పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

225



కొమారితతండ్రి మాకావఱకు వ్రాసియిచ్చిన యుత్తరమును జూపఁగా, తన్ను గదిలోపెట్టి కొట్టెదమని బెదరించి యాయుత్తరమును బలవంతముగా వ్రాయించి పుచ్చుకొంటిమని చెప్పెను. అభియోగము కొట్టుపడిపోయిన తరువాత నతఁడు మాయింటికివచ్చి క్షమార్పణముచేసి, యీవ్యవహార నిమిత్తమయి రాజమహేంద్రవరములో నుండవలసివచ్చుటచేత తనకు పదిరూపాయ లప్పయ్యెనని చెప్పఁగా నేనాపదిరూపాయలు నిచ్చివేసితిని. వివాహనిర్వర్తన విషయమయిన యేర్పాటులుచేసిన మిత్రులు మొదటి వివాహమునకు వలెనే బోగముమేళమును కుదిర్చి నాకు తెలియకుండ ముందుగా రెండురూపాయ లిచ్చిరికాని యీవివాహకార్యనిర్వహణమంతయు పూర్ణముగా నాచేతిలోనే యున్నందున ఊరేగింపు సమయమునందు సహితము బోగముమేళము లేకుండఁ జేసితిని. ఈ వివాహముతోనే ప్రతిపక్షులగర్వము సగమడఁగేను గాని తరువాత జరిగిన నాలవ వివాహముతో వారికి పూర్ణముగా గర్వభంగమయినది. ఈవివాహవార్తను మిత్రులకును పత్రికలకును తంత్రీ ముఖమునఁ దెలుపుట కయి నేను పెండ్లినాటిరాత్రి 15 రూపాయలు వ్యయపెట్టితిని. ఈశుభవార్త తెలియఁగానే 24 వ తేదిని గవర్రాజుగారు విశాఖపట్టణము నుండి నాకిట్లు వ్రాసిరి. -

"ప్రియమిత్రుఁడా !

ప్రార్థించుచున్నాను. నాహృదయపూర్వకములైన సస్నేహాభినందనముల నంగీకరింపుఁడు. చక్కగా చేయఁబడినది ! ఈశ్వరునకు వందనములు. నాసంతోష మనిర్వాచ్యమైనదిగానున్నది. ఓర్పు, సమస్తకష్టములను గట్టెక్కించునుగదా ! కొందఱు మిత్రులు నొరాశనుపొందిరి. వారు మఱివివాహములు జరగవని తలఁచిరి. వారిఁకముందు వివాహములు జరగుట యసాధ్యమని భావించిరి. వారికందఱికిని మీరిప్పు డాశాభంగము ననుకూలముగా కలింగించినారు. సంస్కారప్రియులని చెప్పఁబడువారియొక్క నిష్కాపట్యమును పరీక్షించుటకయి మఱియొక శోధనవచ్చినది. ఈయవకాశమువలని