ఈ పుట ఆమోదించబడ్డది
580
పరమయోగివిలాసము.
పట్టి నీనోరు నాపాదుకచేతఁ
గొట్టుమంటివి నిన్నుఁ గొట్ట నేమిటికి
నినుఁ గాచి మెచ్చితి నృపపురోహితుఁడ
వని యన్న సభవార లగ్గించి రతని
నామహీపతి కడు నచ్చెరు వంది
యామునాచార్యున కవనతుం డగుచుఁ
దనపురోహితుఁ దెచ్చి తచ్ఛిష్యుఁ గాఁగ
నొనరించి యెంతయు నుపచరింపుచును
మును తనదేవి కిమ్ముల నిత్తు ననుచుఁ
దనసీమలోన నర్ధము పంచి యొసఁగ
నాదేవి తనసీమ యామునేయునకు
నాదట నిచ్చె నెయ్యమునఁ బూజించి
యనిపినం గ్రమ్మఱ యామునేయుండు
చనుదెంచి నిజనివాసంబున నిలిచి
యాలేమ యొసఁగినయర్ధరాజ్యంబు
నేలుచు నుండె ననేకవైఖరుల
నీరీతి నంతయు నెఱిఁగి మోదించి
శ్రీరామమిశ్రుఁ డంచితభక్తితోడ
యామునేయునకు రహస్యార్థవితతి
తా ముపదేశింపఁ దలఁచి వేంచేసి