పుట:Shriiranga-mahattvamu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

189


మ.

దరదిందీవరదామధాముఁ డగు నీతారుణ్యతేజోధికుం
డరయం బన్నగరాజతల్పుఁ డగు హేమాభాంగి యీ పల్లవా
ధరి పద్మాలయ వీరు సిద్ధపురుషుల్, దా నట్లుగాకున్న నీ
ద్ధర నెవ్వారికిఁ గల్గు నిట్టి భువనోదాత్తప్రభావోన్నతుల్.

186


చ.

అని కొనియాడ నమ్మునుల కప్పురుషోత్తముఁ డిట్లనుం దపో
ధనవరులార! మీర లిటు తర్క మొనర్చుట యేమికారణం
బెనయ విరోధముల్ దొఱఁగి యేకమనస్కులు గాక కూడివ
చ్చిన కత మేమి? నా కెఱుఁగఁజెప్పఁగఁ బోలినఁ జెప్పుఁ డేర్పడన్.

187


సీ.

అనిన నప్పుండరీకాక్షున కాతపో
ధనులు వారల వివాదములతెఱఁగు,
సకలంబు జెప్పి యాజయపరాజయముల
నేమతంబుల నిర్ణయింపలేక,
సందేహమునఁ బొంది చర్చించుచున్నార
మీప్రదేశంబున నిట్లుగూడి
యనఘాత్మ! సకలలోకానన్యసామాన్య
భవ్యలక్షణసముద్భాసితుఁడవు


తే.

ప్రవిమలజ్ఞానమును, బుద్ధిబలము, నీకు
నమరు నాకారసమములై, యట్లు గాన
నొండు దలఁప నగణ్య మొకింత లేదు
నీవ యర్హుఁడ వింతయు నిశ్చయింప.

188


వ.

అనిన నమ్మునిబృందంబునకు నందకహస్తుం డిట్లనియె.

189


క.

విను, విప్రుండును, బులియును
వినుతప్రజ్ఞావిశేషవిదు లిరువురు ప
ల్కిన పల్కులు గా వనఁగా
జన వఖిలపురాణశాస్త్రసమ్మత మగుటన్.

190


సీ.

అఖిలరూపములఁ గర్మానుభూతశరీర
ధారులగా నాది తా సృజించి,