ద్వితీయాద్యాయము
37
యొక యపూర్వ వ్యాఖ్యానమును గావించిరి.. ఇందలి ఫలితార్థ మేమున
బౌలసఖుఁడదానికి వీరేశములింగముగారికొక రీతిగను, లక్ష్మణరావు
గారు"వేఱొక రీతిగను తేట తెల్ల మగుచున్నది కదా! శ్రీ వీరేశలింగ
ముగారు ముప్పది యైయేండ్ల వానిని గూడ బాలుడనుట నత్యాశ్చచర్యము
గా నున్నది. పదునారేడ్ల వయస్సునకు దక్కువ వయస్సు గల
మగవానిని బాలుడనియు, పదునారేండ్కు దక్కువ వయస్సు గల
యాడుదానిని బాలిక యనియు వ్వవహరించుట గలదు. వీరేశలింగముగారు బాల
సఖుడను దానికి బాలుడైన సఖుడని యర్దము చేసి నట్టు గంపట్టు చున్నది.
లక్ష్మణ రావు గారు చెప్పినది యుక్తి యుక్తముగా నున్నటులు పైకి గంపట్టుచున్నను
దానిని బాధించు విషయములు కొన్ని లేక పోలేదు. ఇఱువదియై దేండ్ల
వానిని బాలునిగాఁ జేసిన నీరేశలింగము రాబాల ప్రాయమున హరవిలాసమును
అంతకు బూర్వమే శృంగార నైషదమును రచించెనని చెప్పుట యుక్తి యుక్తముగా
గన్పట్టుచుండ లేదని కాఁబోలుఁ బ్రథమ సమా వేశకాలమునకుఁ
బదిసంవత్సరముల తరువాత హరవిలాసమును కృతి యిచ్చినట్లుగా
జెప్పినారు. ఇదియొక యద్భుతకల్చనము. బాలుడైన సఖుఁడని
యర్ధము యర్గము చేసుకోవలసి వలసిన పక్షమున హరవిలాస
రచనా కాలమున శ్రీనాథుడు పదునాఱేండ్ల లోపు వయస్సు గలబాలుఁడని
యర్థము చేసుకొనవలయునే గాని వీరేశలింగముగారియసంబద్ధ
వ్యాఖ్యానము సరిపడ దని నిస్సంశయముగా: జెప్పుఁదగును.
ఏఁబ దేండ్ల వయస్సు గలిగిన వాఁడు మాత్రము 'మంటి బహువత్స
రంబులు' అని యనుకొను నన్న నంతవిశ్వాసపాత్రముగా గన్పట్టదు.
శ్రీ మాన్ ఉప్పల వేంకటనర సింహాచార్యులు గారు హరవిలాస పీఠికలో
నిట్లు తెలిపియున్నారు,
"హరవిలాసము లో నీతడు "మంటి బహువత్సరములు” అని