24
“ నాకు అప్ప జెప్పనలసినదే మారు మా ట్లాడితిరా రాఖబర్దార్ !
" రామన్న పథాను మాటలకు అదరిపడినాడు. పైగా అతడు పోలీసు అధికారి. ఎక్కున మాట్లాడుటకు ధైర్యము మునుపే లేక పోయెను. పఠాను అతనికంతయు మరల నచ్చ చెప్పినాడు. తానాబాలుని వృద్ధికి తెత్తుననియు ప్రభుత్వము వారి యెద్దతన యావచ్చక్తిని వినియోగించి యుద్యోగ మిప్పింతు నసియు, చెప్పి బాలుని తన వెంట తీసుకొని పోయెను. రామన్న అటు! బాలుడు ఇటు! ఈ చిన్న ఘట్టమే వేంకట రామారెడ్డిగారి జీవితములో అత్యంత ప్రధాన మైనట్టిది.
విలియం వహబు గారికి ఒక తమ్ముడు పరకాల రెడ్డి ఆను సతడుండెను. అతను పక్కా పటేలు. దురుసు మనిషి. షికారు (వేట) అనిస చెవులు కోసువాడు. మంచి మాంసాహారి. తదనుగుణ్యమగు గుణములుగూడ అలవాటు చేసుకొని యుండెను. విద్యలో లోపములేదు. తెలుగు బాగుగావచ్చును ఉర్దూ కూడ బాగుగనే చదువుకొన్నవాడు. అన్నయగు వహబు గారికి తమ్ముని లక్షణములు నచ్చినవి కావు. మిత్రులతో అతని తెంపరి తనమును గురించి పలుమారు చెప్పువారు. తన కేమైన కీర్తి తెచ్చువాడు కలడా యనిన తన కుమారుడు కూడ కాదు. తన మేనల్లుడే అనియు మిత్రులతో చెప్పువాడు.