పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/703

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుళ్టులవారు

671



వాళ్ళ దేహాలలెల్ల - ఒట్టి బొమికల గూళ్ళు
పిల్లలూ కట్టుకొన - పీలికల గుడ్దలూ
ఆలసోమపురి లోన - ఆ బీద ప్రజలు
మల్లల్లో కూడ్లేక -మ్రగ్గుతుంటారో

ఇలా ఆనాటి పరిస్థితులనూ, సమస్యలనూ ప్రజలకు ఎరుక పర్చటానికి ప్రాచీన కళా రూపమైన పిచ్చికుంటుల కళా రూపాన్ని ప్రజానాట్య మండలి వుపయోగించిది. పిచ్చుకుంటులవారు ఈ నాటికీ గుంటూరు

జిల్లా రెంటచింతల గ్రామంలో 70 కుటుంబాలు, చెరకుపాలెంలో గ్రామంలో 70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6 , ప్రకాశం జిల్లా టంగుటూరులో 70, వరంగల్ జిల్లా మొగిలి చర్లలో కొన్ని కుటుంబాలవారు నివశిస్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ తగ్గటం వల్ల వేరు వేరు వృత్తుల్ని చూసుకుంటున్నారని కె.వి .హనుమంతరావు గారు ఆంధ్రప్రభ దిన పత్రికలో వివరించారు.

వారిలో వచ్చిన మార్పు:

ఆంధ్రదేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటుల వారు భామా కలాపం, గొల్ల కలాపం నేర్చుకున్నట్లు కూడా ఉదాహరణలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుమార దేవం గ్రామ వాస్తవ్యులు పల్లం పట్ల రామయ్య గారు, కోవూరు తాలూకా బందపురంలో నున్న పిచ్చుకుంట్లకు భామా గొల్ల కలాపాలను నేర్పారు.

బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ధహస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణగారి భామ వేషం అద్భుతంగా వుండేదట.

పై ఉదాహరణలను బట్టి పిచ్చుకుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది.