పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తంజావూరులో జిక్కిణి వెలుగు:

విజయరాఘవ నాయకుని ఆస్థానంలో యక్షగానం ఒక సుందర కళారూపమై వర్థిల్లినట్లు "జిక్కిణి" నాట్యం కూడ గీత ప్రబంధాలలో ప్రసిద్ధి చెందినట్లు క్రీ॥శ॥ 1500 - 1550 ప్రాంతాల్లో వెన్నెల కంటి సూరన రచించిన "విష్ణు పురాణం" లో జిక్కిణిని ఒక వర్ణ విశేషంగా పేర్కొన్నాడు.

అలాగె తంజావూరు మహారాష్ట్ర ప్రభువైన, "శహాజీ" క్రీ॥శ॥ 1684 - 1712 ప్రాంతాల్లో రచించిన "చిత్ర ప్రబంధం" లోనూ

మధుర విజయరంగ చొక్కనాథనాయకుని ఆస్థానంలో క్రీ॥శ॥ 1706 - 32 లో వెలసిన తిరుమల కవి రచించిన "చిత్రకుంట మహత్యం" లోనూ జిక్కిణి దరువులు ఉదహరింప బడ్డాయి.

అలాగే కూచిపూడి వారి నాత్య పద్ధతుల్లో "జక్కిణీ" దరువు కూడ యక్షగానంతో పాటు ప్రాముఖ్యం వహించి నట్లు తెలుస్తూవుంది.

జక్కులవారే అసలు యక్షగాన ప్రదర్శకులైనట్లు "క్రీడాభిరామం" లో "కామవల్లీ మహాలక్ష్మి కైటభారి" వలపు బాడుచు వచ్చె జక్కుల పురంద్రి అని,

ఆ కామవల్లియే, కామేశ్వరీ పాటలోని కామేశ్వరి యనీ, ఆ కామేశ్వరి కథను క్రీ॥శ॥ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు "క్రీడాభి రామం పీఠికలో వివరించినట్లు, యస్వీ జోగారావు గారు తమ యక్షగాన వాఙ్మయం"లో వివరించారు.

ఈ కథలో మహాలక్ష్మి శాపం వల్ల పార్వతికి సద్వోగర్భాన సప్త కన్యలు ఉద్భవించి నట్లూ అందులో ఒక కన్య పేరు "జక్కులమ్మ" అనీ అందరికంటే చివరిదీ చిన్నదీ "కామవల్లి" అని తెలుస్తూ వుంది.

ఆ సప్తకన్యలనే "అక్కలు" లేక అక్క దేవతలనీ అంటారు. యక్షులు శివాజ్ఞవల్ల వంశపారంపర్యంగా కామవల్లిని కొలుస్తారు. వారే జక్కులనీ, శివుడు వారికి వాద్య ప్రదానం గావించాడనీ ఐతిహ్యం వుంది.