ఏకాదశాధ్యాయము
203
మిథున కర్మ
ఋతుకాలములో భర్తను కలయుట స్త్రీకి విధి.
ఋతుస్నాతాతుయో నారీభర్తారం నోపసర్పతి
సామృతానరకం యాతివైధవ్యం చపునఃపునః.
(ఋతుకాలములోనే స్త్రీ భర్తను పొందదో యామె నరకమునకు బోవును. ఉత్తర జన్మమున వితంతువగును.)
ఈ నియమమే భర్తృ పరముగ గూడ చెప్పబడినది.
ఋతుస్నా తాంతుయో భార్యాం స్వస్థస్సన్నోప గచ్ఛతి
ఘోరాయాంభ్రూణ హత్యాయాంయుజ్యతే నాత్రనంశయః
(పరాశర. 4-15)
(ఆరోగ్యముగ నుండియు గూడ ఋతుస్నాతయైన భార్యను పొందనివానికి భ్రూణహత్యా దోషము వచ్చును.)
ఋతుకాలమనగా రజోదర్శనమైనది మొదలు పదునారు రాత్రులు. అందు మొదటి నాల్గు రాత్రులును, అమావాస్యా పౌర్ణమాసులును చతుర్దశ్యష్టములును విసర్జింప వలసినవి.
ఋతుస్స్వాభావిక స్త్రీణాం రాత్రయష్షోడశన్మృతాః
చతుర్భిరితరైస్సార్థ మహోభిస్సద్వి గర్హితైః
అమావాస్యా మష్టమీంచ పౌర్ణమాసీంచతుర్దశీం
బ్రహ్మచారీ భవేన్నిత్య మప్యృతౌస్నాతకోద్విజః
(మను. 4-128)