో నేడు 60 శాతం విద్యార్థులు ఆంగ్గ మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఆంగ్లంలోకి మారాయి. ప్రజలు కూడా ఈ మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు మాధ్య మానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. ఆంగ్లమాధ్యమం వల్ల కొందరు విద్యార్థులకు విదేశాలల్లొ ఉద్యోగాలు దొరకవచ్చేమో కానీ, రాష్ట్రప్రజల భాషా సాహిత్యాల భవిష్యత్తును అది నాశనం చేస్తుంది. విద్యార్థులు కూడా పరభాషా మాధ్యమం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. న్యాయం, వైద్యం, ఇంజినీరింగ్‌, భౌతిక రసాయన శాస్త్రాలన్నీ తెలుగులో నేర్చగలగాలంటే మాతృభాషలోనే ఆ సాంకేతిక సమాచారమంతా లభించేలా పదసంపద ఎప్పటికప్పుడు పెరగాలి. ఇందుకుగాను తేలికగా అర్ధమయ్యే ఇంగ్లీషు పదాలను కూడా తెలుగు

పుస్తకాలలోకి తీసుకోవాలి.

ప్రొత్సాహకాలతోనే తెలుగు వృద్ధి

తెలుగు మాధ్యమంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలకోసం తెలుగులో పరీక్షలు రాసేవారికి 5 శాతం మార్కులను అదనంగా కలిపినా, తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివిన పిల్లలకు మొత్తం ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్‌ కల్పించినా తెలుగు భాషకు గొప్ప మేలు జరుగుతుంది. నానాటికి నీరసించి పోతున్న భాషకు బలవర్ణక బెషధాలు ఇవ్వాలి కానీ అసలు ప్రోత్సాహకాలేమీ ఇవ్వకూడదు అని కొందరు తెలుగు వాళ్ళే వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. బలహీన వర్షాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కదీసుకొచ్చినట్లే మన మాతృభాషలకు కూడా ప్రోత్మాహకాలిచ్చి బలపరచాలి, బ్రతికించాలి. డబ్బురాని విద్య దరిద్రానికే అంటారు. ఏ ఉద్యోగమూ రాక ఎందుకూ పనికిరాక సోయేటట్లయితే తెలుగులో ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? తెలుగు చదవడాన్ని పెంచాలంటే ప్రోత్సాహకాలు కూడా ఉండాల్సిందే.

1985 పరీక్షల వరకూ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్ముల పునరుద్ధరణకోసం ప్రభుత్వం అసలు కోర్టులో ప్రయత్నమే చేయలేదు. ప్రోత్సాహక మార్కుల కేసులో దీటుగా ఎదుర్శొని వాదించగల తెలుగు న్యాయవాదిని నియమించి మార్ముల పునరుద్దరణ జరపాలి. ప్రజల భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొంటున్నట్లుగా మన ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. విషయం కోర్టులో ఉందన్న సాకుతో తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించటాన్నీ మరచిపోకూడదు. 5 శాతం అదనపు మార్కులను ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.

తెలుగు మాధ్యమం వారికన్నా ఇతర మాధ్యమాల వారు ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకొంటున్నారు? పిల్లల చదువు మీద శ్రద్ద పెట్టే కుటుంబాలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికే ఎందుకు పంపుతున్నాయి? ఆంగ్ల మాధ్యమ పంతుళ్ళ స్థాయిలో తెలుగు మాధ్యమ పంతుళ్ళకు కూడా జీతాలు ఇవ్వగలిగితే తెలుగు విజ్ఞానులు తెలుగునేలపైనే నిలబడతారు. తెలుగులో పోటీ పరీక్షల పుస్తకాలు వెల్లువెత్తుతాయి. తెలుగులో చదివితే కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయనే ధీమా ప్రభుత్వం కల్పించక తప్పదు. ప్రజలు ఏ పనికైనా ప్రయోజనం ఆశిస్తారు. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటే ప్రజలూ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారు. మనిషి ఆశాజీవి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి చేరతాడు. తెలుగు విద్యార్థుల్ని కాపాడుకోవటం ద్వారానే తెలుగును రక్షించుకోగలం. ఈ మర్మాన్ని గ్రహించే తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లు తమిళ విద్యార్దులకు కల్పించింది. అక్కడ ఎలా సాధ్యమయ్యిందో కనుక్కొని అదే పద్దతి ఇక్కడ మనమూ అనుసరించాలి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదవడానికి తరలివస్తారు. తమిళనాడులో నివసించే విద్యార్థులు తమిళంలో చదవక తప్పదు అని దివంగత ముఖ్యమంత్రి జయలలిత హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌కు అసెంబ్లీలో తెగేసి చెప్పారు. అక్మడ రాని పెను ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుంది? భాష విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం తమిళాన్ని అభివృద్ధి చేసుకోటానికి ఎన్ని మార్దాలున్నాయో అన్ని మార్గాలూ అన్వేషించి సఫలమయ్యింది. అందువలన పై ప్రతిపాదనలకు తోడు ఉద్యోగ నియామక పరీక్షలలో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి. ఈ నియమం వల్ల అభ్యర్ధులు తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు బాగా నేర్చుకొని పాస్‌ కాక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి కావాలి.

