తెలుగు విశ్వవిద్యాలయం, ఈ ప్రచురణ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు 123 గ్రంథాలను వెలువరించింది.
ప్రస్తుత గ్రంథం తెలుగు వారి జానపద కళారూపాలు.
నన్నయకు పూర్వంనుంచే తెలుగునాట బహుళ ప్రచారంలో వున్న జానపద కళారూపాల గురించి సమగ్రమైన అవగాహనతో రచించిన గ్రంథమిది.
తెలుగు నాటకరంగాన్ని గురించి, నటరత్నాల గురించి, లోగడ విలువైన గ్రంథాలు వెలువరించిన డా॥మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, తమకున్న పరిణతానుభావం ఫలితంగా ఈ రచనను రూపొందించారు.
నలభై ఏళ్ళకు పైగా జానపద కళారంగంలో మిక్కిలినేని గారు చేసిన సాధన, పరిశోధన, నిజానికి 800 వందల పుటల్లో ఇమిడేది కాదు.
అయితే కొన్ని అంశాలను క్లుప్తంగా వివరిస్తూ అన్ని కోణాలను ఉల్లేఖిస్తూ ఈ బృహత్ గ్రంథాన్ని రచించారు.
ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల కళారూపాలకు సంబంధించిన విశ్లేషణ ఇందులో ఇమిడి వుండటం విశేషం
ఈ పరిశోధన గ్రంథం జానపద కళాభిమానులకే కాకుండా, తెలుగు విశ్వ విద్యాలయంలో జానపద కళల శాఖ విద్యార్థులకూ విశేషంగా ఉపకరిస్తుంది.
విషయపుష్టమైన ఇంత చక్కని గ్రంథం రచించి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణగా వెలువరించే అవకాశం కలిగించిన డా॥మిక్కిలినేనిగారికి కృతజ్ఞతలు.
యథాపూర్వకంగా ఈ ప్రచురణ కూడ అందరి ఆదరాభిమానాలు చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.
హైదరాబాదు 3..1..92 |
ఆచార్య |