254
శ్రీనాథకవి
స్కౌందపు కాణమందలి శంకరసంహితలోని దని శివరాత్రి మహాత్మములోని
ఉ.తాపస సార్వ భౌములు సదా శివరాత్రి మహావ్రతంబు దో
షాసహృతిక మంబు విను డాదరణంబున నేను సద్గురు
శ్రీ పదపద్మముల్ దలఁచి చే ప్పెద శంకర సంహితాకథా
దీపిక భవ్యమార్గమునఁ దేటపడన్ మొదటింటి నుండియున్ .
,
కవి యీ గ్రంథమును త్వరితముగా ముగింపవలసిన నాఁడగుట చేత
నో' లేక మహాకవి యగు బాణుని యందుగల యత్యం తాభి మానము
చేతనో కాదంబర్యనుసరణము నెక్కువగాఁ జూపియున్నాడు.
మఱియు మన కుపలబ్ధమయిన ప్రతి గూడ నాలుగా శ్వాసముల
గ్రంథమై చతుర్థాశ్వా సొంతమున నున్న
<poem> గీ. పరమ మునులు సూ త్యాహసంభవు సూతు
భక్తి బూజించి యధిక తాత్పర్య గరిమ
భటులు ప్రమధులచే భంగపడుట చూచి
చిన్న బోయి యముండేమి చేసిఁ బిదప,,.
అను గీత సద్యమ వలన సమగ్రమయిన దట్లు - స్పష్టనుగు చున్నది
ఇట్ల సమగ్రమై గంథపాతములతోఁ గూడి శిథిలాతి శిథిలమై యున్న
ప్రతిలోని పదజాలమును బురస్కరించుకొని నిరాధారము లయిన
యపోహలతోఁ జేయు నాక్షేపణములకు బత్యుత్తరమును జెప్పుట
గ్రంథము విస్తరింవఁ జేయుటకు మాత్రమె తోడ్పడును సంశయగ్రస్త
మాససమూల సంతృప్త పఱుప జాలదని ఈ విషయ మీంతటితో
విరమించుచున్నాను.