256
స్వీయ చరిత్రము.
మొదలైన మిత్రులతో నాలోచించి, సభాహ్వానపత్రికను బంపి స్త్రీ పునర్వివాహ పక్షాభిమానులయిన నామిత్రులను వారిమిత్రులను సమకూర్చి 1884 వ సంవత్సరము జూన్ నెల 22 వ తేదిని క్రొత్తసమాజము నొకదాని నేర్పాటు చేసితిని. ఈ నూతనసమాజము రామకృష్ణయ్యగారును నేనును గవర్రాజు గారును ఆత్మూరి లక్ష్మీనరసింహ గారును న్యాపతి సుబ్బారావు పంతులుగారునుజేరి పదునాఱుగురు సామాన్యసామాజకులతో నారంభమయినది. ఇది పూర్వసమాజముయొక్క యనుబంధమే యయినట్టును సమాజమువారి యాదరణక్రింద వివాహము చేసికొన్న వారందఱును నిందు సామాజికులయినట్టు పరిగణింపఁబడునట్టును నేర్పఱుపఁబడినది. సమాజములో నేడుగురు కార్యనిర్వహక సంఘముగానుండుటకును, వారిలో నాఱుగురు సామాజికులచేతను ఒకరు వివాహములుచేసికొన్న వారచేతను ఏటేట ఎన్నుగొనఁబడుటకును, నిర్ణయముజరిగి, శ్రీపైడా రామకృష్ణయ్యగారును నేనును బసవరాజు గచర్రాజుగారును ఆత్మూరి లక్ష్మీనరసింహము గారును న్యాపతి సుబ్బారావు పంతులుగారును ఆచంట లింగరాజుగారును సామాన్య సామాజికులచేతను సోమంచి భీమశంకరముగారు పెండ్లికుమారులచేతను ప్రథమకార్య నిర్వాహక సంఘముగా కోరుకొనఁబడితిమి. మొదటినుండియు నున్నట్లు నన్ను సమాజ కార్యదర్శినిగాను, లక్ష్మీనరసింహముగారిని కోశాధిపతినిగాను, గవర్రాజుగారిని గణకునిగాను, సుబ్బారావు పంతులుగారిని కార్యనిర్వాహక సంఘ కార్యదర్శినిగాను, భీమశంకరముగారిని సహాయ కార్యదర్శినిగాను, ఏర్పఱిచిరి. సమాజమేర్పడిన యాదినముననే సకుటుంబముగా ఒక సేవకునితోను సమాజ పురోహితునితోను వివాహపక్ష వ్యాపనముచేయుటకయి చుట్టుపట్ల మండలములలో సంచారముచేయుమని నన్ను గోరుటకును, నాప్రయాణ వ్యయములను సమాజమువారే భరించుటకును, ఒక నిర్ణయము చేయబడినది.
ఈవఱ కిదియంతయు సరిగానేయున్నదిగాని దీనిని నిర్వహించుటకు ధనము కావలెను. 1882 వ సంవత్సరము జూన్ నెలలో శ్రీపైడా రామ