పుట:Saptamaidvardu-Charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

సప్త మైడ్వర్డు చరిత్రము.


యొక్క. యువరాజు తట్టమ్మవారిచేఁ బీడితుఁడై ఉండినందున అవ్వ మరణ సమయంబున సింగ్లండునకు రాఁజాలక ఉండెను. ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చిన రెండవ యేఁట నాయన కుమా రుఁడు ఇంగ్లండు విడిచి తమ్మిది నెలలు బైటఁ దిరిగి యావల దనదేశమునకు నే తెంచెను.

1901స. న. విక్టోరియా స్వర్గస్థురాలయ్యెను. ఆప్రికా ఖండంబున బోయర్ల తో డీ యుద్ధము పరిసమాప్తి "కాక యుం డెను. అందు ననేకులు రాజునకై ప్రాణములను గోలు పోవు చుండిరి. ఆగస్టు నెలలో నెడ్వెర్డుతో బుట్టువు వ్యాధిచేఁ బీడితు రాలై కాలధర్మము మొదెను. అతఁడు ఆయమ చావు కాల మునఁ జెంగట నుండుటకు వీలు లేక పోయెను గానీ, ఆయు మకుఁ బరలోక క్రియలు జరుగునపుడు భార్యాసహితుఁ డై వచ్చి, ఆచోటఁ గొన్ని దినము లుండి, పిదప డెనార్కు రాజ్యమునకు నేఁగి, అట నేతెంచిన రుప్యా చక్రవర్తులు మున్నగు వారికి దర్శనం బొసంగి, ఇంగ్లండునకుఁ బుత్తెంచెను.

1912సం. స ఎడ్వర్డునకుఁ బట్టాభిషేక మహోత్సవము నడుచుటకు మంత్రు లుద్యమములు సేయసాగిరి. ఎడ్వర్డు పార్ల మెంటును రాజై తెఱగెను. అతఁడు గొప్పవారికి విందు చేసెను. ఎడ్వర్డ లెగ్జాండ్రుల పట్టాభి షేకమహోత్సవ మతి వై భవంబున జరుగు నని జనులు అనేక దేశములుముడి లండను పురికీ 'రావలయు నని కోరు చుండిరి. మంత్రులు ఆపురవరము