పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయనగరరాజుల కళా విన్నాణం

కాకతీయ రాజ్య పతనానంతరం ఆంధ్రదేశమంతా మహమ్మదీయ దండ యాత్రలకు లొంగి పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ మహమ్మదీయ దండ యాత్రల్ని జయ ప్రదంగా ప్రతిఘటించి, ఆంధ్ర దేశాన్ని మాత్రమే కాక, దక్షిణ హిందూ దేశాన్నంతా ఒకే తాటిమీద నడిపిన ఘనత హంపీ విజయనగర రాజులులకు దక్కింది.

హంపీ విజయనగర రాజ్యాన్ని స్థాపించిన హరి హర రాయలు, బుక్కరాయలు దక్షిణ హిందూ దేశంలోని ఆంథ్ర కర్ణాటక తమిళ ప్రాంతాలన్నిటినీ ఒకే సామ్రాజ్యం క్రింద వ్యవస్థీకరించి నప్పుడే మహమ్మదీయుల దండ యాత్రల్ని జయ ప్రదంగా ప్రతి ఘటించగలమని గ్రహించారు. ఈ ముస్లిం దండయాత్రల వల్ల నానా హింసలూ అనుభవిస్తున్న ప్రజలు కూడ ఈ ప్రయత్నాన్ని బలపరిచారు.

హరిహరుని హంపి:

విజయ నగర సామ్రాజ్య సంస్థాపకులైన హరి హరి హర రాయలు, బుక్క రాయలు అన్నదమ్ములు, ప్రతాపరుద్రుని బందువులు. ప్రతాప రుద్రుని అస్థానంలో వున్న ప్రధానోద్యోగులు. కాకతీయరాజ్య పతనానంతరం వీరిద్దరూ ఆనెగొంది వెళ్ళారు. ఆంధ్ర కన్నడ సరిహద్దులలో మధ్య భాగంలో విద్యానగర పట్టణాన్ని హరిహరరాయలు స్థాపించాడు. ఈ సామ్రాజ్యాన్ని కన్నడ సరిహద్దులలో , తుంగభద్రానదీ తీరంలో సహజ రక్షణ కుపయోగపడే అహ్నేక కొండల వరుసల మధ్యభాగంలో విద్యానగర పట్టణాన్ని హరిహర రాయలు స్థాపించాడు. ఈ సామ్రాజ్యస్థాపనకు మాధవవిద్యారణ్యస్వామి కూడా సహాయపడ్డాడు. హిందూ సంస్కృతీ, మతమూ రక్షింపబడాలనే ఆశయంతో విజయనగర సామ్రాజ్యం స్థాపన 1336 రో జరిగింది. ఈ సామ్రాజ్యం వర్థిల్లిన కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

(1)1336 నుండి 1480 వరకు ప్రథమదశ. ఈ దశలో విజయనగర రాజ్యం కన్నడ, తమిళ ప్రాంతాలనూ, రాయలసీమనూ ఆక్రమించుకున్నది.