Jump to content

పుట:Shriiranga-mahattvamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

147


బిన్నవాఁ డెట్టియెడలను బెద్దవారి
నీడ దాటించుచుం జనఁగూడ దెపుడు.

266


క.

గురుసముచితశయనాసన
వరవాద్యప్రముఖగేహవర్గము జడుఁడై
చరణమున నాక్రమించిన
నరుఁ డరుగు ననేక ఘోర నారకములకున్.

267


వ.

సకల ధర్మంబు లందును సాత్వికంబు పరమధర్మం, బిది యవలంబించి చరి
యించు నిర్మలాత్ములు-మనోవాక్కాయకర్మంబులఁ బరాత్ము లగునెల్లవారికి
గురువు, లట్టిపుణ్యపురుషులయందు సదా సన్నిహితుండై యుండుఁగావునఁ
దచ్ఛాయఁ ద్రొక్కిచను దుష్కృతచిత్తులకు నిష్కృతి గలుగనేర దని చెప్పి
యప్పితామహుండు వెండియు నిట్లనియె.

268


తే.

కుష్ఠరోగాత్ము లగువారుఁ గుంటివారు
నంఘ్రిహీనులు గల రెవ్వ రట్టివారు
గతభవంబున శ్రీహరిప్రతిమనీడ
లంఘనము చేసి చనినపాలసులు శుక్ర.

269


చ.

నిగిడిన విష్ణుమందిరమునీడయు విష్ణునినీడయట్ల దా
టఁగఁ దగ దట్టిపాపము జడత్వము మైనొనరించు దుర్జనుల్
తెగి యమబాధలం బడి తుదం ధరపై జనియించి పలగులై
వగలఁ గృశించుచుండుదు రవారిత ఘోర రుజాదిపీడలన్.

270


తే.

తత్ప్రదక్షిణ మొనరించుతఱి నరుండు
కడఁగి తచ్ఛాయ మూఁడుభాగములు చేసి
యందుఁ బూర్వాంశమునఁ జను టర్హ మిట్లు
గాక, తక్కినయది దోషకారియండ్రు.

271


క.

వనజోదరుశుభగుణములు
గొనకొని కీర్తింప గేలిఁ గొనుచు నవజ్ఞం