ప్రభుత్వోద్యోగులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వారి సమస్యలు వినాలి, వారికి అర్హమయ్యేట్లు పరిష్కార మార్గాల గురించి వారి భాషలోనే చెప్పాలి. కాబట్టి వారికి తెలుగులో పరిజ్ఞానం ఉండాల్సిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతర ర్యాష్టాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాషలోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్జులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి. తెలుగు మన ప్రజల భాష. ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు కూడా అరు నెలల్లో తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో సంతకంపెట్టాలి. తెలుగులో నోట్స్‌ రాయాలి.తెలుగుపిల్లలు తెలుగులోనే ఎందుకు వెనుకబడి ఉండాలి? మాతృ భాషలో వెనుకబడేవాళ్ళు అన్ని భాషల్లోనూ వెనుకబడే ఉంటారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలి. మాతృభాషకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన ఇక ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళకుండా చట్టంలోనే నియమం పెట్టాలి.

తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు

డిగ్రీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని ఆనాటి మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, భూమా అఖిలప్రియ వాగ్దానం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశపెడతామన్నారు. ఇంగ్లీషు మీడియం లేకపోవటం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనీ, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదనీ ఉభయ రాష్ట్రాల్లో చర్చ నడుస్తున్నది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేస్తూ; ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మరోవైపు రాష్ట్ర మంత్రి నారాయణ; తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఇంగ్లీషు మాధ్యమం

తెలుగును బోధించడం కాదు ; తెలుగులోనే అన్నీ బోధించాలి

లోనే ఉద్యోగాలొస్తాయని, మున్సిపల్‌ పాఠశాలలన్నింటిలో తెలుగు మాధ్యమం తీసేసి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెడతామని ప్రకటించారు. ఎవరిమాటలు నమ్మాలి? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను నేర్చుకొనే అవకాశం కోల్పోయి మరోసారి స్వాతంత్య్రాన్ని కోల్పోయాము. గత్యంతరంలేక పరాయిభాషలోకి తప్పనిసరై కావాలనే మన పిల్లల్ని నెడుతున్నాము. తెలుగులోనే పరీక్షలు రాసి, ఆ భాషలోనే ముఖాముఖిలో పాల్గొని, కేంద్రప్రభుత్వ అధికారులుగా ఎంపికైనవారు ఎంతమంది లేరు ? అలా మాతృభాష ద్వారా ఉద్యోగాలను సాధించే స్థాయికి మన పిల్లలను తీసుకెళ్ళాలని మన నాయకులు కూడా కోరుకోవాలి కదా?

సర్వీస్‌ కమీషన్‌ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయి ? ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్గానాలు రెండు రాష్ట్రాల్లోనూ వినబడు తున్నాయి. తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరు తున్నారు. కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా. తెలుగు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా చెయ్యాలి. మన; ప్రజా సేవ (పబ్లిక్‌ సర్వీస్‌) కమీషన్లు. 1985 వరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం డిగ్రీ విద్యార్థులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులు హైకోర్టు తీర్పుతో ఆగిపోయాయి. ప్రభుత్వం హై కోర్టులో అప్పీల్‌ చేసి మార్ముల పునరుద్ధరణకు ప్రయత్నించాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే అభ్యర్థులకు దారి ఇవ్వాలి. ఆఫీసుల్లో తెలుగు బ్రతకాలి. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు తెలుగులో చదవాలి. తెలుగు అధికారులు తెలుగులో కార్యాలయాలు నడపాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు సర్వీసు కమీషను పరీక్షల్లో రిజర్వేషన్లు, ప్రోత్సాహక మార్కులు తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీపై జీవోలు ఇవ్వాలి.

