పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/804

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జముకుల కథలు:

జముకుల కథ కాకతీయుల కాలంనుంచీ బహుళ ప్రచారంలో వుంది. అలాంటి కళారూపాన్ని తీసుకుని గురుజాడ వ్రాసిన కన్యక గేయాన్ని జముకుల కథగా మార్చిన వ్వక్తి పీసా లక్ష్మణ రావు. విష్టువర్థన మహా రాజు కన్యకను ఎలా చెరపట్టింది, కళింగ దేశంలో రాజు చేసే దురంతాలను వర్ణిస్తూ వ్రాసిన ఈ కథలో ప్రస్తుత రాజకీయ సాంఘిక సమస్యలను జోడించి అత్యుద్భతంగా వ్రాసిన కథను పీసా లక్ష్మణరావు, తొత్తడి సింహాచలం, మిక్కిలినేని, మాచినేని ఉమామహేశ్వర రావుల దళం, కన్యక కథను ఆంధ్రదేశమంతటానే కాక మద్రాసు, విజయవాడ, ఢిల్లీ మొదలైన రేడియో కేంద్రాలలో కూడ ప్రసారం చేయడం జరిగింది.

జంతరు పెట్టె:

ఆంధ్రదేశంలో పర్వ దినాలలో జాతర్లలో, ఈ జంతరు తమాషా చూపిస్తూ పిన్నల్ని, పెద్దల్ని అలరిస్తారు. ఈ కళా రూపాన్ని కోగంటి

పైస తమాష చూడర బాబు
ఏమి లాహెరిగ వున్నదొ చూడు
జంతర్ మంతర్ చూడర బాబు

అనే మకుటాన్ని ఇలా మార్చి వేశారు.

లాయరమ్మ లాయరో - లాయం పెట్టి చూడర బాబు
ఎంత లాయరుగ వున్నదొ చూడు "
భారతదేశపు తీరును చూడు "
నల్లధనంతో సంచులు నిండి "
కొల్లగొట్టిన ఘనులను చూడు "
ధరలను పెంచిన ధనికుల చూడు "
బ్రిటీషు తొత్తుల కుట్రలు చూడు "
గాంధీతాతా బోధలు చూడు "
జిన్నా వేసే ఎత్తులు చూడు "

అంటూ నాటి ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యలకు సంబంధించిన ఎన్నో దారుణాలను ప్రజానాట్యమండలి దళాలు ప్రచారం చేశాయి.