పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

జానపదకళారూపాలు


ప్రమథ పురాతన పటు చరిత్రముల
గ్రమంద బహు నాటకములాడు వారు, అనీ

అలాగే క్రీడాభిరామంలో,

లెస్సగాగ కిరాట యీలేమ చరిత
మాడుదురు నాటకంబుగ నవనిలోన

అనీ విస్పష్టంగా చెప్పటం వల్ల పూర్వం ఎదో ఒక విధమైన నాటకాలాడేవారని నిర్థారణ అవుతూంది. అయితే అవి ఎలాంటి నాటకాలు? అని మనం తెలుసు కోవాలంటే ఈ నాడు కోకొల్లలుగా దొరుకుతున్నయక్షగానాలే ఆనాటి తొలి నాటకాలని చరిత్రకారుల అభిప్రాయం.

ఇంతకీ యక్షులెవరు?

ఇంతకీ యక్షు లెవరో తెలుసుకోవాలనుకుంటే మనకీ క్రింది ఆధారాలు లభిస్తున్నాయి. బౌద్ధ, జైన, బ్రాహ్మణ సారస్వతాలలో "యక్షులను" దేవతాగణంగా పేర్కొన్నారు. వారు నీతి ప్రవర్తకులనీ, కామరూపులనీ, శూరులనీ, జిజ్ఞాసకులనీ వివరించారు.

ప్రారంభంలో వారి నివాస భూమి సింహళమనీ, వారి రాజు కుబేరుడనీ, బలి చక్రవర్తి సేనాని సుమాలి ఈ యక్షులను ఓడించి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, మరికొన్ని గ్రంథాలలో రావణుడు లంకను జయించి కుబేరుని వెడలగొట్టి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, వివరింప బడింది.

ఓడిపోయిన కుబేరుడు దక్షిణ భారతదేశానికి తన అనుయాయులతో వలస వచ్చాడనీ, చెపుతారు.

యక్షులు "అక్షసీ" నదీ ప్రాంతంవారో లేక "గూచి" అనబడే మంగోలియన్ లో అనీ.

కీ॥శే॥ సురవరం ప్రతాపరెడ్డి గారు తమ అంధ్రుల సాంఘిక చరిత్రలో తమ ఆభిప్రాయం వెలిబుచ్చారు.

ఈయక్షులు ఎవరైనా,

... మేళము గూడి పాడుచుందురు. దిక్పాల సభల (అని పారిజాతాపహరణం)లోనూ.