పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోమం శతకంఠ రామాయణం, కుశలాయకం మొదలైనవీ, శివ గాథలూ, గంగా వివాహం, సారంగధర చరిత్రా రాణిస్తూ వుంటాయి.

ప్రాతీయ కళారూపం:

హరిహరీ పదాలు ఎక్కువగా విశాఖ జిల్లాలోనే ప్రచారం పొందాయి. ఇతర జిల్లాలకు ఏమాత్రం వ్వాపించలేదు. అందుకు కారణం కూడ లేకపోలేదు. విశాఖ మండల ప్రాంతీయ భాష మనలకు చాల భిన్నంగా వుంటుంది. వారి మాట తీరు ప్రత్యేకంగా అదోలా వుంటుంది. మాండలికమైంది. అందువల్ల ఆ పదాలు ఇతరులు వ్రాయడం కూడ కష్టమే అందువల్ల ఆ మండలం వారే వారి ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే శైలిలో వ్రాస్తారు. ఇప్పటికీ వ్రాయబడిన పదాలన్నీ కూడ అటువంటివే. చీపురుపల్లి _రాజా _ పాలకొండ _ వీరఘట్టాం ఆముదాల వలస, శ్రీకూర్మం, విజయనగరం, శ్రీకాకుళం, మొదలైన ప్రాంతాల్లో ఈ కథలను రకరకాలుగా చెపుతారు. అన్ని కళా రూపాల కన్న ఈ హరిహరీ పదాలు - జముకుల కథలు ఎక్కువ ప్రచారంలో వున్నాయి.

ఈ హరిహరీ పదాల విషయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు గారు ఎక్కువ కృషి చేసి వ్రాశారు. కిన్నెర పత్రికలో వారి అనుభవాల నుంచీ సేకరణల నుంచీ కొన్ని ఉదహరిస్తాను.

మనకు దొరికే పదాలన్నీ ఇటీవలవే కాబట్టి, ఇవన్నీ చాలవరకు ఆధునిక పదాలు. ఈ పదాల వరుస లక్షణం ఒకటే. ఈ రకం పదాలలో స్వకపోల కల్పితాలు ఇంచు మించుగా నున్న ఇవన్నీ ఇతర రచనలను చూచి రచించినవేననీ, దీనికి కారణం చదువుకున్న వారు పురాణాలను ప్రబంధాలను చదివి ఆనందించగలరనీ నిరక్షరాస్యులకది సాధ్యం కాదనీ, కాబట్టి వీరి అంతస్తుకి తగిన రచనలు అవసరమనీ అందువల్ల జానపద కవులు ప్రాకృత జనుల కోసం పెద్ద గ్రంథాలలోనికి కథలనూ, భావాలనూ అనుసరించి పదాలుగా రచించారనీ, తామూ అలాగే చేస్తున్నామనీ కొందరు కవులు తెలియచేసారనీ కామేశ్వరరావు గారు అంటు కొందరు కవులను పేర్కొన్నారు. అందుకు వుదాహరణగా పూరి రామచంద్రరాజు కుశలాయక పదాన్ని వివరించారు.

కఠినంబు కాంచితే, కాపులకు తెలియది
మరుగులుంచుట మాన మాటలుంచితిని

అని అన్నాడు.