నాల్గవ ప్రకరణము.
351
ఆయిండ్లను పంచి పెట్టుటకు కార్యనిర్వాహక సంఘమువారు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారిని నియమించిరి. ఆవఱకే రెండుభాగములుగానున్న పులవర్తి శేషయ్యగారుండిన యిల్లు పంచిపెట్టవలసివచ్చినప్పుడు చావడి యరుగు తన భాగములోనిదని రాచర్ల రామచంద్రరావుగారును, తన భాగములోనిదని శేషయ్యగారును, తగవుపెట్టఁగా సమాజమువారేఁ బదిరూపాయలు రామచంద్రరావుగారికిచ్చి యరుగు శేషయ్యగారికిప్పించిరి. ఆవఱకు మూడుభాగములుగా నుండిన కోదండరామయ్యగారుండిన యిల్లు కోదండరామయ్య గారును చేబోలు వెంకయ్యగారును కాపురముండిన భాగము లాప్రకారముగానే యుంచఁబడి నడిమిభాగము రెండుగా విభాగింపఁబడి కోదండరామయ్యగారి యింటితోఁగలిసిన దక్షిణభాగము కోదండరామయ్యగారికిని, వెంకయ్యగారి యింటితోఁగలిసిన యుత్తరభాగము వెంకయ్య గారికిని, పంచియియ్యఁబడినవి.
ఈలోపల సమాజమునకు కొన్ని విపత్తులు సంభవించినవి. 1888 వ సంవత్సరము ఏప్రిల్ నెల 19 వ తేదిని ద్వితీయ వివాహవరుఁడైన రామచంద్రరావు లోకాంతరగతుఁడయ్యెను; ఆనెల 28 వ తేదిని చతుర్థవివాహవరుఁడైన శేషయ్య భార్య శేషమ్మ పరలోక గతురాలయ్యెను; ఆమాసమునందే ప్రథమ వివాహవరుఁడైన గోగులపాటి శ్రీరాములు క్రైస్తవమత ప్రవిష్టుఁడయ్యెను. శ్రీములుగారికిని భార్యకును పడక పోయినట్లును తన్ని మిత్తమయి 1882 వ సంవత్సరము సెప్టెంబరునెలలో గవర్రాజుగారిని విశాఘపట్టణము పంపినట్టును వెనుక నే చెప్పఁబడెను గదా ! అప్పుడాయన చేసిన సంధి కొన్ని మాసములే నిలిచినది. శ్రీరాములుగారి భార్యను తీసికొని యామెతల్లి 1883 వ సంవత్సరము జనేవరు నెలలో తనయూరికి కొనిపోవలెనని రాజమహేంద్రవరమునకు వచ్చెను. నేను తల్లిని కూకలువేసి యామెను స్వగ్రామమునకుఁ బంపివేసి కూఁతును నాయొద్దనే యుంచుకొని శ్రీరాములుకు వ్రాసి సమాధానపఱిచి యాచిన్న దానిని మరల గవర్రాజుగారి వెంట భర్తవద్దకు విశాఖపట్టణము పంపితిని. ఆయన కొంతకాల మక్కడనుండి వధూవరు లిద్ద