నాల్గవ ప్రకరణము.
245
కాకినాడలోని తమయిండ్లలో నొకదానినినిచ్చిరి. తొమ్మిదవ వివాహచేసికొన్న సలాది రామయ్యగారికి రామకృష్ణయ్యగారు కాకినాడలో నొకతాటాకుల యిల్లిచ్చిరి. కోదండరామయ్యగారప్పు డిరువదిరూపాయల జీతముగల యుపాధ్యాయ పదమునందుండి నందున సమాజమునుండి ధనసహాయ్యమును కోర నక్కఱలేనిస్థితిలోనుండెను. అయినను వివాహమయిన నెలదినముల కాయన క్రిందితరగతిలో చదవుకొనుచున్న తనపెద్దతమ్ముని నావద్దకుఁ దీసికొనివచ్చి విద్యనిమిత్తము సాయము చేయవలెనని కోరెను. నేను ఫిబ్రవరు నెలలో నాలుగురూపాయ లిచ్చితిని ; అతఁడు మరల మార్చినెలలో వచ్చి యడుగఁగా వెనుకటివలెనే నాలుగురూపాయ లిచ్చితిని ; మూడవనెలలోవచ్చి నాలుగు రూపాయలు చాలుచుండలేదనియు నెక్కువ యియ్యవలసినదనియుఁ గోరెను. అప్పుడు నేనేప్రిల్ నెల కయిదురూపాయలిచ్చి, యాయనయెదుటనే పుస్తకములో పద్దువ్రాసితిని. అదిచూచి యాయన నాతమ్మునికిచ్చినట్టు వ్రాయక నాకిచ్చు చున్నట్టు వ్రాయుచున్నా రేమని యడిగెను. మీచేతికిచ్చుచున్నాను గనుక నేనట్లు వ్రాయుచున్నాను. మీతమ్మున కెందునకనియిచ్చినట్టు వ్రాయను ? అని యడిగితిని. మీరు వివాహముచేసికోనివారికి వారి కియ్యలేదా వీరికియ్య లేదాయని కొన్ని పేరులుచెప్పెను. అప్పుడు వివాహనిధిలేదుగనుక నాసొంతములో నుండి యిచ్చుచుంటిని. ఇప్పుడట్లిచ్చుటకు వీలులేదని బదులు చెప్పితిని. అట్లయిన నిప్పుడు మంగళగిరి కృష్ణమూర్తికేల యిచ్చుచున్నారని యాయన యడిగెను. చెలపతిరావు మఱదలిని వివాహముచేసికొనట కతడొప్పుకొన్నందునను, ప్రవేశపరీక్షతరగతిలో చదువుకొను చున్నందునను, అతనికిచ్చుచున్నానని బదులుచెప్పితిని. మీయిష్టము వచ్చినవారికిచ్చి మీ యిష్టమువచ్చినట్లు చెప్పుదురని యాయన గొణుగుకొనుచు వెడలి పోయెను.
అతి కష్టపడుచుండుటవలనను, స్వాభావిక శరీరదౌర్బల్యమువలనను, నాదేహస్థితి కొంతచెడి యప్పుడు విశ్రాంతిని కోరునదిగానుండెను. అందుచేత నేను నరసాపురమునకుఁ బోవఁదలఁచుకొని యక్కడ డిస్ట్రిక్టు మునసబుగా