ద్వితీయాధ్యాయము
33
గూడ నుండియుండును. కాఁబట్టి కృతిభర్తయైన యీసాళువనృసింహ
రోజును, కృతిక ర్తయైన పినవీనన్నయు శ్రీనాథుని యంత్య కాలములోను.తదనంతర కాలములోను జీవించి యుండినట్లిందువలన ..దేలుచున్నది.ఈ మహకవి 1480 వ సంవత్సర ప్రాంతమువఱకును జీవించి యుండవచ్చును. గనుక, శ్రీనాధకవి వార్థఖ్యదశలో వున్నప్పు డితఁడు యౌవనదశయం దుండి యుండుసు . "దానిని బట్టి చూడగా శ్రీనాథుఁడు తానాంధ్రీరకరించిన నైషధము గొనిపోయి ఇప్పుడు జునులకొనునట్లు కవినాగ్రగణ్యుఁడని మభినవముగా బేరొందు చుండిన మహా విధ్వాంసుఁ
డైన పిన వీరనకుఁ జూపియుండును. పినవీరభద్రుని జీవిత కొలములోనే
శ్రీ నాదుడాతనికి బూర్వక యైనందున శృంగార శాకుంతల కృతిపతి
యైన సన్న మంత్రి "సీ. శ్రీనాధ భట్టభాషా నిగుంభ బుల పరిమంళం
బుఁ గూడ బరవ నేర్చు" నని పినవీరన కవిశ్వమును శ్లాఘించెను " అని
వ్రాసియుంచుటచేత శ్రీనాథుఁడు 35 యేండ్లు జీవించియున్నట్లు తేలుచు
న్నది గదా!
ఈ పై విషయముల నన్నిటిని మనము పరిశీలించి శ్రీనాథుఁని
జన్మకాలమును నిర్ణయింపవలసి యుండును. ఇట్లు పరస్పర విరుద్ధాంశము
లను సమన్వయించుట సాధ్యముగాదు. ఇందేవి సత్యములో, ఏవిసత్య
ములు కావో సిద్ధాంతము చేయుట బహుకష్ట సాధ్యమైనను సాధి
పవచ్చును. వీని నిష్పక్షపాతబుద్ధితో విమర్శించి చూతము. వేంకట
లక్మణ రావుగారును, వీరేశలింగముగారును, హరవిలాస కాలమును బట్టి
శ్రీనాథుని జన్మకాలమును నిర్ణయించి, గ్రంథాలయ సర్వస్వములో
శ్రీలక్ష్మణ రావు గారు హరవిలాసమును గూర్చి : ----
"ఈశాన్యమునందు శ్రీ నాథుని కావ్యముల కాలనిర్ణయము
చేయటకు మంచిస్థానముకలదు. అందును గుఱించి యిచ్చట
గొంత చర్చించెదను.