పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

జానపదకళారూపాలు

పోయినట్లు పోయి మాయమై తిరిగి కనిపించి అక్కడ చిత్ర విచిత్ర మైన విద్యల్ని ప్రదర్శించే వాడట.

ఈ విద్యను ఇంగ్లీషు వారు రోప్ ట్రిక్ అనేవారట. ఈ విద్యను గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.

కొరవి గోపరాజు:

ఒక ఇంద్రజాలికుడు తన భార్యను వెంట బెట్టుకుని రాజ సన్నిధిలో ఆమెను రక్షణార్థం విడిచి తాను దేవ సహాయార్థమై యుద్ధం చేయడానికి వేళుతున్నానని చెప్పి ఒక త్రాటిని పైకి నిలువుగా దానిని నిలబెట్టి, దానిపైకి ఎగబ్రాకి మాయ మయ్యాడట. తరువాత కొంత సేపటికి వాని కాళ్ళూ, చేతులూ, తల,మొండెం తుంపులై క్రిందబడ్డాయట. రాజు వద్ద రక్షణగా వుంచిన అతని భార్య రాజును వేడుకుని సెలవుపొంది, భర్తతో సహగమనం చేసిందట. వెంటనే త్రాడు పైకి పోయిన ఇంద్ర జాలికుడు పైనుండి దిగి వచ్చి తన భార్యను పంప మన్నాడట. అంతట రాజు విచార గ్రస్తుడై ఆమె సహగమనం చేసిందని చెప్పాడట. అంతట అతను__

ఇంద్ర జాల విద్యలు:

ఆ వీరుడప్పుడె నిజ
భావము ప్రకటముగ
నాత్మభామిని తోడన్
దావైతాళికు డగుచున్
గైవారము చేసె జనులు కడువెరగందన్
నరనాథ, నిన్ను నపుడవ
వరమడిగినాట నైంద్రజాలికు రీతిన్