పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శివరాత్రి


శివకొండకని పోదాము రారమ్మ
మల్లయ్య కొండ స్వామినే చూతాము
శివాపురమికి పరమటంట
శిద్దులేలే మల్లయ్య కొండ

కొండ పైన దేవళంబు
కొండ దిగువున మందిరంబు
మందిరంబులో వెలిగేటి
మల్లికార్జునుడున్నడంట
ఒంటి స్థంభము మాలలోన
ఒక్కడే మల్లయ్య నిలిసె.

ఇలా మహాశివుని వర్ణిస్తూ, ప్రయాణ అలసటను మరచి పోతూ భక్తి భావంతో పాడుకుంటూ చివరగా మంగళం పాడతారు గొరవయ్యలు. అందరికీ బండారు కుంకాన్ని అందచేస్తారు.

గొరవయ్యల నృత్యాన్ని చూస్తున్నప్పుడు పిల్లలు భయపడుతూ వుంటారు. కాని పెద్దలు వారిని ఎత్తుకుని ఒడిలో కూర్చో పెట్టుకుంటారు. పిల్లలు మాత్రం కళ్ళు మూసుకుని, అప్పుడప్పుడు చూస్తూ వుంటారు. డమరుకాల ధ్వని గుండెలు అదిరేలా వుంటాయి. పెద్ద గొరవయ్యలు, చిన్న గ్తొరవయ్యలు కలిసి చేసే నృత్యం అబ్బురంగా వుండి అందరూ చప్పట్లు చరుస్తారు. ప్రతి ఇంతికి వెళ్ళి యాచించి వారిచ్చిన ధాన్యాన్ని తీసుకుని, బండారు బొట్టు పెట్టి పోతూ వుంటారు. ఇలా గొరవయ్యలు బ్రతుకుతూ, ఆ కళను బ్రతికి స్తున్నారు.

అలా బ్రతికించే కళాకారులు, గొరవ రామాంజనేయులు __ గొరవ కాటమయ్య__ గొరవ చిన కాటమయ్య మొదలైన వారు ప్రముఖంగా పని చేస్తున్నారు.