పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఆపిదప నీక్రిందివిధమున సహదేవుఁడు సభవారిం గూర్చి పలికెను:-

శ్లో. "కేశవం కేశిహంతార మప్రమేయపరాక్రమం!
    పూజ్యమానంమయాయోపః కృష్ణంససహతేనృపః!
    సర్వేషాంబలినాంమూర్థ్ని మయేదంనిహితంపదం!
    ఏవముక్తేమయాసమ్య గుత్తరంప్రబ్రవీతు సః!
    మతిమంతశ్చయేకేచిదాచార్యంపితరంగురుం |
    అర్చ్యమర్చితమర్ఘ్యార్హ మనుజానంతుతేనృపాః!! "

అనఁగా అపరిమితపరాక్రమసంపన్నుఁడయిన శ్రీకృష్ణుని ధర్మరాజు ననుమతిచే నేను బూజింపుచుండఁగా మీలో నే రాజు సహింపఁడో యట్టిబలవంతులగు నందరితలలమీఁదను నే నీపాదమును మోవుచున్నాను. ఇట్లు నేఁ బలుకుచుండ నట్టియగ్రపూజను సహింపనియారా జుత్తరము చెప్పునుగాత.

ఈసభయందు బుద్ధిమంతులయిన యేరాజులు కలరో వారు ఆచార్యుఁడును, తండ్రియును, గురువును, పూజార్హుఁడును నగు నీ శ్రీకృష్ణులవారిని బూజించుటకొర కంగీకరింతురు గాక?"

అప్పు డతనిమీఁద బుష్పవృష్టిఁ గురిసెను. మునులు మెచ్చుకొనిరి.