పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75


సీ. ఎవ్వని గుణజాల మెన్న జుహ్వలులేక నళినగర్భదు లనంతుఁ డుండ్రు

కోరెడు విబుధేంద్రకోతి నొల్లక లక్ష్మి ప్రార్థంచె నెవ్వని పాదరజము

బ్రమ్హ యెవ్వని పాదపద్మంబు గడిగిన జలము ధన్యత నిచ్చె నుల కెల్ల

భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు నెవ్వఁ డర్థకతి నేపుమిగులు

ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది, సంగకోటినెల్ల సంహరించి

ప్రాభవమున మునుల పారమహంస్యంబు, నొంది తిరిగి రాకయుందు రెలమి. (448)


చ. క్రమమున మింటికై యెగయుఁ గాక విహంగము మింటిదైన పా

రము గననేర్చునే ? హరిపరాక్రమ మోపినయంత గాఁగ స

ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁ డర్యములార ! నారు చి

త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్. (449)

పరీక్షిన్మహారాజు శృంగి వలన శాపంబు నొందుట

క. వేదండ పురాధీశుఁడు, కోదండము చేతఁబట్టికొని గహనములో

వేదండదుల నొకనాఁ , డే దండలఁ బోవనీక యెగదెన్ బలిమిన్. (450)


క. ఒగ్గములు ద్రవ్వి పడుమని, యొగ్గెడు పెనుదెరల పలల నుగ్రమృగమ్ముల్

డగ్గఱినఁ జంపువేడుక, వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్. (451)


క. కోలముల గవయ వృక శా, ర్దూలములఁ దరక్షు ఖడ్గ రోహిష హరి శుం

డాలముల శరభ చమర, వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్. (452)


క. మృగయుల మెచ్చ నరేంద్రుఁడు మృగరాజపరాక్రమమున మెఱసి హరించెన్

మృగధరమండలమునఁ గల, మృగ మొక్కటిఁ దక్క నన్యమృగముల నెల్లన్. (453)


వ. ఇట్లు వాటంబైన వేఁట తమకంబున మృగంబుల వెంటం దగిలి బుభుక్షా పిపాసలఁ బరిశ్రాంతుండై ధరణీకాంతుండు చల్లన నీటికొలంకులు గానక కలంగెడు చిత్తం బుతోఁ జనిచన యొక్క తపోవనంబు గని యంచు. (454)


సీ. మెలఁగుటఁ జాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడతలేక

ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియంబుల, బహిరంగవీథులఁ బాఱనీక

జాగరణాదిక స్థానత్రయము దాఁటి పదమమై యొండెడి పదము దెలిసి

బ్రహ్మభూతత్వ సంప్రా ప్త్యవిక్రియుఁ డయి యతిదీర్ఘ జటలు ద న్నావరింప