తెనాలి రామకృష్ణకవి చరిత్రము
29
రామకృష్ణకవి లేచి 'మహారాజా! మీరు సకలవిద్యావిశారదులు రాజ్యపరిపాలనా ధురంధరులు కావుననే పద్యమునకు సరియైన వెల నిర్ణయించినారు. ఈ పద్యమును భట్టుమూర్తి వ్రాయలేదు. వేయి దీనారములకు మన తిమ్మనకవిగడ గొనెను. మీరు వేయికిబైన నేమైన నిచ్చినగదా మన భట్టుమూర్తికి లాభము?" అనెను. భట్టుమూర్తి సిగ్గుపడెను.
మఱొకనాడుతిమ్మసకవియింటివద్దనందఱునుగూర్చుండికవితా గోష్ఠి గావించుచుండగా నామార్గమున బోవుచున్న భట్టుమూర్తి వారందఱును వినునట్లు తన శిష్యునుద్దేశించి --
క. వాకిఁట కావలి తిమ్మన
వాఁకిట కవికోటి మాధవా కిటకోటే. '
యని, తిమ్మన వాఁకిటగూర్చుండిన కవులసమూహము పరాహముల సమూహమును బోలియుస్నదను నర్థము వచ్చునట్లు చదివెను. రామకృష్ణుఁ డా దారినిబోవుచు నది విని--
'న. ప్రాకృత సంస్కృత ఘూర్జర
మూకీకృతకుకవితుంగ ముస్తాతతికీస్
వాఁకిట కావలి తిమ్మన
వాఁకిటి కవికోటిమాధవా! కిటకోటే.'
ప్రాకృత సంస్కృత, ఘూర్జర భాషలమిశ్రమముచేసి, కవనము చెప్పునట్టి కుకవులనుతుంగముస్తల పాలిటికిఁ దిమ్మనవాకిటనున్న కవులందరును వరాహములవంటివారేయను భావము వచ్చునట్లు చదువగా భట్టుమూర్తి సిగ్గుపడెను. ,
మఱిరెండు రోజులు గడిచినపిదప, ముక్కుతిమ్మనయొకనాడు తనయింటి చావడిలోఁ గూర్చుండి, ఊయెలలో నుల్లాసముగ నూగుచుండగా రామకృష్ణుఁడేగి 'మామా! ఊతునా! యనెను. ఊయల