ఈ పుట ఆమోదించబడ్డది
[39]
అష్టమాశ్వాసము.
609
యనురక్తిఁ దనదేవి నటఁ బుట్టినింటి
కనిపెడుకైవడి ననిపి గొబ్బునను
జెన్నొందు నాహస్తిశిఖరమందిరుని
సన్నిధానంబున జనులెల్ల వినఁగఁ
దక్కక సోదరీతనయుదాశరథి
దక్కఁ దా సకలబాంధవుల డించితిని
అని హస్తిశైలనాయకునిచే సర్వ
జనులు సన్నుతి సేయ సన్న్యాస మంది
తనగురుం డగుహస్తిధరణీధ రేశు
ననుమతి మఠమున కరుదెంచినంత
నాశ్రితసురభూజ మగువేల్పుచేత
నాశ్రమస్వీకార మలవడం జేసి
యలలక్ష్మ ణాచార్యుఁ డని సర్వజనులుఁ
బలుక రామానుజభక్తమందారు
చెలియలికొమరుఁ డాశ్రితపారిజాత
[1]మలఘుప్రతిష్ఠితునంశ మైనట్టి
సలలితగురుఁడు దాశరథి యవ్వేళఁ
దను నొండు దక్కంగఁ దక్కినబంధు
జనము డించితి నని సన్న్యసించుటయు
విని యమ్మహాత్ముఁ డెవ్విధి నన్ను విడువ
ననియెఁ గృతార్ధుండ నైతిఁ బొమ్మనుచు
- ↑ మలసు