270
స్వీయ చరిత్రము.
నేని వెంకయ్యగారు; ఇతఁడు మొదట చిన్న యుపాధ్యాయుఁడుగానుండి పిదప కరణమయ్యెను.
వివాహనిమిత్తము చెన్నపురికిఁగొనిపోఁబడి వివాహము జరగక మరల తీసికొని రాఁబడిన తణుకు చలపతిరావుగారి మఱదలొకతె యింకను వివాహముకాక నిలిచియుండెను. ఆచిన్న దానినిచ్చి వివాహముచేయుటకయి మంగళగిరి కృష్ణమూర్తియను మాధ్వబ్రాహ్మణబాలుని విద్యచెప్పించుచు నేను సంసిద్ధుని చేసియుంచితిని. అతఁడు మాయింట నేయుండి ప్రవేశపరీక్షతరగతిలో చదువుచుండఁగా, ఆఱు నెలలకు పదుమూడేసి రూపాయల చొప్పున రెండుసారులు పాఠశాలజీతమిచ్చి, బట్టలు పుస్తకములు మొదలైన విచ్చి, స్ఫోటకము వచ్చినప్పు డిరువది రూపాయలు కర్చు పెట్టి, వివాహమున కేర్పాటుచేసినప్పుడు చిన్న దానితల్లి స్మార్తురాలయిన తన కొమారితను మాధ్వునకియ్యనని యాసంబంధమును నిరాకరించెను. తరువాత నాచిన్నవాఁడు ప్రవేశపరీక్షలో మొదటి తరగతియందు కృతార్థుఁడయి, పిలిచి పిల్లనిచ్చిన స్వజాతి కన్యను పరిణయమయ్యెను.
చిన్న దానితల్లి తన కొమారితకు వరునిగా కొమ్మరాజు గోపాలమను పేరుగల స్వశాఖవాఁడైన యొక నియోగిబ్రాహ్మణబాలుని నావద్దకు తీసికొనివచ్చి వివాహముచేయుమని యడిగినది. అతఁడు చదువుకొన్న వాఁడు కాఁడు; అల్లరిగాతిరిగి తల్లిదండ్రుల మాటవినక లేచివచ్చినవాఁడు. ఈ హేతువులను బట్టి నేనాతనికి వివాహముచేయనని నిరాకరించితిని. అందుపైనామె ఆత్మూరి లక్ష్మీనరసింహముగారియొద్దకు వెళ్లి, ఆయన యొద్దనుండి శ్రీపైడా రామకృష్ణయ్యగారి కుత్తరము పుచ్చుకొని వరునితోడఁగూడ కాకినాడకు వెళ్లెను. అప్పుడు రామకృష్ణయ్యగారు నాకిట్లువ్రాసిరి, -
"చిన్నపిల్లతల్లి నాయొద్దకువచ్చెను. వివాహము జరుపుటకు నేనుకూడ వొప్పుకొన్నాను. ఇందునిమిత్తమయి మిక్కిలి ఆవశ్యకముగాను అని వార్యమముగా కావలసిన సాధ్యమైనంత తక్కువసొమ్మును దయచేసి నాకు తెలు