పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

347



నిరూపించుచున్నారు. తానుగూడ స్వయముగా నుండఁగా 1887 వ సం 22 వ జనేవరున జరగిన సామాన్య సభయందు చేయఁబడిన నిర్ధారణముల ననాదరించి లక్ష్మీనరసింహము గారు సమాజముపట్ల నిట్లు వ్యవహరించెడి పద్ధతి నేల చేకొన్నారో సంఘమువారు తెలిసికొనఁ గోరుచున్నారు.)

ఇది యిట్లుండఁగా కార్యనిర్వాహక సంఘమువారొక కోమటి వివాహము జరగ నున్నప్పుడు 1889 వ సంవత్సరము ఫిబ్రవరి 3 వ తేదిని జరగిన సభలోఁ జేయఁబడిన యీక్రింది నిర్ధారణమును,

"2. That the trustees of Mr. Pida Ramakrishniah's fund be requested to contribute Rs. 50 for the celebration of the proposed Banya Marriage." (ఉద్దేశింపఁబడిన కోమటి వివాహమును జరుపుటకు రు. 50 లు సాయముచేయుటకయి పైడా రామకృష్ణయ్య గారినిధిధర్మకర్తలు ప్రార్థింపఁబడుచున్నారు.)

ఆ సంవత్సరమే మెయి నెల 25 వ తేదిని జరగిన తమ సభలో చేయఁబడిన యీక్రిందినిర్ధారణమును,

"5 That the trustees of the P. R. W. M. Fund be requested to pay from the first July the salaries of the priest and cook out of the interest of the said fund, as the association cannot find means to pay them." (వారిజీతము లిచ్చుటకు సమాజమువారు ధనమును బడయఁజాలకున్నారుగనుక, పురోహితునియొక్కయు వంటబ్రాహ్మణునియొక్కయు జీతములను పూర్వోక్తనిధియొక్క వడ్డిలోనుండి జూలయినెల మొదటి తేదినుండి యిచ్చుటకు పైడారామకృష్ణయ్య వితంతువివాహనిధిధర్మకర్తలు కోరఁబడుచున్నారు.)

ఇటువంటి వంటివే మఱికొన్ని నిర్ధారణములను, లక్ష్మీనరసింహముగారికి పంపిరిగాని యాయన దేనిని సమాదరింపలేదు. రామకృష్ణయ్యగారు తన మరణ