"""తెలుగు భాషలో సాధికారత ఏదీ?

ఎవరి భాషలో వారికి విద్యను బోధిస్తేనే ప్రయోజనమన్నారు గిడుగు రామమూర్తి. బడి పలుకుల భాష కంటే పలుకుబDuల భాషే అవసరమని కాళొజీ చెప్పారు. అసలైన పురోగతి మాతృభాషతోనే సాధ్యమని గాంధీజీ వాదించారు. అమ్మభాషలో బొధన విద్యార్ధి సృజనను ఎంతో పెంచుతుందని విశ్వకవి రవీంద్రుడు భావించాడు. ఇవేవీ పట్టించుకోకుండా ఇంగ్లీషులో మాత్రమే నేర్పుతున్న చదువు పిల్లలకు భారంగా మారింది. కళాశాల విద్య అర్థం కావటం లేదు. పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి అక్కడ ఏమి జరుగు తుందో తెలియటం లేదు. న్యాయస్థానాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్న ప్రక్రియ కక్షిదారులకు అంతుపట్టడం లేదు. ఇటు సొంత తెలుగు భాష చెల్లక, అటు పరాయి కోర్టు భాష సాంతం తెలియక, ఎంతకీ అవగతం కాక అవస్థ పడుకున్నారు. సొంత భాషలో చెప్పుకోలేను, పరభాషలో నవ్వలేను, ఏడలేను అన్నట్లు మారింది పరిస్తితి. అర్థమైనా కాకపోయినా ప్రతి విషయం ఇంగ్లీషులోనే చెప్పుకోవాల్సి వస్తోంది. మాతృభాషలో స్వేచ్చగా మాట్లాడే భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. సొంత మాటలను, పదసంపదను పోగొట్టుకొని మూగవాళ్ళలాగా బ్రతుకుతున్నాం. భాషా దారిద్య్రం, భావ దారిద్య్రం రెండూ మన ప్రజల్ని బాధించేలా మన పాలన, విద్యా, న్యాయ రంగాలను తయారు చేశారు.

భాషా ప్రయోజనాల్ని అందరి దరికీ చేర్చే బాధ్యత ప్రభుత్వానిది. తెలుగునాట తెలుగు భాషాబోధనను నిర్చంధం చేయాలి. ప్రాథ మిక దశ నుంచి ఉన్నత పాఠశాల చదువు ముగిసే పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. పాఠ్యపుస్తకాల్ని పిల్లలందరికీ బాగా అర్ధమయ్యేలా రూపొందించాలి. కన్నడ భాషాబొధనను అక్కడి ప్రభుత్వం ఉన్నత పాఠశాలదాకా నిర్చంధం చేసింది. కర్ణాటకలో పనిచేసేవారికి ఆ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలని తేల్చిచెప్పింది. తమిళనాడులో మాతృభాషలో చదివితేనే అక్కడ ఉద్యోగాలిస్తారు, మలయాళ భాష, సంస్కృతిని పదిలపరచుకొనేందుకు అక్కడ ప్రత్యేకంగా ప్రాధికార సంస్ద ఏర్పాటైంది. ఒడిశా, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్రల్లోనూ చదువుల్లో, ఉద్యోగాల్లో అక్కడి మాతృభాషలకే పెద్దపీట వేస్తున్నారు.

ఆంగ్లంలోని గ్రంథాల్ని ఇజ్రాయెల్‌ తన భాషలోకి కొద్దికాలంలోనే తర్జుమా చేసుకొంది. అత్యాధునిక పరిజ్ఞానానికి సంబంధించిన ఏ పదమైనా వెంటనే స్వీడన్‌ భాషలోకి అనువాదమవుతోంది ఉన్నత న్యాయ స్థానాలలో తెలుగు కనీసం ప్రవేశిస్తుందా? మన పాఠాల్లో ఉన్న తెలుగు” ఎంత? ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! “మార్కులకు పనికిరాని” సబ్జెక్టుగా మిగిలిపోతోంది. తమిళనాడులో సెంట్రల్‌ సిలబస్ లొనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే. తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకు ఒక బోథనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. తెలుగును బోధించే విద్యాలయాలకు మాత్రమే తెలంగాణలో అనుమతి దక్కు తుందన్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామఫలకాలపై తెలుగు విధిగా కనీపించాలన్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటి పరిస్థితి?

