పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

స్వీయ చరిత్రము.



ఆమఱునాఁడనఁగా 1886 వ సంవత్సరము జూన్ నెల 27 వ తేదిని జరగిన సమాజకార్యనిర్వాహకసంఘమువారి సభలో-

"4. That the secretary, N. Subbarau Pantulu, be authorized to present the will of P. Ramakrishniah Garu before the Sub Registrar of Rajahmundry." (పీ. రామకృష్ణయ్యగారి మరణ శాసనమును రాజమహేంద్రవర సహాయ లేఖ్యారూఢాధికారి ముందర్పించుటకు కార్యదర్శియైన ఎన్. సుబ్బారావు పంతులుగారి కధికారమియ్యఁబడినది.)

అని మిగిలియున్న రెండవ మరణశాసనమును లేఖ్యారూఢము చేయించుటకై నిర్ధారణము చేయఁబడినది. ఈనిర్ధారణముక్రింద న్యాపతి సుబ్బారావు పంతులుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహముగారును, నేనును, సోమంచి భీమశంకరముగారును, బసవరాజు గవర్రాజుగారును, మాకర్ల వెంకటసుబ్బారావు నాయుఁడుగారును, వ్రాళ్లుచేసితిమి. ఈసభలోనే పెద్దాపురము పోవుటకు ప్రయాణవ్యయముల నిమిత్తము కోదండరామయ్యగారు చేసిన విన్నపము నిరాకరింపఁబడెను. ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారి పదివేలరూపాయల మరణశాసనమును లేఖ్యారూఢార్థమియ్యక పోవుటకును, ఇయ్యక పోవలెనని నిశ్చయించుకొన్నను పైకి చెప్పక లేఖ్యారూఢము చేయింపవలసినదని కార్యనిర్వాహక సంఘమువారు చేసిన నిర్ధారణము క్రింద వ్రాలుచేయుటకును గల కారణము కొంత వివరింపవలసియున్నది. సత్య ప్రకటనార్థమయి నే నీవివరములు చెప్పవలసివచ్చినందున కెంతయు చింతిల్లు చున్నాఁడను. నేను నాలవ తరగతియందు చదువుకొనుచుండినప్పుడు రాజమహేంద్రవరమున దొరతనమువారి మండల పాఠశాలలో ద్వితీయోపాధ్యాయుఁడుగా నుండిన యాయనయొద్ద మాపాఠములు కొన్ని జరుగుచుండుట చేత నాకాయన గురువు; ప్రియశిష్యుఁడనగుటచేత నాకాయన బ్రహ్మసమాజ సిద్ధాంతములను బోధించుచు, నేను మాయింట చేసెడి విద్యార్థుల సభలకు వచ్చుచు, నన్ను ప్రోత్సాహపరుచుచుండెడివారు. నాయందాయన కప్పు