40
తెలుంగుమెఱుంగులు
ఈ పద్యమున ననుప్రాసము, నక్షరసౌభాగ్యము, శయ్యయొయ్యార మునుమాత్రమే కాక దాశారుండు = పల్లెలు బోయలు మొదలగువారికిఁ దగినవాడు, వారిలో విహరింపఁదగినవాఁడు, లేక భృత్యతకు, నౌకరీకి తగిన వాఁడు శ్రీకృష్ణుఁడు పూజార్హుడగునా యనియు నాక్షేపము. దాశార్హ పదమునకు రెండర్థము లున్నవి. పల్లెకారీలకుఁ దగినవాఁ డనియు. నౌకరీకిఁ దగినవాఁ డనియు; జెడ్డ యర్థము. దశార్ణదేశభవుఁ డని మంచి యర్ధము. .
'ఇతనికిఁ గూర్తురేని ధన మిత్తు రభీష్టములైన కార్యముల్
మతి నొసరింతు రిష్టుఁ డని మంతురు గాక మహాత్ములైన భూ
పతులయు వీప్రముఖ్యుల సభన్ విధిదృష్టవిశిష్ఠపూజనా
యతికి ననర్హుననర్హుడని యచ్యుతు నర్చితుఁజేయుఁ బాడియే?"
ఇక్కడ ధర్మరాజుతో భీష్ముఁడు అచ్యుతుఁ బూజింపు మనునప్పు
డుపయోగించిన యచ్యుతపదమునే శిశుపాలుఁడు వెక్కిరింపుగా నర్థాంతర
మునఁ బునఃప్రయోగము చేసినట్లు విధిదృష్టవిశిష్ట పూజనాయతికి
ననర్హుడు. ఇట్టి యాయచ్యుతని నర్చితునిఁజేయుట పాడిగాదు అని
శిశిపాలుని భావము. భీష్ముని పలుకులలోని యచ్యుతపదమునకు ఆ
చ్యుతుడు అని అర్ధాంతరము గలుగుట ప్రాచీన వ్యాకరణసంప్రదాయ
సమ్మతము. ఈ పద్యమునఁగూడ నక్షరరమ్యత, యనుప్రాస చమత్కృతి
దైవాటియున్నవి. ఈ శిశుపాలకథాఘట్టమెల్ల శబ్దార్ధ గాంభీర్య కలితమై
రసోత్తరమై యున్నది.
"అవమాన్యున్ సభలోన చూన్యుఁ డనిసౌహార్దంబునం గౌరవ
స్థవిరప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్ తప్పంగఁ బూజించి ర
య్యవివేకాస్పదులైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁగే
శవ! నీవుం గడగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్",