హైకోర్టులో తెలుగు వాదన పనికిరాదు పొమ్మన్నాదో ప్రభుత్వ న్యాయవాది. 1952 లో తెలుగు భాష పేరుతో మన రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త ర్యాష్టాలలో మనదే మొదటి రాష్ట్రం. భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? తెలుగు రాష్ట్రాన్ని తెలుగులోనే పరిపాలించటం. గత 66 సంవత్సరాల సుధీర్ల కాలంలో తెలుగు పాలన సిద్దించిందా? ఏమి ఆశించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు ఈనాటికీ నెరవేరకపోగా భవిష్యత్తులో కూడా ప్రజల భాషలో పాలన నడుస్తుందనే ఆశలుకూడా వదులు

"""సంస్కృతాన్ని అడ్డు పెట్టి తెలుగు కాంతినాపలేరు

కోవాలనే హెచ్చరికలు వస్తున్నాయి. అసలు పాలించటానికి మీ భాష బ్రతికి ఉంటుందా అనే సవాళ్ళు నిత్యమూ ఎదురవుతున్నాయి. తెలుగు జనమే ఇంగ్లీషు కాన్సెంట్లకు ఎగబడుతుంటే తెలుగు బడులు నిలుస్తాయా తెలుగులో ఫైళ్ళు నడుస్తాయా అని పరిహాసాలు ఆడు తున్నారు. తెలుగు జుతి మనది- నిండుగ వెలుగు జాతి అనే పాటను తెలుగు జాతి మనది- రెండుగ వెలుగు జాతి అని పాడుకుంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, దిగువ కోర్టుల్లో న్యాయపాలన అంతా మాతృభాషలోనే సాగేందుకు వీలుగా రెండు హైకోర్టులూ సాయపడాలని వేడుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు అన్ని కోర్టుల్లో కూడా ఆంగ్లానికే ఆదరణ దొరుకుతోంది. ఎన్నో అవాంతరాలున్నా తెలుగులో తీర్పులు ఇచ్చి కొందరు న్యాయమూర్తులు సాహసోపేతమైన శ్రమ చేశారు.

మాయమాటలు

పాలకుల్లో మాతృభాషాఖిమానం మచ్చుకైనా లేదు. అధికార శ్రేణులకు తెలుగుపట్ల చిన్నచూపు చెప్పనలవికాదు. తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ 1966లో చేసిన శాసనానికి ౩9 సంవత్సరాల తరవాత తీరిగ్గా 2005లో చట్టబద్ధ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తొమ్మిదికోట్లమంది తెలుగువారికి సేవలందించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు వాస్తవానికి తెలుగులోనే పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు వారి భాషలోనే పనులు చేసిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, అధికారులపైన ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విధిగా తెలుగుభాషలోనే సాగించాలనేగా భాషాదినోత్సవాలలో పాలకులు మాట్లాడేది? మరి ప్రజలలో ఈ ఇంగ్లీషు మోజు పెంచేది ఎందుకు? పైశాచిక భాషానువాదాలతో తెలుగు అంటేనే ప్రజలు Tఠారెత్తిపోయేలా బ్యూరోక్రసీ కసిగా వెలగబెట్టిన నిర్వాకాలు ఎన్నో! 2013లో ఏర్పాటు చేసిన తెలుగు భాష సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా గానీ 2018 లో ఏర్పాటు చేసిన తెలుగు భాషాఖివృద్ది ప్రాధికార సంస్థ ద్వారా గానీ ఏమేమి పనులు చేయించుకున్నారు?

