పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః


తక్కిన యెల్లధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము. ఎల్లపాపముల నుండియు నేను నిన్ను విడిపించెదను. దుఃఖింపకుము. 18-66


(25)

అంతయు నొకటి

(గీత: అధ్యాయములు 5, 6, 8, 13, 18)


మనస్సును అరకట్టి చేయు కర్మములను భగవంతుని కర్పణముగా చేయుచు వచ్చిన యెడల, జీవలోకమంతయు నొక్కటేయను జ్ఞానప్రకాశమును పొందకలుగును. తానని ఒరులని భేదము విడిచి యెల్ల ప్రాణులును పరమాత్మయందు నిలుచు మనోభావమును పొందుటే గీతలో చేయబడిన ఉపదేశము. ఆత్మను అజ్ఞానమనునది చుట్టుకొని జ్ఞానజ్యోతిని మరుగుపరచును. ఈ అజ్ఞానమును పోగొట్టి ఆత్మలో జ్ఞాన ప్రకాశమును ఉదయించునట్లు చేసుకొన్నయెడల ఆమార్గమును పట్టినవాని కంటికి, విద్యయు, కళలును, శీలమును గలిగిన పండితుడును, దేనినినేర్వని యొక పామరుడును