పుట:Shriiranga-mahattvamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ద్వితీయాశ్వాసము


పారావారవసుంధరాతలమునం బ్రఖ్యాతులై సంతతో
దారైశ్వర్యసమగ్రు లైననృపు లుద్యత్సైన్యసంయుక్తులై.

115


ఆ.

వసుధలోన ధర్మకర్మ సురుచిర వి
ఖ్యాతి నెసఁగు చోళభూతలేశుఁ
డజతనూజ విరచి తానందవిభవాభి
రాముఁడైన రంగధాముఁ జూచి-

116


క.

ఆదేవు దివ్యమూర్తి
శ్రీ దనచిత్తమునఁ గదియఁ జేర్చి నితాంతా
మోదామృతమునఁ బులకలు
జాదుకొనం జూడ్కి దివియఁ జాలక మదిలోన్.

117


మ.

అతులంబైన తపోవిశేషమున నీయబ్జాక్షు నిక్ష్వాకుఁ డీ
గతి మెచ్చించి విరించిమందిరసురంగం బైనరంగంబు నూ
ర్జితశక్తిం గొనివచ్చె నిచ్చటికి, నారీతిన్ మహావైష్ణవ
వ్రతనిష్ఠారతిఁ బూని మత్పురికి రాఁ బ్రార్ధింతు నిద్దేవునిన్.

118


చ.

అని తలపోయుచున్ దశరథాధిపు యాగము సుప్రయోగమై
యొనరినదాక నయ్యెడన యుండి యతండు దుదిం బ్రియంబునన్
ఘనముగఁ జేయు సత్కృతులు గైకొని క్రమ్మఱ నాత్మపట్టణం
బున కరుదెంచి నిర్బర తపోనియమోద్యమ చిత్తవృత్తుఁడై.

119


తే.

ఇందు పుష్కరిణీతటి కేఁగి యచటఁ
దపము గైకొన నానృపోత్తముని జూచి
తత్సమీపంబునందు నితాంతనియతిఁ
బాయకున్న మునీశ్వరప్రకర మెలమి.

120


క.

ఓ నరనాథోత్తమ! నీ
మానసమున నేమికోర్కి మసలినఁ దపముం
బూనెద వది చెప్పఁగఁ దగు
నేనియు నెఱిఁగింపు మనిన నృపుఁ డిట్లనియెన్.

121