నాల్గవ ప్రకరణము.
357
లక్ష్మీనరసింహముగారు కోపమువచ్చినప్పుడు తొందరపడి యనాలోచితముగా పనిచేయువారయినను, స్వభావముచేత శాంత సమయమునందు న్యాయముచేయుటయందే దృష్టిగలవారు. ఇప్పు డాయన యెటుచేయుటకును పాలుపోని విషమావస్థయందు తగులుకొనియుండిరి. సమాజమువారి నిర్ధారణానుసారముగా తనతోఁజేర్చుకొన్న ధర్మకర్తలకు వ్యతిరిక్తముగా న్యాయమార్గమునకు మరలు నంతటి ధైర్యము కలవారు కాకుండిరి. ఈ యధిక ధర్మకర్తలన్ననో సామాన్య లాభము నిమిత్తము స్వలాభమును వదలుకొను నంతటి యవివేకులు కానందున వారు సూచింపఁబడిన యేర్పాటునకు వచ్చుట యసాధ్యము.
1888 వ సంవత్సరము అక్టోబరు నెల 17 వ తేదిని కోదండరామయ్య గారి ద్వితీయ వివాహము జరగినది. క్రొత్తగానియ్య నక్కఱలేక యీయన కిల్లీవఱకే యుండెను; నగలును ప్రథమభార్యవే యుండినవి. ఈయన సమాజముతోడి సంబంధములేక తనవివాహమును తాను స్వతంత్రముగా చేసికొనెదనని చెప్పినను, కార్యదర్శియొద్ద బదులని పుచ్చుకొని మరల తీర్పని రు 75 ల సమాజ ధనముతోనే వివాహవ్యయములు నడచినవి; సమాజమువారి వంట బ్రాహ్మణుఁడును పురోహితుఁడును వంటను వివాహతంత్రమును నడపిరి. తన వివాహమును తానే స్వతంత్రముగా చేసికొంటినని వ్రాసి లక్ష్మీనరసింహము గారి ద్వారమున సభాపతి మొదల్యారిగారు పెండ్లియొకటికి సమాజమున కిచ్చెదమని వాగ్దానముచేసిన నూఱురూపాయలును కోదండరామయ్యగారే తెప్పించుకొనెను; రామచంద్రయ్యరు గారిచ్చెడు నూఱు రూపాయలును తనకే పంపుమని వ్రాసెనుగాని యాయన తన సహాయధనమును సమాజమునకే యిచ్చెను.
తన యింటిలోని యొక భాగమునకు గోదావరివఱదచేత కొంతచెఱుపు కలిగిన తరువాత రామకృష్ణయ్యగారి మరణశాసనానుసారముగా మూడు భాగములుగా నుండిన యింటిని రెండుభాగములుగా ఆత్మూరి లక్ష్మీనరసింహము