పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పసుపును పచ్చగ చేస్తాను బాబయ్యా
ఇది అమ్మోరు సత్తెమండి.

ఇది మజ్జిగండి. మజ్జిగను చల్లచేస్తది బాబయ్యా. ఇదిగోండి ఇది పిడక కచ్చికండి. ఈ కచ్చికను బూడిద చేస్తంది బాబయ్యా. అమ్మోరు సత్తెం చూడండి. మల్లేలా, మల్లేలా.

అంటూ వీరభద్ర కొరడాతో గిఱ్ఱున తిరుగుతూ, భీకరాకారంగా నృత్యం చేస్తూ పెళపెళా మని కొరడా నాదములు భయంకరంగా మ్రోగిస్తూ గిరు గిర్రున త్రిప్పి, మోదుకుంటూ పాత గాయాలను పగుల గొట్టి, రక్తాని చిందించే వారు. ఆ దృశ్యాన్ని చూచిన ప్రేక్షకులు భయపడి ఇది అచ్చం అమ్మవారి సత్య మనుకుని తోచిన ధర్మం చేసేవారు.

ఔరా అనిపించే మంత్ర తంత్రాలు;

ఇంకా వేపాకులు దూసి తేళ్ళనూ మండ్రకప్పలనూ ప్రవేశపెట్టేవారు. పొడి ఇసుకను నీళ్ళలో వేసి మరలా పొడి ఇసుకను తీసేవారు. తడి బట్టను ఆరబెట్టి అందులో జొన్న గింజలు జల్లితే పేలాల వలె వేగేవి. కొబ్బరి కాయను నేల మీద పెడితే కొంత దూరం దానంతటది నడిచి వెళ్ళేది. ఒక రూపాయను వంద రూపాయలుగా ప్రత్యక్షం చేసి చూపించేవారు.

ఈ విధంగా కనికట్టూ, హస్తలాఘవం ద్వారా ఆయన దేవర వేషం పూర్తి అయ్యేది. ఈ వేషం గ్రామంలో సంచారం చేసేది కాదు. గ్రామం మధ్యన పెద్ద బజారులో రచ్చ బండ వద్ద జరిగేది. ఈ విధంగా వీరయ్య గారి బృందం ప్రదర్శనాలు భారి యెత్తున జరిగేవి. వారి ప్రదర్శనాల్లో ఇంగా చెప్పుకో తగింది భోగం మేళం.

అర్థనారీశ్వరి:

అర్థ నారీశ్వరి పగటి వేషాన్ని ధరించటంలో కూచిపూడి వారు బహు ప్రసిద్ధులు. దశావతార చరిత్రలో స్త్రీలు ఆర్థ నారీశ్వరి వేషం ధరించి నట్లు, ఈ క్రింది పద్యం వర్ణను బట్టి తెలుసు కోవచ్చును.