పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రజల మధ్యలో పగటి వినోదం:

ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత్ర కథా విధానం, పగటి పూట ప్రజల మధ్యనే జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లోనే జరుగుతుంది. కథా కాలం కనీసం అరగంట సేపు ఉంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు మ్రోగించుకుంటూ నడి బజారులో కావడి దించి, కథకుడు కథను ప్రారంభిస్తాడు. పిల్లా జల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్దవాళ్ళు ఆతరువాత స్త్రీలూ అందరూ కావడి చుట్టూ మూగుతారు.

ఆ రోజుల్లో కాశీ క్షేత్రాన్ని సందర్శించడమంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినట్లే. ధనవంతులు తప్ప ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించలేకపోయేవారు. ఈ చిత్ర కథావధానం ద్వారా, వారు కాశీక్షేత్రాన్ని చూసి నట్లే అనుభూతి చెందేవారు.

కథాంతానికి అందరూ రస సిద్ధిని పొందే వారు. ఆధ్యాత్మిక చింతనతో, తృప్తి పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్టచెప్పేవారు.

ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీథికి బయలుదేరేవాడు. వీ బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి అతి సుందరంగా వుంటాయి. అవి బందరు కలంకారీ బొమ్మల రంగుల్లో వుంటాయి.

బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజనులందరికీ ఈ కథావిధానం సుబోధకంగా వుండేది. వీరు కేవలం కాశీ మహత్తునే కాక ఆ యా జాతుల మతాల వారి దేవతలను గురించి దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆనాడు ఈ చిత్ర కథా విధాన్నాన్ని కాశీకావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భక్తి "శ్రద్దలతో చెప్పే వారు. వినే వారు కూడా అలాగే వినే వారు. అయితే రాను రాను ఈ కళారూపం భక్తినీ, ముక్తినీ ప్రభోధించేకంటే భుక్తికే ప్రాధాన్య మిచ్చి వ్వాచక వృత్తిలో దించేశారు.

కాశీకి పోయాను రామాహరి:

కాశీ కావడి కళారూపం ఈనాడు అంతగా ప్రచారంలో లేక పోయినా, అక్కడక్కడా ఈ కావడి ప్రదర్శనంతో బ్రతుకు తున్న వారు కూడా కనిపిస్తారు.

బ్రాహ్మణ వేషాలతో కావడిని మోసుకుంటూ బజారున పడి కాశీకి పోయి వచ్చామనీ, గంగతీర్థం తెచ్చామనీ, కాశీవిశ్వేశ్వరుని పటాలు చూపిస్తూ