161
భోజనము కూడ మంచి రాజభోజనము. నానావిధముల కూరలు, రుచ్య పదార్దములు, మున్నగునవి సదా నారిభోజనములో చేరియుండును. తర్వాత అర్ధగంట విశేషించి ఒక గట విశ్రమింతరు. మరల లేచి నాలుగు నాలుగున్నరగంటలసమయములో శ్రీ నిజాం ప్రభువు గారి దర్శనార్ధము వెళ్ళుదురు. అచ్చట అర్ధగంటయో గంటయో ఒక్కొక్కప్పుడు రెండుగంటలో తమ ఏలిక సన్నిధిలో నుండి తెలుప వలసినవి తెలిపి పొంద నలసిన ఆజ్ఞలు పొంది, అభిప్రాయములడిగిన తమకు తోచిన మనవిని గావించి కొని తిరిగి వత్తురు.సాయంత్రము 6 లేక 7 కొట్టిన తర్వాత రెడ్డి విద్యార్థి వసతిగృహమో, బాలికల పాఠశాలా కార్యములో లేక ప్రజాహిత సంస్థల కార్య నిర్వాహక వర్గమందు క్యావిచారణయో చూచుకొని రాత్రి 8 లేక 9 కొట్టు వరకు ఇల్లు చేరుకొందురు. సాధారణముగా, సాయం కాలమలందు నగరము లోని పోలీసునాకాలను పరిశీలించచు వాహ్యాళి వెళ్లదరు. రాత్రి 9 గంటలకు భోజనము పగటివలెనే . తర్వాత పడక గదికి వెళ్ళుదురు కాని అప్పుడే నిద్రపోరు. ప్రత్యేకముగ మఖ్య విషయముల గురించి అవకాశముతో వారితో ముచ్చటించ దల చినవారి కది మంచి సమయము. కొన్ని సమయములలో అనేకుల దేప్రకార మాలోచించుకొని వాటయిఁటివద్ద గుమికూడి