నాల్గవ ప్రకరణము.
235
తలఁచుకొని వచ్చెనుగాని యింతలో కళ్యాణముతోసికొని వచ్చినందున గోదావరీక్షేత్ర మహిమనుబట్టి బ్రహ్మచారిగా వచ్చినవాఁడు గృహస్థుఁడుగా మాఱుట తటస్థించెను. విస్సయ్యగారు కాకినాడ మఱునాఁడుచేరి యింట వంట ప్రయత్నము లేకపోఁగా మా వంటబ్రాహ్మణుఁడు రాలేదాయని యచ్చటి వారిని విచారించెను. వారు గతరాత్రియే రాజమహేంద్రవరములో మీబ్రాహ్మణుని పెండ్లియైనదని చెప్పఁగా నద్భుతపడి, సభముగిసి స్వగ్రామమునకుఁ బోవునప్పుడు మాయింటికివచ్చి నన్ను చూచి వధూవరుల నాశీర్వదించిపోయెను. అయిదవ వివాహమునకు వంటబ్రాహ్మణుడు లేచిపోఁగా నాభార్యయే గోదావరినుండి నీళ్లు మోచుకొనివచ్చి వంట మొదలైన పనులెల్లను స్వయముగా చేసియెంతోకష్టపడవలసినదయ్యెను. ఈకార్యములయందు నావలెనే నాభార్యయు బద్ధాదరముకలదయి సర్వకష్టములను సంతోషపూర్వకముగా సహించి నన్ననుసరించుచు సహధర్మచారిణి యన్న పేరన్వర్థము చేయుచుండెను. నా భార్యయొక్క యానుకూల్యమే లేక యుండినయెడల నేనిన్ని కార్యములను నిరంతరాయముగా నిర్వహింప లేక యుందునేమో ! ఈవివాహము వంటలు మొదలైనవి చేయఁగలిగిన శ్రోత్రియబ్రాహ్మణునకే చేసి వంటబ్రాహ్మణుల వలని బెదరింపులను తప్పించుకోఁగలిగితిమి. బ్రాహ్మణులలో వివాహములు తఱచుగా జరగుచుండుటవిని యొక వైశ్యవితంతువు తనకొమార్తెయైన పదేండ్ల యీడుగల బాలవితంతువును దీసికొనివచ్చి పరిణయము చేయవలసినదని నా పాదములమీఁదఁ బడవైచెను. వివాహము చేసికొనెదమని యావఱకే నావద్ద తిరుగుచున్న యిరువదియేండ్ల యీడుగల బోడా శ్రీరాము లనుకోమటిచిన్న వానికిచ్చి యాచిన్న దానిని 1883 వ సంవత్సరము ఏప్రిల్ నెల 11 వ తేదిని వివావహముచేసితిని. ఏడవదియైన యిదియే మొదటివైశ్య వితంతువివాహము. మూడవదియైనమాధ్వ వివాహము జరిగినప్పుడు పల్లకిచుట్టును రక్షకభటులు కావలి యున్నను రాళ్ళురువ్విన కాలము పోయి, ఏడవదియైన యీకోమటి వివాహము జరగునప్పటికి ఒక్క విద్యార్థుల యొక్క సాయముతక్క రక్షకభటుల