పుట:Yogasanamulu.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18


పంచ భూతములు వివిధ నిష్పత్తులలో సంయోగము పొంది శరీరముల వంటి వివిధ పదార్థములు నిర్మాణము కాగా ఆ శరీరములకు ప్రాణ శక్తి శరీరముల నుండు నిర్గమించగానే ఆ శరీరము నియమము తప్పక విపంచీకృతమై తమ తమ నిష్పత్తుల ప్రకారము ఆయా భూతముల యందు చేరు చున్నవి. కల్పాంతమున పంచ భూతములో యందలి నాల్గు భూతములు ఐదవది యగు ఆకసమున లయమగు చున్నది. విశ్వ మందలి సమస్త శక్తులు, జలశక్తి, వాయు శక్తి, అయస్కాంత శక్తి, ఉష్ణ శక్తి మొదలుగా గల సకల శక్తులు ప్ర్రాణ శక్తి యందు లయమగు చున్నవి. ఈ ప్రణ శక్తి నాలుగు భూతములను ధరించిన ఆకసస్మను పదార్థమున లయమందూ. మరల సృష్టి ప్రారంభమున పర బ్రహ్మము నుండి ప్రాణ శక్తి వెలువడి సృష్టిని కొనసాగించును. ఈ విధముగా ప్రతీ కల్పకమందును ఒక నియమిత మార్గములో స్సృష్టి జరిగి దానిని పోషించి లయము చేయును.

మన స్థూల నేత్రములకగపడని స్థూల దేహములకు వెనుక సూక్ష్మ శరీరము అనునది ఒకటి కలదు. భౌతిక శరీరమున చర్మము, మాంసము, ఎముకలు, మజ్జి, నరములు, గోళ్ళు, వెంట్రుకలు ఇత్యాది భాగములు కాన వచ్చు చున్నవి. సూక్ష్మ శరీరమున 7200 డెబ్బది రెండు వేలు నాడులు శరీరమంతటను వాయు ప్రసరణకు అనువగు నాడులు వ్వాపించి ఉన్నవి. ఇందు అంతఃకరనము లనబడు మనస్సు, బుద్ధి, అహంకారము చిత్తము అను స్థూల నేత్రమునకు కన