పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

స్వీయ చరిత్రము.



స్వల్పవిషయములను గూర్చి మిత్రులు గానుండినవారు రచ్చ కెక్కితగవులాడుట ధర్మముకాదనియు, ఈయంతఃకలహమువలన ప్రతిపక్షులకు మఱింతలోకు వగుననియు, మేముపూనినమహాకార్యములకు నష్టముకలుగుననియు, అనేకవిధములమాకు హితబోధచేసి మమ్ముసమాధానపఱుపపాటుపడిరి. తానుతొందరపడి చేసినపనికిక్షమార్పణము చేయుట కాయనయొప్పుకొనెను. మిత్రులందఱును నొకచోటసమావేశమయి మిత్రసమక్షమున లక్ష్మీనరసింహముగారి చేత వివేక వర్థనీ దహనవిషయమయి జరిగినదానికి చింతిల్లుచున్నా ననియు దాని నిమిత్తముక్షమార్పణము వేఁడుచున్నాననియు చెప్పించెదమనియు జరగినదానిని మఱచి పోయిదానినంగీకరించి మరల యథాపూర్వముగా మిత్రభావముకలిగి యుండవలసినదనియు మధ్యవర్తులయిన స్నేహితులునాతోఁజెప్పిరి. నేను మొదటినుండియు పట్టినపట్టువిడువని మూర్ఖస్వభావముకలవాఁడనగుటచే లిఖితపూర్వకమైనక్షమార్పణముచేసినఁ గాని సంధిపొసఁగ నేరదని నేను స్పష్టముగాఁ జెప్పితిని. ఇట్లు మమ్ముల నుభయులను సమాధానపఱిచి సంధిచేయపాటుపడిన వారిలో ముఖ్యులు మహారాజశ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు. కొంత కాలమీవిధముగారాయబారములు జరగినపిమ్మట కడపట లక్ష్మీనరసింహముగారు 1886 వ సంవత్సరము 6 వ ఆగస్టు తేదిని ఈ క్రిందక్షమార్పణలేఖను బంపిరి. -

"మహారాజశ్రీ శ్రీవివేకవర్ధని పత్రికాధిపతిగారికి

అయ్యా !

మార్చి నెల 11 తారీఖుగల వివేక వర్థనిలోనిహాశ్యసంజీవనియందునుండు సంగతులు ఒక్కరివిషయమయి ఉద్దేశించివ్రాయబడినట్టునాస్నేహితులు కొందఱునాతో చెప్పినమీదట ఆగ్రహమువచ్చి మెయి నెల 9 తారీఖున సదరు వివేకవర్ధని దగ్ధవిషయమయి జరిగించినపనికి విచారిస్తూవున్నాను. మరిన్ని అప్పుడునానవుకర్లు కొందరు మిమ్మునదూషించినట్టు మీరుతెలియచేసినారు