పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలమైన స్థలంలో రామాయణానికి సంబంధించిన సన్నివేశాల ననుసరించి సినిమా సెట్సు మాదిరి, రావణాసురుని లంక, అయోధ్య, కిష్కింధ, ఇలా వేరు వేరు భాగాలను కట్టెలతో మంచెల్లాగా నిర్మిస్తారు.

ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహపరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గాన చేసి, ఉదయం శ్రీరాముని పట్టాభి షేక మహోత్సవం చేస్తారు.

ఈ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతారాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీత ఒడిలో పెట్టి,దేవతా మూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈనాడు

చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆదరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంట, వీణ వంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాటికి పని చేస్తున్నాయి.