భాష విషయంలో పాలకుల సంకల్పాలు, ప్రమాణాలు, గొప్పగా ఉంటున్నాయి. కానీ ప్రభుత్వాల ఉత్తర్వులు మాత్రం అమలు కావడం లేదు. తెలంగాణాలో సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ వచ్చాయి. పాలనలోనూ, చదువుల్లోనూ తెలుగు కచ్చితంగా ఉండాలి. కార్యాలయాలలోనూ, పాలనలోనూ, కోర్టుల్లోనూ తెలుగును వెలిగించాలి. చిత్తశుద్దిలేని నాయకుల మాటలతో ప్రజలలో నమ్మకం పోయింది. కూడు పెట్టని భాష మనకు - కోటీశ్వరులయ్యే చదువులు వాళ్ళకా? అని పేద ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను సాకుగా చూపి పాలకులు అసలు తెలుగు మాధ్యమానికే ఎసరు పెడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే తెలుగు మాయం “తెలుగు రాష్ట్రాలు రెండూ భాషను కాపాడేందుకు కట్టుబడాలి. మాతృభాషలోనే మాట్లాడండి, మాతృభాషను ఎవరూ మరిచిపోవద్దు” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెబుతున్నారు. స్కూళ్ళలో తెలుగు నేర్పుతుంటే కదా పిల్లలకు ఆభాష వచ్చేదీ మాట్లాడేది ? ప్లేస్కూల్‌ పేరిట మూడో ఏడు దాటగానే బడిలో వేస్తున్నారు. వారికి...మొదలు పెట్టడమే ఏ ఫర్‌ యాపిల్‌ *“అ- అమ్మ, ఆ - ఆవు” అని తెలుగు అక్షరాలు నేర్చించరు. కొన్ని స్తూళ్లలో ఐదో తరగతి దాకా తెలుగు చెప్పనే చెప్పరు. 6, 7, 8 తరగతుల్లో మొక్కుబడిగా చదివితే చాలు. 9, 10లో తెలుగు ఆప్పనల్‌ మాత్రమే! అంటే...ఇస్టముంటేనే తీసుకోవచ్చు. ఇంటర్‌లో కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా సంస్కృతం మాత్రమే బోధిస్తారు. అసలు ఎక్కడా తెలుగు కనీపించదు. త్రిభాషా సూత్రం అమలు కాగితాలకే పరిమితమవుతోంది. నాయకుల హామీల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో పూర్తిగా మాతృభాషలోనే బోధన ఉందా? ప్రైవేటు స్యూళ్లన్నీ ఇంగ్లీషు మీడియమే! ప్రైవేటు బడుల్లో బోధనా మాధ్యమంగా తెలుగు ఎప్పుడో మాయమైపోయింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది మిగిలి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్దుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లోని “ఇంగ్లీషు మోజే దీనికి కారణం. ప్రైవేటు స్కూళ్లను తెలుగు బాట పట్టించాల్సిన ప్రభుత్వం... తానే ఆంగ్ల మాయలో పడుతోంది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను తగలేస్తూ... ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు రాకపోవడాన్ని గర్వంగా చెప్పుకొంటున్నారు. తెలుగులోనే డిగ్రీ దాకా చదివి, తెలుగు సాహిత్యమే ఆప్పనల్‌గా తీసుకొని, తెలుగులోనే ఇంటర్వ్యూకి హాజరై సివిల్స్‌లో తెలుగు మాధ్యమంతోనే మూడవ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణను మనం గుర్తు తెచ్చుకోవాలి.

తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్లు తెలుగు మాధ్యమానికి అండగా ఉండాలి తెలుగు రాష్త్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్లు తెలుగు మాధ్యమ విద్యార్దులకు ఎంతో సేవ చేయవచ్చు. ఇవి జరిపే గ్రూప్‌ 1 2, 3, 4 ఉద్యోగ నియమకాలలో డిప్యూటీ కలక్టర్‌,మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీఓ,సబ్‌ రిజిస్ట్రార్‌, డిప్యూటీ తహసిల్టార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, ఎక్ట్నన్ షన్ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ జూనీయర్‌ అకౌంటెంట్‌ జూనీయర్‌ అసిస్టెంట్‌, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి వన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే. ఇవన్నీ ఐ ఏ ఎస్‌, ఐ పి ఎస్‌ లాంటి ఉన్నతోద్యోగాలు కావు. తెలుగు ప్రజలతో మమేకమై. వారితో ముఖాముఖీ తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు.

తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక, ఆర్థిక వ్యవస్థపై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పై పరిజ్ఞానం 'పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్మారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాషలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.

రచయిత - విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలక్టర్‌, అమరావతి

ఓట్లు అడిగేది తెలుగులో... పరిపాలించేది ఉత్వర్వులిచ్చేది ఇంగ్రీషులోనా?